నేనున్నానన్నావు.. నట్టేట్లో ముంచావు!
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది.
పునరావాసం.. పచ్చి మోసం
అయిదేళ్లుగా హామీలతోనే కాలయాపన
ఒక్క గ్రామాన్నీ తరలించని జగన్ ప్రభుత్వం
విలీన మండలాల్లో కూనవరం, వరరామచంద్రాపురం దాదాపు 90 శాతం ముంపు బారిన పడుతున్నాయి. ఇక్కడ గత తెదేపా ప్రభుత్వమే పూర్తిచేసి పునరావాస కాలనీలను నిర్మించింది. చివరిదశలో తెదేపా ప్రభుత్వం మారిపోయింది. పాలన పగ్గాలు చేపట్టిన వైకాపా నిర్వాసితుల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. చివరి దశలో ఉన్న కాలనీలను పూర్తి చేసి గ్రామాలను తరలించాల్సి ఉన్నా అయిదేళ్ల కాలంలో ఒక్కటంటే ఒక్క గ్రామాన్నీ తరలించలేకపోయింది
చింతూరు, కూనవరం, దేవీపట్నం న్యూస్టుడే
క్షణక్షణం భయంతో బతుకు బండిని లాగిస్తున్న పోలవరం నిర్వాసితులకు అయిదేళ్ల వైకాపా పాలన తీవ్ర నిరాశ మిగిల్చింది. ఏటికేడాది గోదావరి వరదలతో అతలాకుతలం అవుతున్న ముంపు మండలాల నిర్వాసితులకు గత ఎన్నికల సమయంలో వైకాపా అధినేత ‘మాట తప్పను.. మడమ తిప్పను’ అని హామీల వల వేశారు. ఆ వలలో చిక్కుకున్న నిర్వాసితులు అవన్నీ నిజమని నమ్మి ఆ పార్టీకి ముంపు మండలాల్లో పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చిన ఏడాది నుంచి హామీలు అమలవుతాయని ఎదురుచూసిన నిర్వాసితులకు అయిదేళ్ల తరువాత నిరాశే మిగిలింది. చివరకు గోదావరి వరదలో మునిగి హాహాకారాలు చేసినా కాస్తంత కనికరం కూడా చూపలేకపోయింది ఈ కర్కశ ప్రభుత్వం.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో పునరావాసం, ప్యాకేజీ ఇచ్చే లక్ష్యంతో నీటి నిల్వసామర్థ్యాన్ని బట్టి ముంపునకు గురవుతున్న గ్రామాలను కాంటూరుల వారీగా విభజించారు. కాఫర్డ్యామ్ నిర్మాణంతో ముంపునకు గురయ్యే గ్రామాలను 41.15 కాంటూరు పరిధిలో, మిగిలిన గ్రామాలను 45.72 కాంటూరు పరిధిలో చేర్చారు. కాఫర్డ్యామ్ నిర్మాణం పూర్తయినందున 41.15 కాంటూరు పరిధిలోని 107 గ్రామాలను రెండేళ్ల క్రితమే ఖాళీ చేయించాల్సి ఉంది. కానీ పోలవరం, దేవీపట్నం మండలాల్లోని కొన్ని గ్రామాలు మినహా మిగిలిన గ్రామాలను ఇప్పటికీ ఖాళీ చేయించలేకపోయారు.
మాట తప్పనన్నారు.. నాలుక మడత పెట్టేశారు
నేనున్నానన్నారు.. గోదాట్లో ముంచేశారు
ఆదుకుంటామన్నారు.. ఆపదలోకి తోసేశారు..
పరిహారమిస్తామన్నారు.. పరిహాసం చేశారు..
పోల‘వరాన్ని’.. నిర్వాసితుల పాలిట శాపంగా మార్చేశారు!
30 శాతం పనులూ చేయలేదు
వరరామచంద్రాపురం మండలం జీడిగుప్ప నిర్వాసితులకు కూనవరం మండలం భైరవపట్నం వద్ద అప్పటి తెదేపా ప్రభుత్వం కాలనీ నిర్మాణాన్ని చేపట్టింది. 160 కుటుంబాలకు ఇళ్ల నిర్మాణం చేపట్టి సుమారు 70 శాతం పూర్తి చేసింది. వైకాపా ప్రభుత్వం మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయింది. ఇప్పటికీ ఈ కాలనీలో అంతర్గత దారులు (సిమెంట్) వేయలేదు. కొన్ని ఇళ్ల పనులు పూర్తి కాలేదు. మరుగుదొడ్లు, అలమరల పనులు జరగలేదు. బడి, గుడి, అంగన్వాడీ, సామాజిక భవన నిర్మాణాలు అయిదేళ్లుగా పునాదుల్లోనే మగ్గుతున్నాయి. వరదల భయంతో జీడిగుప్ప గ్రామానికి చెందిన తొమ్మిది కుటుంబాలు వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నాయి. వారికి పూర్తిస్థాయి వనరులు సమకూరలేదు. నేటికీ వారు రేషన్ కోసం, ఓట్లు వేయడానికి సొంత గ్రామానికి వెళ్లాల్సిందే.
పునరావాస కాలనీలో అసంపూర్తిగా ఇళ్ల నిర్మాణం
ప్రచారం కోసం పట్టాలు
కూనవరంలోని బొజ్జరాయిగూడెంలో 216 కుటుంబాలను తరలించాల్సి ఉంది. రైతులకు భూమికి బదులు భూమి ఇవ్వడం కోసం రాయనపేటలో 32 మందికి, చోడవరంలో 32 మందికి, పాండురంగాపురంలో 10మందికి కలిపి 216 ఎకరాలు తీసుకొన్నారు. వీటికి నిర్వాసితుల పేరున పట్టాలు కూడా ఇచ్చారు. నిర్వాసిత రైతులు ఆ భూముల్లో సాగు చేయడానికి వెళితే యజమానులు ‘ప్రభుత్వం తమకు ఇప్పటివరకు నగదు చెల్లించలేదు. కాబట్టి మీకు అప్పగించలేమని’ వారిని వెనక్కు పంపారు. ప్రచారం కోసం పట్టాలిచ్చారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వరదలతో మరికొన్ని గ్రామాల గుర్తింపు
రెండేళ్ల క్రితం జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వచ్చిన గోదావరి వరదలు ముంపు మండలాలను అలకల్లోలం చేశాయి. బాధితులకు కనీస సాయం అందలేదు. ప్రభుత్వంపై బాధితులంతా ఆగ్రహంగా ఉండటం గుర్తించి వైకాపా సర్కారు 41.15 కాంటూరులో కొత్తగా మరో సర్వే చేసింది. వీటిలో గుర్తించిన గ్రామాలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి ఖాళీ చేయిస్తామని ప్రకటించింది. రెండు నెలల్లో పరిహారం ఇచ్చేస్తామని, పునరావాస కాలనీ కోసం స్థలాలు సిద్ధమవుతున్నాయని వైకాపా నాయకులు హంగామా చేశారు. ఇది జరిగి ఏడు నెలలు అవుతున్నా ఆ ఊసే లేదు.
దేవీపట్నం మండలంలోని నిర్వాసితులు ఊళ్లు వదిలి దాదాపు మూడేళ్లు గడిచిపోతోంది. పునరావాసం లభించక పలు చోట్ల రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకూ అద్దెలు చెల్లిస్తూ నివసిస్తున్నామని ఆవేదన చెందుతున్నారు.
2022 వరదల్లో చిక్కుకున్న చింతూరు
హామీలు హామీలుగానే..
‘2008, 2010లో జరిగిన భూసేకరణలో రైతులకు ఎకరాకు రూ. 1.15 లక్షల నుంచి రూ. 1.40 లక్షలిచ్చారు. ఇది చాలా తక్కువ, వైకాపా ప్రభుత్వం ఏర్పడగానే ఎకరాకు రూ. 5 లక్షలు చెల్లిస్తుంది. వ్యక్తిగత పరిహారం తెదేపా ప్రభుత్వం రూ. 6.30 లక్షలిస్తే, దానిని రూ. పది లక్షలిస్తాం. అగ్గిపెట్టె లాంటి ఇళ్లు కాదు... విశాలమైన గదులతో అన్ని మౌలిక వసతులున్న కాలనీలు నిర్మిస్తాం.
ఇవీ గత ఎన్నికల ప్రచార సమయంలో జగన్ ఇచ్చిన హామీలు. వీటిలో ఒక్కటంటే ఒక్కటీ నెరవేర్చలేదు.
- ‘41.15 కాంటూరు పరిధిలోని గ్రామాలను 2022 సెప్టెంబరు నెలాఖరుకల్లా పునరావాస గ్రామాలకు తరలిస్తాం. నిర్వాసితులకు అండగా ఉంటాం’
2022 వరదల సమయంలో జగన్ ఇచ్చిన హామీ ఇది. రెండేళ్లు గడిచినా ముంపు గ్రామాల గోడు పట్టించుకోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు లేని సంక్షేమం అభివృద్ధి నిలయంగా మన్యం
[ 06-05-2024]
‘రాష్ట్రంలో కూటమి గెలుపు ఖాయమైంది. మరికొద్ది రోజుల్లో జగన్ రాక్షస పాలన అంతం కాబోతోంది. ఆర్థికంగా, అభివృద్ధిపరంగా గాడితప్పిన ఈ రాష్ట్రాన్ని మోదీ నిబద్ధత, చంద్రబాబు సమర్థత, పవన్ కల్యాణ్ చతురతతో పునఃనిర్మాణం చేసుకుంటాం. -
కూటమి విజయభేరి నేడే
[ 06-05-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అనకాపల్లి జిల్లాకు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోది తొలిసారిగా వస్తున్న నేపథ్యంలో సభను విజయవంతం చేయడానికి భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు భారీ ఏర్పాట్లు చేశారు. -
ఓటుతో వైకాపాకు బుద్ధి చెప్పండి: ఈశ్వరి
[ 06-05-2024]
మీకు ఏ కష్టమొచ్చినా అండగా నేనుంటా.. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది. దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైంది. ఓటుతోనే వైకాపా ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పాడేరు అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి గిడ్డి ఈశ్వరి పిలుపునిచ్చారు. -
జనం ఆస్తులకు జగనే గండం
[ 06-05-2024]
ఇలా పదులు, వందలు కాదు వేల ఎకరాల భూములు వైకాపా నేతల చెరలో చిక్కాయి. వాటిపై కొందరు న్యాయస్థానాల్లో కేసులు వేసి ఉపశమనం పొందారు. -
సెల్ఫోన్ పేలి చిరు వ్యాపారికి గాయాలు
[ 06-05-2024]
సెల్ఫోన్ పేలి వ్యక్తికి గాయాలు పాలైన ఘటన పెదబయలు మండలం బొంగరం పంచాయతీ పరమలమ్మలో చోటు చేసుకుంది. -
చంద్రబాబుతోనే పోలవరం పూర్తి
[ 06-05-2024]
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని, దానికోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంపచోడవరం నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని మిరియాల శిరీషాదేవి అన్నారు. -
మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఉచితం
[ 06-05-2024]
కూటమి గెలుపుతోనే గిరిజనులకు సంక్షేమ పథకాలు అందుతాయని అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి పాంగి రాజారావు అన్నారు. -
ఆసుపత్రిలో ఆకలి కేకలు
[ 06-05-2024]
నక్కపల్లి ఆసుపత్రిలో నిత్యం సగటున 25 మంది రోగులు ఉండేవారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించేవారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత కొవిడ్ పేరుతో దాదాపు మూడేళ్లపాటు నిలిపేసింది. -
ప్రత్యర్థులు అసూయ పడేలా అభివృద్ధి చేస్తా: సీఎం రమేశ్
[ 06-05-2024]
కూటమి అభ్యర్థులను గెలిపించి ఇటు కేంద్రం, అటు రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావాలని అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ కోరారు. -
మోదీ సభకు సర్వం సిద్ధం
[ 06-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ విజయభేరి సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తాళ్లపాలెం సమీపంలోని సభాస్థలి ఏర్పాట్లను కూటమి నాయకులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. -
యువత భవిత పట్టని పాలకులు: వడ్డే
[ 06-05-2024]
స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, ముఖ్యంగా మనం ఎన్నుకున్న నాయకులు అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోవడంలేదని ‘భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక’ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు పేర్కొన్నారు. -
రాష్ట్రంలో అరాచక పాలన
[ 06-05-2024]
పార్లమెంట్ అభ్యర్థి సి.ఎం.రమేశ్పై వైకాపా నాయకుల దాడిని నిరసిస్తూ పేటలో ఆదివారం కూటమి నాయకులు నిరసన వ్యక్తం చేశారు. -
నీటి విడుదల నిలిపేసి గాలింపు
[ 06-05-2024]
మాచ్ఖండ్ జలవిద్యుత్కేంద్రానికి చెందిన జోలాపుట్ జలాశయం నుంచి ఆదివారం కొన్ని గంటలపాటు నీటి విడుదల నిలిపివేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు