India vs Australia: హాట్కేకుల్లా.. ‘టీ-20’ టికెట్లు..
పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 23న జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్కు ఆఫ్లైన్లో టికెట్ల విక్రయాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
న్యూస్టుడే, విశాఖ క్రీడలు
టికెట్లు పొందిన ఆనందంలో ఓ యువతి
పీఎంపాలెం ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఈనెల 23న జరగనున్న భారత్-ఆస్ట్రేలియా టీ-20 మ్యాచ్కు ఆఫ్లైన్లో టికెట్ల విక్రయాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, పీఎంపాలెం క్రికెట్ స్టేడియం, గాజువాకలో రాజీవ్గాంధీ స్టేడియంల వద్ద మహిళలకు, పురుషులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే ఆయా కేంద్రాల వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. తొలిరోజు 5వేల టికెట్లను అందుబాటులో ఉంచగా, రూ.600 టికెట్లు గంట వ్యవధిలోనే అయిపోయాయి. క్యూలైన్లో గంటల తరబడి నిల్చున్నా టికెట్లు దొరక్కపోవడంతో పలువురు అభిమానులు నిరాశ చెందారు. మురికివాడల నుంచి వచ్చిన పలువురు మహిళలు గురువారం అర్ధరాత్రి నుంచే క్యూలైనులో కాపు కాశారు. వీరు బ్లాక్లో ఆయా టికెట్లను విక్రయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథరెడ్డి కౌంటర్లను పరిశీలించారు. రూ.600, రూ.1500, రూ.2వేలు, రూ.3వేలు, రూ.3,500, రూ.6వేల విలువ కలిగిన టికెట్లు రోజుకు అయిదువేల చొప్పున అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. శనివారం కూడా ఆయా కేంద్రాల వద్ద టికెట్ల విక్రయాలు జరుగుతాయన్నారు. ఆన్లైన్లో కొనుగోలు చేసిన వారు ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాక రాజీవ్గాంధీ ఇండోర్ స్టేడియంల వద్ద ఈనెల 22 లోగా, పీఎంపాలెం క్రికెట్ స్టేడియం వద్ద 23వ తేదీ వరకు రెడీమ్ చేసుకోవచ్చని తెలిపారు.
ఇందిరాప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం వద్ద క్యూలైన్లలో అభిమానులు
పీఎంపాలెం క్రికెట్ స్టేడియం వద్ద..
క్రికెట్ స్టేడియం కౌంటరు వద్ద బౌన్సరుకు సూచనలిస్తున్న ఏసీఏ కార్యదర్శి గోపీనాథరెడ్డి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు లేని సంక్షేమం అభివృద్ధి నిలయంగా మన్యం
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమి విజయభేరి నేడే
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. -
ఓటుతో వైకాపాకు బుద్ధి చెప్పండి: ఈశ్వరి
[ 06-05-2024]
మీకు ఏ కష్టమొచ్చినా అండగా నేనుంటా.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటుతోనే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
జనం ఆస్తులకు జగనే గండం
[ 06-05-2024]
ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు. -
సెల్ఫోన్ పేలి చిరు వ్యాపారికి గాయాలు
[ 06-05-2024]
సెల్ఫోన్ పేలి వ్యక్తికి గాయాలు పాలైన ఘటన పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పరమలమ్మలో చోటు చేసుకుంది. -
చంద్రబాబుతోనే పోలవరం పూర్తి
[ 06-05-2024]
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం
[ 06-05-2024]
కూటమి గెలుపుతోనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
ఆసుపత్రిలో ఆకలి కేకలు
[ 06-05-2024]
నక్కపల్లి ఆసుపత్రిలో నిత్యం సగటున 25 మంది రోగులు ఉండేవారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొవిడ్ పేరుతో దాదాపు మూడేళ్లపాటు నిలిపేసింది. -
ప్రత్యర్థులు అసూయ పడేలా అభివృద్ధి చేస్తా: సీఎం రమేశ్
[ 06-05-2024]
కూటమి అభ్యర్థులను గెలిపించి ఇటు కేంద్రం, అటు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
మోదీ సభకు సర్వం సిద్ధం
[ 06-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లపాలెం సమీపంలోని సభాస్థలి ఏర్పాట్లను కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. -
యువత భవిత పట్టని పాలకులు: వడ్డే
[ 06-05-2024]
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, ముఖ్యంగా మనం ఎన్నుకున్న నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ‘భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక’ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
[ 06-05-2024]
పార్లమెంట్ అభ్యర్థి సి.ఎం.రమేశ్పై వైకాపా నాయకుల దాడిని నిరసిస్తూ పేటలో ఆదివారం కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. -
నీటి విడుదల నిలిపేసి గాలింపు
[ 06-05-2024]
మాచ్ఖండ్ జలవిద్యుత్కేంద్రానికి చెందిన జోలాపుట్ జలాశయం నుంచి ఆదివారం కొన్ని గంటలపాటు నీటి విడుదల నిలిపివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!