logo

ఈవీఎంలకు పటిష్ఠ భద్రత

రాబోయే ఎన్నికల్లో వినియోగించనున్న ఈవీఎంలను పటిష్ఠ భద్రత మధ్య ఉంచినట్లు అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ పేర్కొన్నారు.

Published : 17 Apr 2024 02:21 IST

అరకులోయ/పట్టణం, న్యూస్‌టుడే: రాబోయే ఎన్నికల్లో వినియోగించనున్న ఈవీఎంలను పటిష్ఠ భద్రత మధ్య ఉంచినట్లు అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి అభిషేక్‌ పేర్కొన్నారు. అరకులోయలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఈవీఎంల స్ట్రాంగ్‌రూంలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పోలీసు కాపలా నిరంతరం ఉంటుందని చెప్పారు. పోలింగ్‌ ముందు రోజు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను అందించేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సిబ్బంది నిర్ణీత సమయంలోనే పోలింగ్‌ కేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తహసీల్దారు సుధాకర్‌, ఏఈ అభిషేక్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని