ఠాణాల్లోనే.. వసూళ్లు!
న్యాయం కోసం పోలీస్స్టేషన్ గడప తొక్కే వారు అక్కడ వసూళ్ల పర్వాన్ని చూసి విస్తుపోతున్నారు
అనిశాకు పట్టుపడుతున్నా.. మారని పోలీసులు
సోమవారం ఆసిఫాబాద్ పోలీస్స్టేషన్లో అనిశా అధికారులు పట్టుకున్న నగదు
ఈనాడు, ఆసిఫాబాద్: న్యాయం కోసం పోలీస్స్టేషన్ గడప తొక్కే వారు అక్కడ వసూళ్ల పర్వాన్ని చూసి విస్తుపోతున్నారు. రక్షక భటులుగా ఉన్న వారు నేరుగా బేరసారాలకు దిగడంతో తలలు పట్టుకుంటున్నారు. స్టేషన్ బెయిల్ నుంచి, గొడవ కేసులు, అత్తమామల వేధింపులు, చోరీ.. తదితర కేసుల్లో కాసులు విదిల్చితేనే పనులు జరుగుతాయనే అపవాదును పలువురు పోలీసులు మూటగట్టుకుంటున్నారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెదలాలని ఉన్నతాధికారులు ఎంత చెప్పినా.. అనేక మంది తీరు మారడం లేదనే విమర్శలు ఉన్నాయి. భూములకు సంబంధించిన వివాదాల్లో తల దూర్చుతూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు సైతం గుప్పుమంటున్నాయి.
తాజా ఘటనను ఒకసారి పరిశీలిస్తే.. మంచిర్యాల జిల్లా నస్పూర్కు చెందిన యాహియాఖాన్ గత నెల చివరి వారంలో ఆసిఫాబాద్కు కారులో వస్తుండగా బూరుగూడ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. దాని చోదకుడు గాయపడ్డాడు. యాహియాఖాన్పై ఆసిఫాబాద్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. తన వాహనాన్ని విడిపించుకోవడంతోపాటు, స్టేషన్ బెయిల్ మంజూరు కోసం ఎస్సై రాజ్యలక్ష్మి డబ్బులు డిమాండ్ చేయగా.. బాధితుడు అనిశా అధికారులను ఆశ్రయించారు. రూ.25 వేలు ఎస్సై తీసుకుంటుండగా వారు సోమవారం పట్టుకున్నారు. నిబంధనల మేరకు 41(ఏ) స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి ఎస్హెచ్ఓ (సీఐ) అనుమతి తప్పనిసరి. ఈ కేసులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా.? లేక ఎస్సై నేరుగా బాధితుడితో మాట్లాడి ఈ డబ్బులు డిమాండ్ చేశారా.? అనే విషయం విచారణలోనే తేలనుంది.
మా తీరింతే అన్న చందంగా..
ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా.. అనేక చోట్ల గొలుసు మద్యం దుకాణాలు విచ్చలవిడిగా రాత్రీపగలు తేడా లేకుండా నడుస్తున్నాయి. ఇసుకాసురులు రాత్రి వేళల్లో యథేచ్ఛగా లారీల్లో ఇసుకను రెబ్బెన నుంచి జిల్లా సరిహద్దు దాటిస్తున్నారు. పత్తి, కందుల కొనుగోలు దుకాణాలు అనుమతి లేనివి వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. చాలా చోట్ల పోలీసుల అండతో భూ మాఫియా వ్యక్తులు స్థలాల కబ్జాలకు పాల్పడుతున్నారు. వాంకిడి, కౌటాల మండలాల నుంచి పశువుల అక్రమ రవాణా నిత్యకృత్యంగా మారింది. వీటన్నింటికీ కొందరు పోలీసులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నారనే వాదన ఉంది. అనిశాకు వరుసగా పట్టుపడుతున్నా.. అధికారుల తీరులో మార్పు రావడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు.
అవినీతి మరకలు..
- గతేడాది అక్టోబరు 24వ తేదీన చింతలమానేపల్లి ఎస్సై వెంకటేశ్ రూ.20 వేలు లంచం తీసుకుంటూ అనిశాకు చిక్కారు. ఓ వివాహిత వ్యక్తిగత కారణాలతో మహారాష్ట్రకు వెళ్లగా అందుకు సహకరించిన వ్యక్తిపై కేసు నమోదైంది. అనంతరం వివాహిత తిరిగి వచ్చినా, ఈ కేసు తప్పించడానికి ఎస్సై రూ.70 వేలు డిమాండ్ చేయగా.. బాధితుడు రూ.20 వేలు ఇచ్చి అనిశాను ఆశ్రయించారు. సదరు ఎస్సై ఇక్కడికి రాక ముందు కెరమెరిలో పనిచేశారు. అదే ఏడాది మే నెలలో సుర్దాపూర్ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన రూ.50 లక్షల విలువ చేసే పైపులు మాయమైన విషయం గ్రామస్థులు చెప్పినా.. వాటి ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. ఓ హత్య కేసులోనూ నిందితులను గుర్తించలేదనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి.
- గత సంవత్సరం ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించిన రెబ్బెన ఎస్సై భవానీసేన్ సస్పెండ్ అయ్యారు. కాగజ్నగర్ డివిజన్లో జోరుగా సాగుతున్న గుట్కా, మట్కా, గుడుంబా, మద్యం వ్యాపారానికి సహకరిస్తున్నారని గత రెండు సంవత్సరాల కాలంలో పలువురు ఎస్సైలను ఎస్పీ కార్యాలయానికి ఉన్నతాధికారులు అటాచ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలొస్తున్నారు
[ 30-04-2024]
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయం క్రమంగా వేడెక్కుతోంది. అగ్రనేతలు రానుండటంతో ప్రచారం పతాకస్థాయికి చేరుకుంటోంది. -
కాంగ్రెస్కు ఓటేస్తే భవిష్యత్తుకు లేదు గ్యారెంటీ!
[ 30-04-2024]
హస్తం పార్టీకి ఓటు వేస్తే భవిష్యత్తుకు గ్యారెంటీ లేదని, ఉచిత పథకాలు ఉత్తి మాటలేనని భారాస ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. -
పెరుగుతున్న ఎండ.. వసతులుంటేనే అండ
[ 30-04-2024]
రోజురోజుకూ పెరుగుతున్న ఎండల తీవ్రత కారణంగా లోక్సభ ఎన్నికల నిర్వహణ విషయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోక తప్పని పరిస్థితి నెలకొంది. -
దురాశకు పోయి.. దుఃఖానికి చేరువై
[ 30-04-2024]
ప్రభుత్వ ఉద్యోగం.. చాలామందికి తీరని కల. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంతో కష్టపడితే, అదృష్టం కలిసొస్తే తప్ప సొంతమవని జీవితం. -
చోదకుల నిర్లక్ష్యం.. గాలిలో ప్రాణాలు
[ 30-04-2024]
కారణాలు ఏమైనా రహదారులపై సరకు రవాణా వాహనాలు నిర్లక్ష్యంగా నిలుపుతున్నారు. నిద్రమత్తు, అతివేగం, పొగమంచు, తదితర కారణాలతో రహదారిపై నిలిచి ఉన్న వాహనాలను గమనించలేని ప్రయాణికుల వాహనాల చోదకులు వాటిని బలంగా ఢీకొంటున్న ఘటనలు పెరుగుతున్నాయి. -
ప్రజాప్రతినిదుల తీరు.. నాయకుల బేజారు
[ 30-04-2024]
జిల్లాలో ఇటీవల ఓ ప్రధాన పార్టీ సభ నిర్వహించింది. ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధి జనసమీకరణ బాధ్యతను ఆయా వార్డుల బాధ్యులకు అప్పగించారు. ఒక్కొక్కరికి ఒక్కో సంఖ్యను లక్ష్యంగా ఇచ్చి పూర్తి చేయాలని ఆదేశించారు. -
భారాసను గెలిపిస్తేనే హామీల అమలు
[ 30-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారాసను గెలిపిస్తేనే కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలుకు నోచుకుంటాయని పెద్దపల్లి పార్లమెంట్ స్థానం భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. -
భాజపాకు కలిసొచ్చేనా?
[ 30-04-2024]
పెద్దపల్లి ఎంపీ బొర్లకుంట వెంకటేశ్నేత పార్టీ మార్పు ఊహాగానాలకు ఎట్టకేలకు తెరపడింది. హైదరాబాద్లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి సమక్షంలో సోమవారం ఆయన భాజపా తీర్థం పుచ్చుకున్నారు. -
ధనార్జనే ధ్యేయం.. వైద్యం ప్రాణాంతకం
[ 30-04-2024]
రెండ్రోజుల కిందట కాగజ్నగర్లోని నౌగాంబస్తీకి చెందిన నిండు గర్భిణి ప్రసూతి నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఉదయం వెళ్లింది. స్కానింగ్ చేసిన వైద్యులు పురిటిల్లోనే శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు. -
నిబంధనలకు లోబడి ఎన్నికల విధుల నిర్వహణ
[ 30-04-2024]
లోకసభ ఎన్నికల్లో భాగంగా సిర్పూరు, ఆసిఫాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎన్నికల ప్రక్రియను నిబంధనలకు లోబడి సమర్థంగా నిర్వహించాలని ఆదిలాబాద్ పార్లమెంటు -
ఆదిలాబాద్ బరిలో 12 మంది అభ్యర్థులు
[ 30-04-2024]
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అభ్యర్థులు ఎవరో తేలిపోయింది. నామపత్రాల పరిశీలన అనంతరం 13 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. -
కొనసాగుతున్న సార్వత్రిక పరీక్షలు
[ 30-04-2024]
ఓపెన్ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల, బెల్లంపల్లి డివిజన్ కేంద్రాల్లో 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలను విద్యాశాఖ నిర్వహిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!