Crime news: మరో ‘మహా’ ఘోరం.. 15ఏళ్ల బాలికను బ్లాక్మెయిల్ చేసి 29మంది అత్యాచారం!
మహారాష్ట్రలో మరో ఘోరం వెలుగుచూసింది. ఇటీవల ముంబయిలో నిర్భయ తరహా ఘటనను ఇంకా మరిచిపోకముందే.. ఠాణే జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది
ముంబయి: మహారాష్ట్రలో మరో ఘోరం వెలుగుచూసింది. ఇటీవల ముంబయిలో నిర్భయ తరహా ఘటనను ఇంకా మరిచిపోకముందే.. ఠాణే జిల్లాలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. పదిహేనేళ్ల బాలికపై గత కొన్ని నెలలుగా 29 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడుతున్న పాశవిక ఘటన కలవరపెడుతోంది. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగుచూసింది. నిందితుల్లో ఇద్దరు మైనర్ బాలురు ఉండటం గమనార్హం. వారంతా ఆమెను బ్లాక్మెయిల్ చేసి, బెదిరించి ఈ అఘాయిత్యాలకు పాల్పడినట్లు బాలిక తన ఫిర్యాదులో పేర్కొంది.
వీడియో చిత్రీకరించి.. బ్లాక్మెయిల్ చేసి!
డోంబివలీలోని మన్పడా పోలీసుల వివరాల ప్రకారం.. బాధితురాలి స్నేహితుడు, ఈ ఘటనలో ప్రధాన నిందితుడు.. తొలుత ఈ ఏడాది జనవరిలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో వీడియో తీశాడు. ఇది కాస్త మరో వ్యక్తి వద్దకు చేరడంతో.. అతను ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. వీడియోను బయటపెడతానని బెదిరించి, ఆమెపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇలా ఈ ఏడాది సెప్టెంబరు వరకు 29 మంది తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు నిందితులపై సామూహిక అత్యాచారం, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.
బాధితురాలికి తెలిసినవారే..
ఈ వ్యవహారంపై స్థానిక ఏసీపీ దత్తాత్రేయ కరాలే మాట్లాడుతూ.. ‘ఫిర్యాదు అందిన వెంటనే మేం స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ఇప్పటివరకు ఇద్దరు మైనర్లతోసహా 23 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నాం. నిందితులంతా బాధితురాలికి, ప్రధాన నిందితుడికి తెలిసినవారే. వారంతా ఆమెను బ్లాక్మెయిల్ చేస్తూ, వివిధ సందర్భాల్లో లైంగిక దాడికి పాల్పడ్డారు’ అని వివరించారు. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు చెప్పారు. నిందితుడు చిత్రీకరించిన వీడియోతో సహా ఇతర ఆధారాలను దర్యాప్తు బృందం సేకరిస్తోందన్నారు. ప్రధాన నిందితుడే ఆ వీడియోను ఇతరులకు పంపాడని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు