కరదీపిక.. మార్గ సూచిక
ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగాలంటే అధికారులతో పాటు ఎన్నికల సిబ్బంది పాత్ర ఎంతో కీలకం.
పకడ్బందీగా విధులు నిర్వర్తించేలా పుస్తకాల అందజేత
దండేపల్లి, న్యూస్టుడే: ఎన్నికలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగాలంటే అధికారులతో పాటు ఎన్నికల సిబ్బంది పాత్ర ఎంతో కీలకం. నామపత్రాల సమర్పణ నుంచి మొదలు ఫలితాలు వెలువడే వరకు అధికారులు, ఎన్నికల సిబ్బంది వివిధ రకాల విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తేనే ప్రక్రియ విజయవంతం అవుతుంది. నిబంధనల విషయంలో కానీ ఇతరత్రా ఎక్కడ చిన్న అజాగ్రత్తగా వ్యవహరించినా తప్పులు దొర్లినా ఇబ్బందులు తప్పవు. చిన్నచిన్న పొరపాట్లు సైతం నిర్వహణపై ఎంతో ప్రభావాన్ని చూపే అవకాశముంది. ముందే నిబంధనలకు అనుగుణంగా అధికారుల నుంచి సిబ్బంది వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ నేపథ్యంలో సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు ఏవీ చేయాలో ఏవీ చేయకూడదో తెలియజేసే పుస్తకాలను అందజేశారు.
చేయవలసినవి... చేయకూడనివి...
గతంలో ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), సహాయ పోలింగ్ అధికారు(ఏపీఓ)లకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఒకసారి, ఎన్నికల సమయంలో మరోసారి రెండు సార్లు శిక్షణ ఇచ్చేవారు. దీంతో పాటు వీరికి ఎన్నికల నియమావళిపై కరదీపికలు అందజేసేవారు. శిక్షణ ఇచ్చినప్పటికీ ప్రతీసారి చిన్నచిన్న పొరపాట్లు దొర్లుతున్నాయి. ఈ తరుణంలో ఈసారి చేయవలసినివి.. చేయకూడనివి పేరుతో ప్రత్యేక పుస్తకాలు అందజేశారు. ఇందులో ప్రత్యేకంగా పంపిణీ కేంద్రం వద్ద, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మాక్పోలింగ్, పోల్ ప్రారంభం, ముగింపు, ఈవీఎం, వీవీప్యాటు సీల్, ఇతర సామగ్రి సీల్ చేయడం తదితర అంశాలపై పొరపాట్లకు తావు లేకుండా ఎలా చేయాలో పుస్తకాలు రూపొందించారు. పుస్తకం తెలుగు, ఆంగ్లం రెండు భాషల్లోనూ పుస్తకాలు ఎన్నికల విధులు నిర్వర్తించే పీఓ, ఏపీఓలకు అందజేశారు.
సిబ్బందికి శిక్షణ
ఎన్నికల నిర్వహణ సజావుగా సాగాలంటే ప్రిసైడింగ్ (పీఓ), సహాయ పోలింగ్ అధికారులతో (ఏపీఓ) పాటు ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓ)లు తమ బాధ్యతలు సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే ఈసారి అందరికీ శిక్షణ ఇచ్చారు. గతంలో కేవలం ప్రిసైడింగ్, సహాయ పోలింగ్ అధికారులకు మాత్రమే శిక్షణ ఇచ్చేవారు. కానీ ఈసారి పీఓ, ఏపీఓలతో పాటు ఓపీవోలకు కూడా ఇప్పటికే ఒక రోజు శిక్షణ ఇచ్చారు. ఇందులో ఎన్నికల సామగ్రి తీసుకోవడం నుంచి మొదలు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత అక్కడ చేసుకోవాల్సిన ఏర్పాట్లు, మాక్పోల్ నుంచి పోలింగ్ ముగిసి ఈవీఎంలతో పాటు సామగ్రి అధికారులకు అందించే వరకు సిబ్బంది సమన్వయంతో ఎలా విధులు నిర్వహించాలే అనే అంశాలపై శిక్షణ ఇచ్చారు.
అనుమానాల నివృత్తికి..
ఎన్నికల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈసారి చెక్లిస్ట్ అనే మరో పుస్తకాన్ని అందజేశారు. గతంలో ఈ వివరాలన్నీ కరదీపికలోనే ఉండేవి. ప్రిసైడింగ్ అధికారులకు ఏదైనా చిన్న సందేహం వస్తే పుస్తకమంతా తిరగేయాల్సి వచ్చేది. చెక్లిస్ట్ పుస్తకంలో వివిధ అంశాలు, వాటికి సంబంధించిన సందేహాల నివృత్తి కరదీపికలో ఏ పేజీలో ఉన్నాయో ముద్రించారు. దీంతో ఆ అంశానికి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసుకోవాలంటే ఆ పేజీ తీసి చదువుకోవచ్చు. దీంతో తక్కువ సమయంలో అనుమానం నివృత్తి చేసుకునే అవకాశముంది. ఇందులో ప్రధానంగా ప్రిసైడింగ్ అధికారులు విధులు, పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాట్లు, మాక్పోల్, ఏజంట్ల నియామకాలు, ఈవీఎంల నిర్వహణ, మొరాయిస్తే చేపట్టాల్సిన చర్యలు, పోలింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అసాధారణ, సంక్లిష్ట సందర్భాలు, పోలింగ్ ముగింపు, నమోదైన ఓట్లు , సీలింగ్ తదితర అంశాలు పొందుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిదుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!