Accident: మహిళలపైకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురి మృతి

ఓ జంక్షన్‌ వద్ద వేచి వున్న జన సమూహంపైకి కారు దూసుకెళ్లింది. తమిళనాడులో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతి చెందారు.

Published : 16 Jul 2023 19:32 IST

విల్లుపురం: తమిళనాడు(Tamil Nadu)లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారు జామున ఓ జంక్షన్‌ వద్ద వేచి చూస్తున్న జన సమూహం పైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు మృతిచెందగా.. మరికొందరికి గాయాలైనట్టు అధికారులు వెల్లడించారు.  ప్రమాదానికి కారణమైన కారు ఈ ఉదయం పుదుచ్చేరి వైపు వెళ్తుండగా కీలపుతుపట్టు వద్ద దుర్ఘటన చోటుచేసుకుందని తెలిపారు. 

 ఈ ఘటనపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌(MK stalin) స్పందించారు. ఈ ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన.. మృతులకు రూ.2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు.  ఈ ఘటనలో ఒక మహిళకు తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరికి స్వల్ప గాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం వారిని ఆస్పత్రిలో చేర్పించారు. వారికి కూడా సీఎం ఆర్థిక సాయం ప్రకటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని