logo

ఉరేసుకొని ఒకరి ఆత్మహత్య

జైనథ్‌లో చిల్కపెల్లి గంగన్న(48) గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ బిట్ల పెర్సిస్‌ తెలిపారు. గంగన్న రెండు నెలల కిందట అనారోగ్యం కారణంగా పురుగుల మందు తాగాడు.

Published : 27 Jan 2023 05:45 IST

గంగన్న  

జైనథ్‌, న్యూస్‌టుడే : జైనథ్‌లో చిల్కపెల్లి గంగన్న(48) గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్‌ఐ బిట్ల పెర్సిస్‌ తెలిపారు. గంగన్న రెండు నెలల కిందట అనారోగ్యం కారణంగా పురుగుల మందు తాగాడు. వెంటనే కుటుంబీకులు ఆసుపత్రికి తరలించడంతో బతికాడు. అనారోగ్యం కారణంగా జీవితంపై విరక్తి చెందిన ఆయన ఇంట్లో ఎవరూ లేని సమయంలో గురువారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. పక్క ఇంట్లో ఉన్న భార్య విజయలక్ష్మి ఇంటికి చేరుకొని విషయాన్ని గ్రామస్థులకు చేరవేసిందన్నారు. ఎస్‌ఐ శవ పంచనామా నిర్వహించారు. కుమారుడు అఖిల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని