logo

ఒలంపియాడ్‌లో భైంసా విద్యార్థుల ప్రతిభ

రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఒలంపియాడ్‌ ప్రతిభ పోటీల్లో భైంసా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు 7వ ర్యాంకు దక్కించుకున్నట్లు ప్రిన్సిపల్‌ బి.సుమలత తెలిపారు.

Published : 16 Apr 2024 02:39 IST

విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపల్‌ సుమలత ఉపాధ్యాయులు

భైంసా, న్యూస్‌టుడే: రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఒలంపియాడ్‌ ప్రతిభ పోటీల్లో భైంసా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు 7వ ర్యాంకు దక్కించుకున్నట్లు ప్రిన్సిపల్‌ బి.సుమలత తెలిపారు. గైడల్‌ ఒలంపియాడ్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఫిబ్రవరిలో నిర్వహించిన పరీక్షల్లో టి.నిహారిక సైన్స్‌ విభాగంలో రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించిందన్నారు. పి.దీక్ష జిల్లా స్థాయిలో ప్రథమ, జి.అక్షయ గణితంలో జిల్లా స్థాయిలో 4వ స్థానంలో నిలిచారని పేర్కొన్నారు. వారిని ప్రిన్సిపల్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని