మద్యంతో పోలీసులకు చిక్కిన సూపర్వైజర్
మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వైకాపా మద్దతుదారుడే నాయకులకు, కార్యకర్తలకు మద్యం సీసాలు అందిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు.
నిందితుడు వైకాపా మద్దతుదారుడు
పాయకరావుపేట, న్యూస్టుడే: మద్యం దుకాణాల్లో పని చేస్తున్న వైకాపా మద్దతుదారుడే నాయకులకు, కార్యకర్తలకు మద్యం సీసాలు అందిస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం అరట్లకోటలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో సూపర్వైజర్గా పని చేస్తున్న కోనేటి నాగవెంకట పద్మారావు ఆరు మద్యం సీసాలు తరలిస్తూ దొరికాడని ఎస్సై జోగారావు తెలిపారు. ప్లాస్టిక్ సంచిలో సీసాలను తీసుకువెళుతూ, పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడన్నారు. అతని నుంచి అనుమతి లేకుండా ఉన్న ఆరు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. కేసు నమోదు చేశామని ఎస్సై చెప్పారు.
వైకాపా నాయకులతో చెట్టపట్టాల్...
పద్మారావు మద్యం దుకాణంలో ఔట్సోర్సింగ్ సూపర్వైజర్గా పని చేస్తున్నాడు. వైకాపా నాయకుల సమావేశాలకు తరచూ హాజరవుతుంటాడు. ఎన్నికల కోడ్ వచ్చినా సమావేశాల్లో పాల్గొంటూనే ఉన్నాడు. అయినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. ఇటీవల వైకాపా అభ్యర్థి కంబాల జోగులు, ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు పరిచయ కార్యక్రమాన్ని కల్యాణ మండపంలో నిర్వహించారు. దీనిలోనూ పద్మారావు పాల్గొన్నారు. కంబాల జోగులు సిద్ధం గోడపత్రిక విడుదల చేసినపుడు ఆయనతోనే ఉన్నారు. ఇటీవల కొత్తగా వచ్చిన తహసీల్దార్ సూర్యనారాయణను వైకాపా మండలశాఖ అధ్యక్షుడు చిక్కాల రామారావు, జడ్పీటీసీ సభ్యుడు లంకా సూరిబాబు తదితర నాయకులతో కలిసి నిర్వహించిన సన్మాన కార్యక్రమంలోనూ పాల్గొన్నాడు. అయినప్పటికీ చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారు. పద్మారావు గుట్టు చప్పుడు కాకుండా కొంతకాలంగా వైకాపా నేతలకు నేరుగా మద్యాన్ని సరఫరా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ జమానాలో నైపుణ్యం లేదు.. నయవంచనే!
[ 30-04-2024]
ఘనకీర్తి అంతా గతమే అన్న చందంగా తయారైంది గ్రామీణ ప్రాంతాల్లో విద్యావంతులైన యువత పరిస్థితి. -
కుట్రలు కట్టిపెట్టు.. పింఛను సర్దిపెట్టు..
[ 30-04-2024]
గ్రామ/వార్డు సచివాలయాల్లో సిబ్బంది వేలల్లో ఉన్నారు. వీరిని కూడా పింఛన్ల పంపిణీలో భాగస్వాములను చేస్తే ఒకరోజులోనే అనకాపల్లి, అల్లూరి జిల్లాల్లో 3.94 లక్షల పింఛన్లు ఇంటికే తీసుకువెళ్లి అందించడానికి అవకాశం ఉంది. -
వైకాపాది దుర్మార్గ పాలన
[ 30-04-2024]
వైకాపాకు ఓటేస్తే మనకు మనమే ఉరేసుకున్నట్లవుతుందని అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీత అన్నారు. -
కూటమితోనే గిరిజన ప్రాంత అభివృద్ధి
[ 30-04-2024]
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే గిరిజన ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందని ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
వైకాపా సర్కారును సాగనంపేందుకు జనం సిద్ధం
[ 30-04-2024]
వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని రంపచోడవరం కూటమి అభ్యర్థి మిరియాల శిరీషాదేవి అన్నారు. -
తండ్రీకూతురికి ఓటుతో బుద్ధి చెప్పండి: సీఎం రమేశ్
[ 30-04-2024]
గత ఎన్నికల్లో మాడుగుల ఎమ్మెల్యేగా బూడి ముత్యాలనాయుడిని గెలిపించడం ఈ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
బీఎన్ రహదారి ఊసెత్తని జగన్చప్పగా ప్రసంగం.. నాయకగణం డీలా
[ 30-04-2024]
సీఎం జగన్ తన ప్రసంగంలో సరికొత్త బాణి ఎంచుకున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో బాదుడే... బాదుడు అన్న ఆయన ఈ ఎన్నికల్లో పదేపదే గోవిందా.. గోవిందా అన్నారు. -
మే నెలలో ప‘రేషన్’ తప్పదా..!
[ 30-04-2024]
మే నెలలో రేషను సరకుల పంపిణీ 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదు. -
కాంగ్రెస్తోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా
[ 30-04-2024]
రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ కూటమి విజయం సాధించాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి పేర్కొన్నారు. -
నేడు మహిళా శంఖారావం
[ 30-04-2024]
మహిళా సంక్షేమాన్ని పట్టించుకోని సీఎం జగన్మోహన్రెడ్డికి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి కోరార¢ు. -
మా పాసుపుస్తకాలపై ముఖ్యమంత్రి ఫొటోనా?
[ 30-04-2024]
రెండు సెంట్లు పాకదిబ్బ మినహా ఎలాంటి భూమిలేదు. పశువులను మేపుకొనే జీవిస్తున్నా. -
నేను చనిపోతే.. పీవీ సురేషే కారణం..!
[ 30-04-2024]
విశాఖ పారిశ్రామిక ప్రాంతం 60వ వార్డు వైకాపా కార్పొరేటర్ పీవీ.సురేష్పై అదే పార్టీకి చెందిన మహిళా కార్యకర్త సోమవారం మల్కాపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
సచివాలయాలకు వెళ్లనవసరం లేదు
[ 30-04-2024]
మే నెల సామాజిక పింఛన్లకు సంబంధించి లబ్ధిదారులు గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదని డీఆర్డీఏ పీడీ శచీదేవి సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.