జగనాసురుల కన్ను పడితే.. జగద్రక్షకుడి ఆస్తులు గోవిందా..
మనకు ఏ కష్టమొచ్చినా ముందు దేవుడినే తలుచుకుంటాం. భగవంతుడా మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించు నీ దగ్గరకి వచ్చి మొక్కు తీర్చుకుంటామని కోరుకోవడం చూస్తుంటాం
5 వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములు స్వాహా
అన్యాక్రాంతమైనవి కొన్ని.. ఆక్రమణల్లో ఇంకొన్ని..
ఈనాడు, అనకాపల్లి - న్యూస్టుడే, బృందం
మనకు ఏ కష్టమొచ్చినా ముందు దేవుడినే తలుచుకుంటాం. భగవంతుడా మమ్మల్ని కష్టం నుంచి గట్టెక్కించు నీ దగ్గరకి వచ్చి మొక్కు తీర్చుకుంటామని కోరుకోవడం చూస్తుంటాం. ఇప్పుడు దేవుడే తనను, తన ఆస్తులను అక్రమార్కుల బారిన పడకుండా కాపాడాలని వేడుకునే పరిస్థితి వచ్చింది. దేవుడికి నిలువు దోపిడీ ఇచ్చే భక్తులు బోలెడుమంది ఉంటారు. సాక్షాత్తూ దేవుడినే నిలువునా దోచేసే వారు వైకాపాలోనే ఉన్నారు. అధికారం మాది.. అంతా మాకే దక్కాలన్న రీతిలో దేవుడికే శఠగోపం పెడుతున్నారు.
వైకాపా సర్కారు కొలువు తీరిన తర్వాత దేవాదాయ భూములకు రెక్కలు వచ్చాయి. అధికార పార్టీ నేతలు, వారి అనుచరులు ఆలయాల భూములను ఆక్రమించుకుంటున్నారు.. రికార్డులను తారుమారు చేసి తమ పేరిట పట్టాలు మార్చేసి దేవుడికే తిరిగి శఠగోపం పెట్టేస్తున్నారు. ఇదేమి తీరు అని అడిగితే కోర్టుల్లో కేసులు వేసి అధికారులను ముప్పతిప్పలు పెడుతున్నారు. దేవాదాయ భూములను లీజుకు తీసుకుని శిస్తులు చెల్లించి చట్టబద్ధంగా సాగు చేసుకుంటున్న రైతులు తక్కువే ఉంటున్నారు. చట్టవిరుద్ధంగా దేవుడి భూముల్లో పాగా వేసినవారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అనకాపల్లి జిల్లాలో ఏడు వేల ఎకరాలకు పైగా దేవాదాయ భూములుంటే అందులో 4 వేల ఎకరాలకు పైగా ఆక్రమణదారుల చెరలోనే మగ్గుతున్నాయి. అల్లూరి జిల్లాలోనూ గుడుల పేరిటనున్న భూములు అన్యాక్రాంతమైపోతున్నాయి.
జిల్లా అధికారులు ఆలయాల భూముల లెక్కలన్నీ తిరగేసి ఆక్రమణలను గుర్తించినా వాటిని స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. అధికార పార్టీ నేతలే ఆక్రమణదారులకు వెన్నుదన్నుగా నిలుస్తుండటంతో అధికారులు చేష్టలుడిగి చూడాల్సి వస్తోంది.
మరిన్ని ఆక్రమణలివిగో..
మాడుగుల మండలంలో 1,107 ఎకరాలు దేవాదాయ భూములున్నాయి. ఇందులో 1,003 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. కె.కోటపాడు మండలంలో 709 ఎకరాల దేవుడి మాన్యానికిగాను 569 ఎకరాలు ఆక్రమణదారుల చెరలోనే ఉన్నాయి. రాంబిల్లి మండలంలో 468 ఎకరాలకు గాను 172 ఎకరాలు, అనకాపల్లిలో 397 ఎకరాల్లో 187, నక్కపల్లిలో 409 ఎకరాల్లో 138 ఎకరాలు ఆక్రమణలకు గురైనట్లు గుర్తించారు. అనకాపల్లి పట్టణంలో దేమునిగుమ్మం శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయాలకు చెందిన విలువైన స్థలాలు, భూములు అన్యాక్రాంతమయ్యాయి. ఆక్రమణదారుల్లో ఒకరు దేముడు స్థలాన్నే ఏకంగా బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందారు. బాకీ చెల్లించక పోవడంతో బ్యాంకు వారు ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారు. ఈ స్థలం విలువ ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం రూ.15 కోట్లు ఉంటుంది.
ఉప ముఖ్యమంత్రి ఇలాకాలో..
ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు సొంతూరు తారువాను ఆనుకుని ఉన్న దేవాదాయ భూములకే రక్షణ లేకుండా పోయింది. మారేపల్లిలో సీతారామస్వామి గుడి పేరున 23.15 ఎకరాలుంటే అవి రెండు మూడు చేతులు మారి ఇప్పుడవి ఓ రియల్టర్ ఆధీనంలోకి వెళ్లిపోయాయి. వాటిని స్వాధీనం చేసుకోవడానికి దేవాదాయశాఖ తంటాలు పడుతోంది. ఇటీవలే రిజిస్ట్రేషన్లు జరగకుండా 22ఎ (1సి)లో పెట్టినా ఆ స్థిరాస్తి వ్యాపారికి మంత్రి అండదండలుండటంతో బోర్డులు పెట్టడానికి సాహసించలేకపోతున్నారు. కోర్టుల్లో వివాదం నడుస్తోంది.
రాములోరి భూములపై రాబందులు..
అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలంలోని పురుషోత్తపట్నంలో సర్వే నెం.01 నుండి 101 వరకు భద్రాచల శ్రీ సీతారాముల వారి దేవస్థానానికి చెందిన సుమారు 890 ఎకరాల భూములు ఉన్నాయి. ఆ భూముల్లో ప్రస్తుతం సుమారు 105 ఎకరాల భూమి ఆక్రమణ గురయింది. ఇందులో వైకాపాకు చెందిన ప్రజా ప్రతినిధి ఒకరు 15 ఎకరాల్లో వ్యాపార సముదాయం నిర్మించి అద్దెలకు ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. అధికార పార్టీ ప్రజా ప్రతినిధి కావటంతో అధికారులు ఏమి చేయలేక చేతులెత్తేశారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు అదే వైకాపా ప్రజా ప్రతినిధి అండదండలతో సుమారు 90 ఎకరాల భూమిని ఆక్రమించారు. ఎమ్మెల్సీ అనంత బాబు అనుచరులు ఆక్రమణలకు పాల్పడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూసేయడంలో తగ్గేదేలే!
[ 29-04-2024]
నాలుగు మూడు చేశాం.. మూడు రెండు చేశాం.. రెండు ఒకటి చేశాం.. రేపో, మాపో ఆ ఒక్కటీ లేకుండా చేస్తాం. -
కూటమి గెలిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్
[ 29-04-2024]
రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్గా మారాలంటే కూటమి గెలుపు అవసరమని, ఓటర్లు ఆలోచించి మద్దతు తెలపాలని పాడేరు ఎమ్మెల్యే అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పేర్కొన్నారు. ఆదివారం అన్నవరం, లోతుగెడ్డ పంచాయతీల్లోని దోమలగొంది, -
అర్ధరాత్రి నిద్రిస్తుండగా కత్తితో నరికి..
[ 29-04-2024]
శుభ కార్యక్రమానికి వెళ్లి మేడపై నిద్రిస్తున్న వ్యక్తిని అర్ధరాత్రి వేళ కిరాతకంగా హతమార్చిన ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పెదబయలు ఎస్సై మనోజ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పాడేరు మండలం కాడెలి పంచాయతీ వర్తనపల్లి గ్రామానికి చెందిన శోభ హేమరాజ్(33), పెదబయలు మండలం ముసిడిపుట్టు గ్రామానికి చెందిన పల్లుల సుందర్రావుకు మధ్యలో రెండు సంవత్సరాలుగా గొడవలు ఉన్నాయి. -
అవ్వా తాతలకు అప్పుడే ధీమా
[ 29-04-2024]
తెదేపా హయాంలో తెలుపు రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకుని పింఛన్లు మంజూరు చేసేవారు. ఒకసారి లబ్ధిదారునిగా నమోదయ్యాక మధ్యలో తొలగించేవారు కాదు. -
జడ్పీటీసీ సభ్యురాలు జ్యోతి తెదేపాలో చేరిక
[ 29-04-2024]
రాజవొమ్మంగి జడ్పీటీసీ సభ్యురాలు ఒడుగుల జ్యోతి ఆదివారం తెదేపాలో చేరారు. వట్టిగెడ్డలో నిర్వహించిన కార్యక్రమంలో రంపచోడవరం కూటమి అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి పార్టీ కండువా కప్పి జ్యోతిని పార్టీలోకి ఆహ్వానించారు. -
ఓటేయాలంటే.. తుమ్మిలేరులో తంటాలే
[ 29-04-2024]
గోదావరి తీరంలో.. రహదారి సౌకర్యంలేని, మారుమూల పాపికొండల్లో ఉన్న చిన్న గ్రామం తుమ్మిలేరు. ఈ గ్రామంలో కొండపైన పోలింగ్ కేంద్రం ఉంది. -
సీఏం జగన్ మోసానికి రెండేళ్లు
[ 29-04-2024]
‘పరవాడ ఫార్మాసిటీ కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని వారం, పదిరోజుల్లో తరలించి న్యాయం చేస్తాం. అందుకు అవసరమైన రూ.58 కోట్ల మొత్తాన్ని విడుదల చేసి సురక్షిత ప్రాంతానికి తరలిస్తాం’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి 28 ఏప్రిల్ 2022న సబ్బవరం మండలం పైడివాడ అగ్రహారంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ప్రకటించారు. -
జగన్కు ఓటేస్తే ఆటవిక పాలనను ఆహ్వానించినట్లే
[ 29-04-2024]
వైకాపా నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని అనకాపల్లి అసెంబ్లీ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. -
నిర్మాణాలపై ప్రభుత్వ నిర్లక్ష్యం..
[ 29-04-2024]
గత ప్రభుత్వం నిర్మించిన భవనాలను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అవి నిరుపయోగంగా మారుతున్నాయి. ఆ కోవకు చెందిందే మోతుగూడెం పంచాయతీ అతిథి గృహ భవన నిర్మాణం.
తాజా వార్తలు (Latest News)
-
భారీ ధరకు ‘తండేల్’ ఓటీటీ రైట్స్.. చైతూ కెరీర్లో బిగ్ డీల్
-
భారత్లో నథింగ్ ఫోన్ 2ఏ స్పెషల్ ఎడిషన్.. ధర, ఫీచర్లివే..!
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
-
కెనడా ప్రధాని ట్రూడో సమక్షంలో.. ‘ఖలిస్థానీ’ నినాదాలు
-
బాలీవుడ్ స్టార్స్తో ఎన్టీఆర్.. వీడియో వైరల్
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..