నూలు ధరలు మళ్లీ పెరిగాయ్
జిల్లాలో ముడినూలు ధరలు మరోసారి పెరిగాయి. ఈ పరిణామంతో సహకార, సహకారేతర సంఘాలతోపాటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అడ్డూ అదుపు లేకుండా ప్రతి నెలా ఎంతో కొంతమేర ధరలు పెరుగుతూ వస్తున్నాయి.
డబ్ల్యుకు రూ.225 పెంపు
న్యూస్టుడే - పెడన గ్రామీణం
జిల్లాలో ముడినూలు ధరలు మరోసారి పెరిగాయి. ఈ పరిణామంతో సహకార, సహకారేతర సంఘాలతోపాటు కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాది ఫిబ్రవరి నుంచి అడ్డూ అదుపు లేకుండా ప్రతి నెలా ఎంతో కొంతమేర ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జిల్లాలో 35 చేనేత సహకార సంఘాలు, మాస్టర్ వీవర్లు ఎక్కువగా చీరలు ఉత్పత్తి చేస్తున్నారు. నేత చీరల ఉత్పత్తిలో పడుగు, పేకకు ఉపయోగించే 80 నంబరు కూంబుడ్ నూలు డబ్ల్యు ధర డిసెంబరులో రూ.2,900 ఉండగా, ఇప్పుడు రూ. 3,125కు ఎగబాగింది. ఒక్క నెలలో రూ. 225 పెరిగింది. 60 నంబర్ కూంబుడ్ నూలు గత నెలలో రూ. 1,770 ఉండగా, ఈ నెల రూ.1850కు అంటే రూ.80 పెరిగింది. ఈ నూలుకు అద్దకం కేంద్రాల్లో రంగులు అద్దాల్సి ఉంటుంది. లేత రంగులు (నెప్తాల్) డబ్ల్యుకు రూ.400 వరకు వ్యయం అవుతుంది. ముదురు రంగులు ఒక డబ్ల్యు రూ.650 వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ముడి సరకుల ధరల పెరిగిన ప్రకారం చీరల ధరలు పెంచలేక, విక్రయాలు జరగక, అటు ఆప్కో కొనుగోలు చేయక సంఘాలు పీకల్లోతు ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. ఈ పరిస్థితుల్లో వేతనాలు గిట్టుబాటుకాక నేత కార్మికులు ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు వెతుక్కుంటున్నారు. జిల్లాలో చేనేత కేంద్రమైన పెడన పట్టణంలో గతంలో 6 నూలు విక్రయ దుకాణాలు ఉండేవి. ఇప్పుడు రెండుకి పరిమితమయ్యాయి. అద్దకం కేంద్రాలు గతంలో పది ఉండగా, మూడుకు తగ్గిపోయాయి. సహకార సంఘాలు తమకు అనుబంధంగా ఉన్న అద్దకం కేంద్రాల్ని మూసివేసి మంగళగిరి, చీరాల ప్రాంతాల్లో నూలుకు రంగులు అద్దించుకుంటున్నారు.
నియంత్రణ చర్యలు చేపట్టాలి
కొవిడ్ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి చైనా ఉత్పత్తి చేసే పత్తి, నూలు సరఫరా నిలిచిపోయింది. మన రాష్ట్రం నుంచి కూడా పత్తి, ముడి నూలు, కోన్ నూలు విదేశాలకు యథేచ్ఛగా ఎగుమతి అవుతోంది. విదేశాల నుంచి రాకపోవడం, ఇక్కడి నుంచి ఎగుమతులు చేస్తుండటంతో నూలు ధరలు పెరిగిపోతున్నాయి. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రణ విధించాలి. - వి.విష్ణు, మేనేజర్, సదాశివలింగేశ్వర చేనేత సహకార సంఘం, పెడన
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బూతులు.. గోతులు.. మనకొద్దు!
[ 05-05-2024]
జనసేనాని పవన్ కల్యాణ్ రాకతో ఎన్డీయే కూటమిలోనూతనోత్సాహం వచ్చింది. గుడివాడ, అవనిగడ్డల్లో శనివారం వారాహి విజయభేరి బహిరంగ సభల్లో పవన్ పాల్గొన్నారు. -
జనంపైకి ‘రాకాసి చట్టం’
[ 05-05-2024]
బలవంతుడిదే రాజ్యం.. రౌడీయిజంతో దౌర్జన్యం చేసేవారికే భూమి అన్నట్టు వైకాపా ప్రభుత్వం వినాశకర చట్టాన్ని తెస్తోంది. అధికారం అండ ఉన్నవారి మాటే చెల్లుబాటయ్యేలా తనదైన విధ్వంసకర విధానాలను జనంపై రుద్దుతోంది. -
సూపర్-6లో సంక్షేమం కొత్త పుంతలు
[ 05-05-2024]
ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న మచిలీపట్నం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది నా అభిమతం. శాసనసభ్యుడిగా, మంత్రిగా ఉన్న సమయంలో దాదాపు రూ.2000 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా. -
ఎత్తిపోయలే... ఒట్టి మాటలే...
[ 05-05-2024]
ఎన్నెస్పీ నీరు అందని చోట ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వాటిలో చాలా మరమ్మతులకు గురయ్యాయి. ప్రతిపాదనలు పంపినా అయిదేళ్లలో పైసా విదల్చలేదు. -
అనువుగాని భూములే.. అపూర్వమా పేర్ని!
[ 05-05-2024]
వ్యవసాయ పరిశోధన స్థానానికి కేటాయించిన భూమి పరిశోధనలకు అనువుగా ఉండదు. అక్కడ భూసార పరీక్షలు కూడా చేశాం. చౌడు ఎక్కువగా ఉండడంతో పంటలు పండే అవకాశం ఉండదు. -
పోస్టల్ బ్యాలట్ వినియోగంలో సమాచార లోపం
[ 05-05-2024]
పోస్టల్ బ్యాలట్ వినియోగించుకునే తేదీల విషయంలో సక్రమమైన సమాచారం ఇవ్వకపోవడంతో పలువురు ఉద్యోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. -
ఓటింగ్ ప్రక్రియ గందరగోళం.. పోస్టల్ బ్యాలట్లు మురిగే ప్రమాదం
[ 05-05-2024]
గుడివాడ పట్టణంలోని వీకేఆర్, వీఎన్బీ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలట్్ ఫెసిలిటేషన్ సెంటర్లో శనివారం ఉదయం 9 గంటలకు ప్రారంభించాల్సిన పోలింగ్ ఒక బూత్లో 9:50కి మరో బూత్లో 10:30 గంటలకు ప్రారంభం -
మ్యానిఫెస్టోలో పథకాలు అమలు చేస్తాం: కొల్లు
[ 05-05-2024]
అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ పింఛన్లు అందజేయడంతోపాటు ప్రతి ఒక్కరికీ నెలకు రూ.4వేలు అందిస్తామని కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి కొల్లు రవీంద్ర అన్నారు. -
స్కౌట్స్ అండ్ గైడ్స్ కమిషనర్గా రామ గంగాధర్
[ 05-05-2024]
హిందూస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆంధ్రప్రదేశ్ నూతన కమిషనర్గా దోర్నాసుల రామ గంగాధర్ నియమితులయ్యారు. -
యార్లగడ్డ ప్రచారానికి అడ్డంకి.. ఆపై కత్తితో దాడి అని కేసు
[ 05-05-2024]
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కొయ్యూరులో తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ప్రచారం సందర్భంగా శుక్రవారం రాత్రి వైకాపాకు చెందిన కొందరు గలాటా సృష్టించారు. -
దివిసీమ విశిష్టత వివరించిన జనసేనాని
[ 05-05-2024]
అవనిగడ్డ సభలో జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ మాట్లాడుతూ దివిసీమ గొప్పతనం గురించి వివరిస్తూ ప్రజల్లో చైతన్యం నింపారు. -
వైకాపా నాయకుడి నోటి దురుసు
[ 05-05-2024]
ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న తెదేపా మహిళా కార్యకర్తను వైకాపా నాయకుడు అసభ్య పదజాలంతో దూషించిన ఘటన రాణిగారితోటలో చోటుచేసుకుంది.