Ap News: యువతిపై ప్రేమ వల.. డబ్బు కోసం కిడ్నాప్
ఇన్స్టాగ్రామ్లో పరిచయమై స్నేహంగా చాటింగ్ చేశాడు.. ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు.. లాంగ్ డ్రైవ్కి వెళ్దామని చెప్పి తన కిడ్నాప్ పథకాన్ని అమలు చేశాడు.
రాజమహేంద్రవరం నేరవార్తలు: ఇన్స్టాగ్రామ్లో పరిచయమై స్నేహంగా చాటింగ్ చేశాడు.. ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు.. లాంగ్ డ్రైవ్కి వెళ్దామని చెప్పి తన కిడ్నాప్ పథకాన్ని అమలు చేశాడు. అసలు విషయం తెలుసుకొని అప్రమత్తమైన యువతి పోలీసుల సాయంతో సురక్షితంగా బయటపడింది. కేసు వివరాలను రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి మీడియాకు వెల్లడించారు.
పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం పూసలమర్రు గ్రామానికి చెందిన ఎం.ఫణీంద్ర చిన్నతనం నుంచే చోరీలకు పాల్పడే వాడు. భీమవరం పరిధిలోని పలు పోలీసు స్టేషన్లలో అతనిపై చోరీ కేసులు నమోదయ్యాయి. ఆరు నెలల కిందట తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలానికి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థినికి ఇన్స్టాగ్రామ్లో పరిచయమయ్యాడు. కొన్ని నెలలు స్నేహంగా చాటింగ్ చేసిన తరువాత యువతిని ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. ఈ నెల 15న యువతిని ద్విచక్ర వాహనంపై లాంగ్ డ్రైవ్ వెళదామని ఒప్పించాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన ఆమెను పథకం ప్రకారం.. ఫణి ద్విచక్ర వాహనంపై తీసుకుని బయలుదేరి కాకినాడ, అమలాపురం, పాలకొల్లు మీదుగా భీమవరం తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధం చేసుకున్న ఓ అపార్ట్మెంటు ఫ్లాటులో ఆమెను ఉంచి బయటకు వచ్చి యువతి తండ్రికి ఫోన్ చేసి రూ. 5లక్షలు ఇవ్వకపోతే కుమార్తెను చంపేస్తానని బెదిరించాడు. కంగారు పడిన అతడు.. రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి సీఐ సుభాష్ డీఎస్పీ సంతోష్ నేతృత్వంలో పలు బృందాలు ఏర్పాటుచేసి యువతి కోసం గాలింపు చేపట్టారు.
ఫణి ప్రవర్తపై అనుమానం వచ్చిన యువతి నిలదీసే సరికి కత్తితో ఆమె చేతిపై గాయపరిచి బెదిరించాడు. అతడి వద్ద బంధీగా ఉన్న యువతి 16వ తేదీ మధ్యాహ్నం ఫ్లాటుకు తాళం వేసి ఫణి బయటకు వెళ్లడం గమనించింది. తాళం వేసిన తలుపును లొపలి నుంచి గట్టిగా తట్టడంతో పక్క ఫ్లాటువాళ్లు గమనించారు. తాళం వేసిన ఇంట్లో ఎవరో ఉన్నారని తెలుసుకుని స్థానిక మహిళా పోలీసు ఎన్.నాగ భవానీకి సమాచారం ఇచ్చారు. బాధితురాలి నుంచి విషయం తెలుసుకున్న ఆమె పోలీసులను అప్రమత్తం చేయడంతో అర్బన్ పోలీసులు రంగంలోకి దిగారు. ఫ్లాటుకు తిరిగి వచ్చిన ఫణిని అదుపులోకి తీసుకుని యువతిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ కేసులో క్రియాశీలక పాత్ర పోషించిన మహిళ పోలీస్ భవానీని ఎస్పీ సత్కరించారు. సీఐ సుభాష్, ఎస్సైలు సుధాకర్, ఎండి జుబెర్, భీమవరం హెడ్ కానిస్టేబుల్ ఎ.శ్రీనివాస్ను ఎస్పీ అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు