టీ తాగి ఆమె చనిపోయింది.. 

రోజు మాదిరిగానే ఇవాళ కూడా ఆ కుటుంబం టీ తాగింది. అయితే పాలలో టీ పొడి బదులు విషగుళికలు చేరడంతో ఒకరు మృతిచెందగా.

Published : 01 Apr 2021 01:31 IST

బచ్చన్నపేట: రోజు మాదిరిగానే ఇవాళ కూడా ఆ కుటుంబం టీ తాగింది. అయితే పాలలో టీ పొడి బదులు విషగుళికలు చేరడంతో ఒకరు మృతిచెందగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు అంజమ్మ, దాసారం మల్లయ్య, అంజమ్మ మరిది భిక్షపతి ఈ ఉదయం టీ తాగారు. అంజమ్మ టీ చేసే సమయంలో టీ పొడి అనుకొని పొరపాటున పాలలో విష గుళికలు వేశారు. టీ తాగిన 10 నిమిషాలకు ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అంజమ్మ చనిపోయారు. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని