logo

రక్షణ మంత్రి పర్యటనకు భారీ ఏర్పాట్లు

అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్‌ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విచ్చేస్తున్నారు.

Published : 24 Apr 2024 02:14 IST

అనకాపల్లిలో భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్న నేషనల్‌ సెక్యూరిటీ టీం డీఎస్పీ రాకేష్‌కుమార్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: అనకాపల్లిలో బుధవారం నిర్వహించనున్న పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి సీఎం రమేశ్‌ విజయీభవ ర్యాలీకి ముఖ్య అతిథిగా కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విచ్చేస్తున్నారు. ఈనేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. దిల్లీ నేషనల్‌ సెక్యూరిటీ టీం నుంచి బలగాలు మంగళవారం అనకాపల్లి చేరుకున్నాయి. పట్టణంలో నిర్వహించే ర్యాలీలో రాజ్‌నాథ్‌ సింగ్‌ పాల్గొంటున్న సందర్భంగా ఈ ప్రాంతాలతోపాటు సభా వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను నేషనల్‌ సెక్యూరిటీ డీఎస్పీ రాకేష్‌కుమార్‌ ఆధ్యర్యంలో పరిశీలించారు. స్థానిక  పోలీసులతోపాటు ప్రధాన రహదారి పొడవునా డాగ్‌ స్వ్కాడ్లతో తనిఖీలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు