మోస్ట్వాంటెడ్ భలే దొరికాడు..!
కశ్మీర్ పోలీసులకు నేడు బాగా కలిసొచ్చింది.. కశ్మీర్లో బుర్హాన్ వానీ తర్వాత ఆ స్థాయి ఉగ్రవాదిగా పేరున్న మెహ్రాజుద్దీన్ హల్వాయి అనుకోకుండా దొరికాడు. 2013 నుంచి దళాలు
నాటకీయంగా మెహ్రాజుద్దీన్ హల్వాయి ఎన్కౌంటర్
ఇంటర్నెట్డెస్క్
కశ్మీర్ పోలీసులకు నేడు బాగా కలిసొచ్చింది.. కశ్మీర్లో బుర్హాన్ వానీ తర్వాత ఆ స్థాయి ఉగ్రవాదిగా పేరున్న మెహ్రాజుద్దీన్ హల్వాయి అనుకోకుండా దొరికాడు. 2013 నుంచి దళాలు అతని ఆచూకీ కోసం వెతుకున్నాయి. నేడు రోడ్డుపై తారసపడ్డాడు. సరే దొరికాడు కదా అని ఇంటరాగేషన్ చేశారు. తన స్థావరం చూపిస్తానని భద్రతా దళాలను నమ్మించి ఓ చోటకు తీసుకుపోయాడు. అక్కడ సమీపంలో దాచిన ఆయుధాన్ని తీసి కాల్పులు జరపడంతో దళాలు ప్రతిదాడి చేయడంతో హతమయ్యాడు. ఇటీవల కాలంలో కశ్మీర్లోని దళాలకు లభించిన అతిపెద్ద విజయంగా ఐజీపీ విజయ్కుమార్ ట్వీట్ చేశారు.
కొవిడ్ నాకాబందీలో..
పోలీసులు, సశస్త్రసీమాబల్, ఇతర దళాలు మంగళవారం కొవిడ్-19 నిబంధనల అమలును పరిశీలించేందుకు హండ్వార వద్ద నాకాబందీ నిర్వహించాయి. ఒక చోట చాలా వాహనాలు ఉండటంతో దళాలు అక్కడికి వెళ్లాయి. దానికి సమీపంలో ఒక పాదచారి అనుమానాస్పదంగా ప్రవర్తించడాన్ని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకొని తనిఖీలు చేశాయి. ఒక గ్రెనేడ్ దొరికింది. వెంటనే అతన్ని సమీపంలోకి పోలీస్ పోస్టుకు తరలించి ప్రశ్నించడం మొదలుపెట్టాయి. అతని పేరు తెలుసుకొని అవాక్కవ్వడం దళాల వంతైంది. ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నహిజ్బుల్ కమాండర్ మెహ్రాజుద్దీన్ అతనే ధ్రువీకరించుకొన్నారు. అతని స్థావరం వివరాలు తెలుసుకొని దానిని ధ్రువీకరించుకొనేందుకు వెంట తీసుకెళ్లాయి. అక్కడికి వెళ్లగానే అతను సమీపంలో దాచిన ఏకే-47ను బయటకు తీసి దళాలపై కాల్పులు జరిపాడు. దీంతో దళాలు ప్రతిదాడి చేయడంతో చనిపోయాడు. అక్కడి నుంచి ఏకే-47, నాలుగు మ్యాగ్జైన్లలో తూటాలు, పవర్ బ్యాంక్,ఔషధాలు స్వాధీనం చేసుకొన్నారు.
ఎవరీ మెహ్రాజుద్దీన్..?
12వ తరగతి వరకు చదువుకొన్న మెహ్రాజుద్దీన టెక్నాలజీ వాడటంలో దిట్ట. కంప్యూటర్ సైన్స్లో డిప్లొమా చేశాడు. 2011లో ఉగ్రవాదిగా మారాడు. టెక్నాలజీని వాడుకొని పోలీసులనుంచి తప్పించుకొనేవాడు. 2015 నాటికే ఉత్తర కశ్మీర్లో బాగా చురుగ్గా ఉన్నాడు. పోలీసుల వేట పెరగడంతో కొన్నాళ్లు పాకిస్థాన్లో తలదాచుకొని వచ్చాడు. ఇక దక్షిణ కశ్మీర్లో బుర్హాన్ వానీ వలే మెహ్రాజుద్దీన్ ఉత్తర కశ్మీర్లో యువతను ఉగ్రవాదంలోకి లాగుతుంటాడు. అతడిని పోలీసులు ఏ++ కేటగిరి ఉగ్రవాదిగా ప్రకటించారు. కశ్మీర్లో టాప్ 10 ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు.
భద్రతా సిబ్బంది.. ప్రజలే లక్ష్యంగా..
మెహ్రాజుద్దీన్ భద్రతా సిబ్బంది, సాధారణ ప్రజలను లక్ష్యంగాచేసుకొని దాడులు చేసేవాడు. 2013లో అతను చెలరేగిపోయాడు. పలు హత్యలు చేశాడు. ఎస్పీవో ముదాసిర్ అహ్మద్ దార్ హత్య, అదే ఏడాది నలుగురి పోలీసుల హత్య, హబీబుల్ మీర్ అనే వ్యక్తిని చంపాడు. హరియత్ కార్యకర్త ఆల్తాఫ్ హత్య కూడా అతని పనే. మాజీ ఉగ్రవాది మెహ్రాజుద్దీన్ దార్ను కూడా ఇతనే చంపాడు. శ్రీనగర్లో హిమాల్ హోటల్పై దాడిలో కూడా ఉన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
సార్వత్రిక ఎన్నికల వేళ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోంది. -
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని అలెన్ హెర్బల్ కంపెనీలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
బాలుడి పొట్టలోకి గాలికొట్టిన ఆకతాయి
ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన బాలుడు(12) బుధవారం సాయంత్రం తోటి పిల్లలతో కలిసి వాలీబాల్ ఆడుతుండగా బంతిలో గాలి తగ్గింది. -
ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి లేక ఇద్దరు నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం చోటుచేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొని.. కారుకు మంటలు
ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొనడంతో కారులో మంటలు వ్యాపించి యువ వ్యాపారి సజీవ దహనమయ్యాడు. -
పుట్టెడు దుఃఖం మిగిల్చిన పుట్టెంట్రుకల వేడుక
బావ, బావమరుదుల కుటుంబాల్లోని పది మంది పుట్టెంట్రుకల వేడుక కోసం ఆనందంగా బయల్దేరారు. రోడ్డు ప్రమాదం మధ్యలోనే వారి సంతోషాన్ని చిదిమేసింది. -
విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతి
పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ తగిలి కౌలు రైతు అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లాలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. -
రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి దుర్మరణం
కుమురం భీం, నిజామాబాద్ జిల్లాల్లో గురువారం రాత్రి జరిగిన రెండు ప్రమాదాల్లో ఐదుగురు మృతిచెందారు. మొత్తం 17 మంది గాయపడ్డారు. -
ఐదుగురు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాలకు చెందిన ఐదుగురు ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. -
హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
బిహార్ రాజధాని పట్నాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక రైల్వేస్టేషన్ సమీపంలోని ఓ హోటల్లో భారీ ఎత్తున మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనమయ్యారు. -
45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
అర్ధరాత్రి తర్వాత మహిళపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య.. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసీ కెమెరాల్లో ఇద్దరూ పరారయ్యే అస్పష్ట చిత్రాలు తప్ప ఒక్క ఆధారం లభించలేదు. -
సల్మాన్ ఇంటివద్ద కాల్పులు.. పంజాబ్లో మరో ఇద్దరు నిందితుల అరెస్టు
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటి ముందు జరిగిన కాల్పుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. -
పోలీసుస్టేషన్ ఆవరణలోనే తెదేపా కార్యకర్తపై దాడి
పోలీసు స్టేషన్ ఆవరణలో వైకాపా నాయకులు హల్చల్ చేశారు. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల గ్రామానికి చెందిన కొందరు వైకాపా నాయకులు తెదేపా కార్యకర్త యూసఫ్పై స్టేషన్ ఆవరణలోనే దాడి చేశారు. -
వైకాపా నాయకుడి బార్లో.. రూ.1.30 కోట్ల మద్యం స్వాధీనం
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అల్లూరులో సెబ్ అధికారులు భారీగా మద్యం స్వాధీనం చేసుకున్నారు. -
గులకరాయి కేసులో నిందితుడిని కస్టడీకి తీసుకున్న పోలీసులు
గులకరాయి కేసులో నిందితుడు సతీష్కుమార్ను పోలీసులు తమ కస్టడీకి తీసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత