తాగడానికి నీళ్లు అడిగి.. సామూహిక అత్యాచారం..!
మొన్న హాథ్రాస్ హత్యాకాండ, నిన్న ఉత్తర్ప్రదేశ్లో 50 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మధ్యప్రదేశ్లో 45 ఏళ్ల మహిళపై నలుగురు అకృత్యానికి ఒడిగట్టారు. పశువాంఛతో సామూహిత అత్యాచారానికి పాల్పడటంతో పాటు అత్యంత దారుణంగా మహిళ శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించారు. మధ్యప్రదేశ్లోని సింధి జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది...
మహిళ శరీర భాగంలోకి రాడ్డు దించి.. ఎంపీలో ఘాతుకం..
సింధి, మధ్యప్రదేశ్: మొన్న హాథ్రాస్ హత్యాకాండ, నిన్న ఉత్తర్ప్రదేశ్లో 50 ఏళ్ల మహిళపై జరిగిన అత్యాచార ఘటన మరవకముందే మధ్యప్రదేశ్లో 45 ఏళ్ల మహిళపై నలుగురు అకృత్యానికి ఒడిగట్టారు. పశువాంఛతో సామూహిక అత్యాచారానికి పాల్పడటంతో పాటు అత్యంత దారుణంగా మహిళ శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించారు. మధ్యప్రదేశ్లోని సింధి జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ఓ మహిళ తన ఇద్దరు కొడుకులు, సోదరితో కలిసి హార్ది గ్రామానికి సమీపంలోని ఏకాంత ప్రదేశంలో ఉంటోంది. ఈ ప్రాంతం జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఆ మహిళ జీవనోపాధి కోసం తన సోదరితో కలిసి ఓ షాపు నడుపుతోంది. ఈ క్రమంలో శనివారం రాత్రి 10 గంటల సమయంలో నలుగురు ఆమె షాపునకు వచ్చి తాగడానికి నీళ్లు కావాలి అని అడిగారు.. దీనికి బదులుగా బాధితురాలు నీళ్లు లేవు అని సమాధానమిచ్చింది. దీంతో ఆగ్రహించిన నిందితులు మహిళ ఇంటిని ధ్వంసం చేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై కిరాతకంగా ఆమె శరీర భాగాల్లోకి ఇనుప రాడ్లు దించి వెళ్లిపోయారు. సంఘటన సమయంలో ఆమె ఇద్దరు కొడుకులు ఇంట్లో లేరు. అనంతరం బాధితురాలని ఆమె చెల్లి ఆటో రిక్షాలో ఆసుపత్రికి తీసుకెళ్లింది.
మహిళ శరీర భాగాల్లోంచి రక్తం వస్తుండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం పక్కనే ఉన్న రేవా జిల్లాలోని ఓ ఆసుపత్రికి తరలించినట్లు అమిలియా పోలీసు స్టేషన్ ఇన్ఛార్జీ దీపక్ బెహగల్ చెప్పారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు. కాగా ఈ అమానుష ఘటనపై రాష్ట్ర హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా స్పందిస్తూ.. నలుగురు నిందితులు అదే గ్రామానికి చెందిన వారిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.
ఇవీ చదవండి..
బోయిన్పల్లి కిడ్నాప్ కేసు.. ముగ్గురి అరెస్టు
రాళ్లతో కొట్టి, కత్తులతో పొడిచి దారుణ హత్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చేతులూ కాళ్లూ కట్టేసి సిగరెట్లతో భర్తకు వాతలు.. వీడియోతో పోలీస్స్టేషన్కు బాధితుడు!
యూపీలో ఓ భర్త పట్ల భార్య కిరాతకంగా వ్యవహరించింది. సిగరెట్లతో వాతలు పెడుతూ భర్తకు నరకం చూపింది. -
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలో మహిళ మృతదేహం బయటపడడంతో యూనివర్సిటీలోని వారంతా భయాందోళనకు గురయ్యారు. -
మైనింగ్ సొమ్ము మింగేశారు
గనులశాఖలో ఇంటి దొంగలు రూ.5 కోట్ల సొమ్మును దారి మళ్లించి, వాడేసుకున్నారు. లీజుల ఈ-వేలంలో పాల్గొన్న వారికి... సెక్యూరిటీ డిపాజిట్ను వెనక్కి ఇవ్వకుండా వేరొక ఖాతాలో జమ చేయించి, వాడేసుకున్నట్లు తెలిసింది. -
ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్మ
ఆన్లైన్ గేములతో డబ్బులు కోల్పోయిన ఓ యువ సాఫ్ట్వేరు ఇంజినీరు మనోవేదనతో బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కల్వకుర్తి ఎమ్మెల్యే కారును ఢీ కొట్టిన ద్విచక్రవాహనం
కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయాణిస్తున్న కారును.. ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. -
వేసవి సెలవుల్లో విషాదం... క్రికెట్ బాల్ తగిలి బాలుడి మృతి
వేసవి సెలవుల్లో క్రికెట్ ఆడుతుండగా బంతి మర్మావయవాలకు తగలడంతో 11 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయిన ఘటన పుణెలోని లోహెగావ్ ప్రాంతంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. లోహెగావ్కు చెందిన శంభు కాళిదాస్ ఖాండ్వే అలియాస్ శౌర్య తన స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడటానికి వెళ్లాడు. -
షెల్ కంపెనీలు.. షేర్ల పేరిట మోసాలు
భారతీయుల్ని లక్ష్యంగా చేసుకొని దుబాయ్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును హైదరాబాద్ పోలీసులు రట్టు చేశారు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులకు సంబంధించి సలహాలిస్తామంటూ దేశవ్యాప్తంగా 507 నేరాలకు పాల్పడిన ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. -
ఆస్ట్రేలియాలో కత్తితో దాడి.. హరియాణా యువకుడి మృతి
ఆస్ట్రేలియాలో కత్తిపోటుకు గురై భారత్కు చెందిన ఎంటెక్ విద్యార్థి నవజీత్ సంధు (22) మృతిచెందాడు. ఇతడు హరియాణాలోని కర్నాల్ ప్రాంతానికి చెందినవాడు. మెల్బోర్న్లో శనివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. -
గడ్చిరోలిలో మావోయిస్టుల కుట్ర భగ్నం
లోక్సభ ఎన్నికల సమయంలో మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేలుళ్లకు కుట్ర పన్నగా దానిని భగ్నం చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. వారి వివరాల ప్రకారం.. స్థానిక తిపగడ్ ప్రాంతంలో మావోయిస్టులు పలు పేలుడు పదార్థాలను అమర్చినట్లు పోలీసులకు ఆదివారం సమాచారం అందింది. -
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థుల మృతి
సముద్రంలో చిక్కుకుని ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి చెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలోని లేమూర్లో చోటుచేసుకుంది. -
బంతి అనుకొని బాంబును తన్నిన బాలుడు
పశ్చిమబెంగాల్లో ఆడుకొంటున్న పిల్లలు బంతి అనుకొని నాటుబాంబును కాలితో తన్నగా.. అది కాస్తా పేలి 11 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ఇద్దరు బాలురకు గాయలయ్యాయి. -
నీట్ బాగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య
నీట్ బాగా రాయలేదని ఓ విద్యార్థి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని గలియాబాయి తండాలో చోటు చేసుకుంది. -
ఇంటర్లో తప్పడంతో కుమార్తె ఆత్మహత్యాయత్నం.. ఆమె చనిపోతుందనే బాధతో తండ్రి బలవన్మరణం
ఇంటర్లో ఫెయిలయ్యానన్న బాధతో కుమార్తె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా..ఆమె బతుకుతుందో లేదోనన్న ఆవేదనతో తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా నడికూడ మండలం రామకృష్ణాపూర్లో సోమవారం జరిగింది. -
విదేశీ నేరస్థులకు బ్యాంకు ఖాతాల విక్రయం
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
క్రికెట్ ఆడుతుండగా బాల్ ప్రైవేట్ పార్ట్కు తగలడంతో ఓ బాలుడు మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్
-
హరియాణాలో భాజపా సర్కార్కు ఎదురుదెబ్బ.. మద్దతు ఉపసంహరించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేలు!
-
నా లెక్కల మాస్టర్కి లెక్కేయలేనంత ప్రేమతో.. సుకుమార్కి బుచ్చిబాబు లేఖ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?