logo

మహిళపై ప్రియుడి దాడి

మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది.

Published : 24 Apr 2024 02:37 IST

జి.మాడుగుల, న్యూస్‌టుడే: మహిళపై ఆమె ప్రియుడు కత్తితో దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. లువ్వాసింగి పంచాయతీ వలసమామిడి గ్రామానికి చెందిన సారే సత్యవతి భర్త చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన మసాడి విశ్వేశ్వరరావుతో సహజీవనం చేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ నెల 21న రాత్రి ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. కోపోద్రిక్తుడైన   విశ్వేశ్వరరావు కత్తితో సత్యవతిని తీవ్రంగా గాయపరిచాడు. ఆమెను కుటుంబసభ్యులు విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు బాధితురాలి తల్లి పార్వతమ్మ మంగళవారం ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని