ఏదీ ప్రగతి జాడ ?
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆదర్శ పారిశ్రామికవాడ(మోడల్ ఇండస్ట్రీయల్ పార్కు), ఆహార ఉద్యానవనం(మెగా ఫుడ్ పార్కు) నెలకొల్పేలా అయిదేళ్ల కిందటే గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. భూ సేకరణ, కేటాయింపుల కసరత్తు పూర్తి
మల్లవల్లిలో మందకొడిగా పరిశ్రమల స్థాపన
హనుమాన్జంక్షన్, న్యూస్టుడే
పూర్తి కాని రైల్నీర్ ప్రాజెక్టు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లిలో ఆదర్శ పారిశ్రామికవాడ(మోడల్ ఇండస్ట్రీయల్ పార్కు), ఆహార ఉద్యానవనం(మెగా ఫుడ్ పార్కు) నెలకొల్పేలా అయిదేళ్ల కిందటే గత ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. భూ సేకరణ, కేటాయింపుల కసరత్తు పూర్తి చేసి, పరిశ్రమల స్థాపన వేగవంతం చేసే దిశగా కార్యాచరణ ఆరంభించింది. ప్రభుత్వం మారిన తర్వాత పారిశ్రామికవాడ ప్రగతి మందగించింది.
మల్లవల్లిలో సర్వే సంఖ్య 11లో ఉన్న 1,460 ఎకరాల ప్రభుత్వ భూమిలో పారిశ్రామికవాడ నెలకొల్పేందుకు ఆరేళ్ల కిందట బీజం పడింది. చకచకా రైతులకు పరిహారం చెల్లించి, భూమిని ఏపీఐఐసీకు అప్పగించారు. ఆ తర్వాత మౌలిక వసతుల పనులు, భూ కేటాయింపులు చేసి పట్టా లెక్కించారు.
ఇదీ ప్రణాళిక: వందెకరాలను మెగా ఫుడ్పార్కుకు కేటాయించింది. ఇందులో 57.45 ఎకరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్మించతలపెట్టిన ఫుడ్పార్కుకు అనువుగా లేఅవుట్ వేసి రూ.13.20 కోట్లతో మౌలిక వసతులకు సంబంధించిన పనులు చేపట్టారు. రూ.200 కోట్ల వ్యయంతో ఇక్కడ ఆహారశుద్ధి పరిశ్రమలు నెలకొల్పేలా కార్యాచరణ ప్రారంభించారు. రూ.86.50 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ నిర్మాణాన్ని ప్రారంభించారు. మొత్తంగా రూ.6,900 కోట్ల పెట్టుబడులతో ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు జరుగుతుందని అప్పట్లో అంచనా వేశారు.
అంతా తారుమారు: 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మల్లవల్లిలో భూ కేటాయింపులపై విజిలెన్స్ విచారణ జరపడం, కొన్ని కేటాయింపులను రద్దు చేయడం, వివిధ కారణాలతో పరిశ్రమల స్థాపనలో వేగం తగ్గిపోయింది. అశోక్ లేల్యాండ్ కూడా యూనిట్ని ప్రారంభించలేదు. మరోవైపు గత ప్రభుత్వం ఎకరా రూ.16.50 లక్షల చొప్పున కేటాయించగా, వైకాపా అధికారంలోకి రాగానే రూ.79.60 లక్షలకు పెంచింది. ప్రస్తుతం ఎకరం ధర రూ.89 లక్షలకు చేరింది. ఇంకా 300 ఎకరాల వరకు భూమి ఖాళీగానే ఉండిపోయింది.
మౌలిక వసతుల్లో జాప్యం: అంతర్గత రహదారులు, విద్యుత్తు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేసినా, పారిశ్రామికవాడకు రాజమార్గంగా ఉండేలా 3.9 కి.మీ మేర 150 అడుగుల వెడల్పుతో నాలుగేళ్ల కిందట రహదారి నిర్మాణం చేపట్టారు. భూసేకరణ వివాదంతో ఇప్పటికి కానీ ఈ మార్గం అందుబాటులోకి రాలేదు. పారిశ్రామికవాడ అవసరాల నిమిత్తం కృష్ణా నది నుంచే నేరుగా పైపులైను ద్వారా నీరు తీసుకువచ్చే పనులు కొలిక్కి రాలేదు. రెండు విద్యుత్తు ఉపకేంద్రాలు నిర్మించారు. ఇంకా అంతర్గత రహదారుల నిర్మాణం, మురుగు కాల్వల వ్యవస్థ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మౌలిక వసతుల పనులు కూడా వేగవంతం చేశామని ఏపీఐఐసీ జనరల్ మేనేజరు శ్రీనివాసరావు చెప్పారు. త్వరలోనే పారిశ్రామివాడ ఓ రూపు సంతరించుకుంటుందన్నారు..
కీలక సంస్థల డీలా...
అశోక్ లేల్యాండ్ సంస్థ 75 ఎకరాల్లో బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ నిర్మించింది. హెరిటేజ్, మోహన్ స్పింటెక్స్ వంటి సంస్థలు తమ యూనిట్లలో ఉత్పత్తి ఆరంభించాయి. జాతీయ రహదారుల సంస్థ లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేసేందుకు ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. రైల్నీర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఇంకా సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పరిశ్రమల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తమై, కొన్ని ఉత్పత్తులను ప్రారంభించాయి. కానీ అశోక్ లేల్యాండ్ మూడేళ్లయినా ప్రారంభించలేదు. రైల్నీర్ నత్తనడకన జరుగుతున్నాయి. లాజిస్టిక్ హబ్ ఊసే లేకుండా పోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ