Guntur: మున్నంగి ఇసుక రీచ్‌లో రెచ్చిపోయిన ఇసుక మాఫియా

గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది.

Published : 30 Mar 2024 00:08 IST

మున్నంగి: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి ఇసుక రీచ్‌లో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని.. వెంటనే ఇసుక తవ్వకాలు నిలిపివేయాలని గ్రామస్థులు ట్రాక్టర్లను అడ్డుకున్నారు. అడ్డుకున్న స్థానికులపై వైకాపా నేతలు అరాచకం సృష్టించారు. ట్రాక్టర్లతో తొక్కించి గాయపరిచారు. గ్రామస్థుల ద్విచక్రవాహనాలను ట్రాక్టర్లతో ఢీకొట్టి ధ్వంసం చేయడమే కాకుండా కర్రలు, రాడ్లతో దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఈ దాడిలో మున్నంగి గ్రామానికి చెందిన వేమూరి బాలరాజు, వేమూరి అశోక్‌, కొండూరి మహేశ్‌, వేమూరి మహేశ్‌, మోజేశ్‌కు గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం తెనాలి ఆస్పత్రికి తరలించారు. దాడికి పాల్పడిన వారితో పాటు బాధితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని