ఇంటింటికీ ఇస్తుంటే ఇన్ని కష్టాలా?
ప్రజాపంపిణీ దుకాణాలకు వెళ్లనవసరం లేకుండా మొబైల్ వాహనాల ద్వారా రెండేళ్ల నుంచి రేషన్ సరుకులు అందిస్తున్నారు. ఈ వాహనాలు నడిపే ఆపరేటర్లకు నెలకు రూ.21 వేలు వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.
జీతాల్లేవ్.. కమీషన్ తేల్చరు..
ఎండీయూ ఆపరేటర్ల ఆందోళన
ఈనాడు డిజిటల్, పాడేరు
ప్రజాపంపిణీ దుకాణాలకు వెళ్లనవసరం లేకుండా మొబైల్ వాహనాల ద్వారా రెండేళ్ల నుంచి రేషన్ సరుకులు అందిస్తున్నారు. ఈ వాహనాలు నడిపే ఆపరేటర్లకు నెలకు రూ.21 వేలు వేతనంగా ప్రభుత్వం చెల్లిస్తుంది.
* ఈ మొత్తంలో కొంత బ్యాంకు వాయిదాతో పాటు ఇంధనం, సహాయకుని ఛార్జీలకు వినియోగించాల్సి ఉంటుంది. మిగతా సొమ్ముతో జీవనోపాధి పొందుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా క్రమంగా వీరిపై పని ఒత్తిడి పెంచారు.
* వాహనాలకు బ్యాంకులే బీమా ప్రీమియం చెల్లిస్తాయన్నారు.. తర్వాత ఆపరేటర్లే బీమా భారం భరించాలన్నారు. వీటికి తోడు నెలవారీ ప్రభుత్వం విడుదల చేస్తున్న వేతనాలు ఖాతాల్లో పడినా ఆపరేటర్ల చేతికి సక్రమంగా అందకపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు.
గత రెండు నెలలుగా జీతాల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో బియ్యం బళ్లు నడపలేమని తమ సమస్యలు పరిష్కరించకుంటే ఏప్రిల్ 1 నుంచి వాహనాలు నిలిపేసి నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారు.
రావికమతం తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న ఆపరేటర్లు
అనకాపల్లి జిల్లాలో 374, అల్లూరి జిల్లాలో 221 మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్ (ఎండీయూ) వాహనాలున్నాయి. వీటి ద్వారా ఆపరేటర్తో పాటు బియ్యం తూకం వేసే సహాయకుడు ఒకరు ఉపాధి పొందుతున్నారు. వీరు ప్రతినెలా 1 నుంచి 17 వరకు 12.28 లక్షల మంది ఇళ్లకు రేషన్ సరకులు చేరవేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం రూ.21 వేలు జీతంగా ఇస్తోంది. ఇందులో రూ.3 వేలు వాహన రుణంగా బ్యాంకు మినహాయించుకుంటుంది. రూ.18 వేలు ఆపరేటర్ చేతికి అందుతున్నాయి. వాహన ఇంధనానికి, సహాయకునికి కలిపి సుమారు రూ.8 వేల వరకు ఖర్చవుతున్నాయి. కొన్నినెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకానికి అవసరమైన బియ్యం, కందిపప్పును చేరవేసే బాధ్యతను వీరికే అప్పగించారు. దీనికోసం కమీషన్ రూపంలో అదనపు భత్యం చెల్లిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అయిదు నెలలు గడిచినా వాటికి సంబంధించి ఒక్కపైసా కూడా ఆపరేటర్లకు అందలేదు.
గత రెండు నెలలుగా వీరి ఖాతాల్లో జీతాలు పడుతున్నా బ్యాంకులు అప్పుగా పూర్తి మొత్తం మినహాయించుకుంటున్నాయి. ఆ ఖాతాల్లో వ్యక్తిగతంగా దాచుకున్న సొమ్మును కూడా తీసుకోవడానికి అడ్డుపడుతున్నాయి. వాహన మిత్రగా రూ.10 వేలు ఇస్తాం, వాటిని బీమాగా చెల్లించేయండని అధికారులు ఉచిత సలహా ఇచ్చారని, కనీసం ఆ ఆర్థిక సాయం కూడా ఇప్పటి వరకు అందించలేదని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అప్పులు చేసి వాహనాలను తిప్పాల్సి వస్తోందని, తమ సమస్యలకు ఈనెల 31లోగా పరిష్కారం చూపకుంటే బియ్యం బళ్లు కదిలే ప్రసక్తి లేదంటున్నారు.
అదనపు భారం పడుతోంది..
- రీమాల పాల్, ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, గూడెంకొత్తవీధి మండలం
మా వాహనాలకు సకాలంలో సరకులు అందించడం లేదు.. అరకొర నిల్వలతో వెళ్లిన గ్రామానికే రెండుసార్లు తిరగాల్సి వస్తోంది. పెట్రోల్పై అదనంగా ఖర్చుచేయాల్సి వస్తోంది. ఐసీడీఎస్, ఎండీఎంకు సరఫరా చేయడం కష్టంగానే ఉంది. బీమా చెల్లించడం లేదనే సాకుతో రెండు నెలల నుంచి జీతాలు నిలిపేశారు. హమాలీలకు కూడా డబ్బులు ఇవ్వలేకపోతున్నాం. సమస్యలు గురించి చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. రాష్ట్ర సంఘం సూచనల మేరకు బళ్లు నిలిపేయబోతున్నాం.
ఒప్పందానికి వ్యతిరేకం..
-వెంకట ఉమామహేశ్వరరావు, ఎండీయూ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు, రావికమతం మండలం
మాకు ఎండీయూ వాహనాలు ఇచ్చేటప్పుడు కొన్ని ఒప్పందాలపై సంతకాలు తీసుకున్నారు. వాటికి విరుద్ధంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. బీమా ప్రీమియం, ఐసీడీఎస్, ఎండీఎం బియ్యం సరఫరాకు సంబంధించి అందించాల్సిన ప్రోత్సాహకాల విషయంలో స్పష్టత రావడం లేదు. రెండు నెలలుగా ప్రభుత్వం డబ్బులిస్తున్నా బ్యాంకులు అడ్డుకుంటున్నాయి. ఖాతాల్లో మైనస్ నిల్వలు చూపిస్తున్నారు. సక్రమంగా వేతనాలందక విధిలేని పరిస్థితుల్లోనే వాహనాలు నిలిపేస్తున్నాం.
రేషన్ పంపిణీకి ఇబ్బంది రానివ్వం:
- కళ్యాణి, ఇన్ఛార్జి డీఎస్వో
ఎండీయూ ఆపరేటర్ల సమస్యలు ఉన్నతాధికారుల దృష్టిలో ఉన్నాయి. కమీషన్ డబ్బులు త్వరలో వస్తాయి. వాహన మిత్రగా రూ.10 వేల చొప్పున ఖాతాల్లో వేశారు. వాటితో బీమా ప్రీమియం చెల్లించుకోవచ్చు. ఏప్రిల్ మొదటి వారంలో బ్యాంకు సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. రేషన్ పంపిణీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వారితో మాట్లాడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ ప్యాలెస్కు కోట్లు.. పర్యటకానికి తూట్లు
[ 26-04-2024]
రిషికొండలో జగన్ ప్యాలెస్ నిర్మాణం కోసం పర్యటక శాఖ రూ. వందల కోట్లు కుమ్మరించింది. ఇదే శాఖ రాష్ట్ర పర్యటక రాజధానిగా ఉన్న అరకులోయ, పరిసర ప్రాంతాల కోసం కనీసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
తెదేపాలో చేరికలు
[ 26-04-2024]
కూటమి అధికారంలోకి వస్తేనే ఆదివాసీలకు న్యాయం జరుగుతుందని పాడేరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి అన్నారు. మొండిగెడ్డ, జర్రెల పంచాయతీల్లోని మొండికోట, కోటకొండ, మొండిగెడ్డ, జర్రెల గ్రామాల్లో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
ఇసుక తుపానును తలపించేలా.. దుమ్ము రేగి విలవిల
[ 26-04-2024]
రాజవొమ్మంగిలో గురువారం 40 డిగ్రీల ఉష్ణోగత్ర నమోదవడంతో చాలా మంది ఇంటికే పరిమితమయ్యారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఈదురుగాలులతో చిరుజల్లులు పడ్డాయి. -
శాసనసభ స్థానాలకు 100 నామినేషన్లు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ఘట్టం గురువారంతో ముగిసింది. చివరి రోజు 35 మంది నామినేషన్లు వేశారని, వీటితో మొత్తం 100 నామినేషన్లు దాఖలయ్యాయని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ విజయ సునీత వెల్లడించారు. -
అభివృద్ధికి దూరంగా.. అవస్థలకు దగ్గరగా!
[ 26-04-2024]
పాడేరు ఏజెన్సీలోని 11 మండలాలతోపాటు రంపచోడవరం నియోజకవర్గంలోని మరో 11 మండలాలను కలుపుతూ అల్లూరి సీతారామరాజు జిల్లాగా ఏర్పడి అప్పుడే రెండేళ్లయ్యింది. -
కంకర పోసి ఐదేళ్లు... నిర్మాణానికి ఎన్నేళ్లు?
[ 26-04-2024]
మండలంలో ఏనుగురాయి పంచాయతీ బొండాపుట్టుకి వెళ్లే రహదారి రాళ్లు తేలి ప్రమాదకరంగా ఉంది. ఐదేళ్ల కిందట లుంగాపుట్టు కూడలి నుంచి బొండాపుట్టు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయగా, పంచాయతీరాజ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో నిర్మాణ పనులు చేపట్టారు. -
దొడ్డిదారి బదిలీలకు రాచమార్గం
[ 26-04-2024]
‘మా ప్రభుత్వంలో అంతా పారదర్శకమే. ఎక్కడా లంచాలు లేవు.. అవినీతికి తావులేదు. సుపరిపాలన అంటే మాదే’ అని సీఎం జగన్మోహన్రెడ్డి తరచూ గొంతుచించుకుంటూ ఉంటారు. -
బాబు వస్తేనే యువతకు జాబు
[ 26-04-2024]
విశాఖ నగరం అభివృద్ధి చెందాలంటే తెదేపా, జనసేన, భాజపా కూటమి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్, ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ను గెలిపించాలని శ్రీభరత్ సతీమణి తేజస్విని కోరారు. -
ఎవరు ఆ ఇద్దరు?
[ 26-04-2024]
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇద్దరు వ్యక్తులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్న విషయం వెలుగులోకి వచ్చింది. వీరికి ఏయూ వేతనాలు చెల్లిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. -
విద్యుదాఘాతంతో విలేజ్ హెల్పర్ మృతి
[ 26-04-2024]
చూచుకొండ గ్రామ విద్యుత్తు హెల్పర్ పీతల శివ సూర్యనారాయణ (45) గురువారం విద్యుధాఘాతానికి గురై మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. చూచుకొండ-రామగిరి మధ్య విద్యుత్తు తీగ తెగిపడిందనే ఫిర్యాదు మేరకు హెల్పర్ శివ సూర్యనారాయణ ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్తు సరఫరా నిలిపివేసి స్తంభంపై మరమ్మతులు చేశారు. -
జీసీసీపై జగన్ పంజా
[ 26-04-2024]
మన్యంలో గిరిజనులు పండించే పంటలు, సేకరించే ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఎన్టీఆర్ హయాంలో గిరిజన సహకార సంస్థ ఏర్పాటు చేశారు. -
భవనాలు పూర్తికావు..సేవలు అందవు
[ 26-04-2024]
పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న వైకాపా ప్రభుత్వ లక్ష్యం ఆదిలోనే నీరుగారుతోంది. ముఖ్యంగా వివిధ కార్యాలయ భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయాయి. -
రహదారుల నిర్మాణాలపై ఫిర్యాదు
[ 26-04-2024]
అనంతగిరి మండలంలోని పెదకోట పంచాయతీ చీడివలస, పాటిపల్లి, బందకొండ గ్రామాల్లో రహదారుల నిర్మాణాల్లో జాప్యంపై రీజనల్ విజిలెన్సు ఎన్ఫోర్సుమెంట్ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. -
ఆర్థిక ప్రగతికి ఆరు పథకాలు
[ 26-04-2024]
తెదేపా ప్రవేశపెట్టనున్న సూపర్ సిక్స్ పథకాలు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ఎంతగానో దోహదపడతాయని ఆ పార్టీ మండల అధ్యక్షుడు పూర్ణచంద్రరావు పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..