రాష్ట్ర స్థాయి జూనియర్ బాస్కెట్ బాల్ ఛాంప్ కృష్ణా
విశాఖలో ఈ నెల 25వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన 7వ రాష్ట్ర స్థాయి జూనియర్ (అండర్-18)బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలుర జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీ కైవసం
బహుమతితో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలుర జట్టు
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: విశాఖలో ఈ నెల 25వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగిన 7వ రాష్ట్ర స్థాయి జూనియర్ (అండర్-18)బాలబాలికల బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాలుర జట్టు ఛాంపియన్షిప్ ట్రోఫీ కైవసం చేసుకుందని జిల్లా బాస్కెట్బాల్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు జీఎస్సీ బోస్, జె.రామచంద్రరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం జరిగిన తుది పోరులో కృష్ణా జట్టు 55-34 స్కోర్ తేడాతో అనంతపురం జిల్లా జట్టుపై సునాయాసంగా గెలిచింది.
ఈతలో విద్యార్థి ప్రతిభ
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: నగరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్)లో పదో తరగతి చదువుతున్న ఎంఎన్ఎస్ రోహన్ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో కాంస్య పతకం కైవసం చేసుకున్నాడని స్కూల్ ప్రిన్సిపల్ భువన్ తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో గుంటూరు జిల్లా స్విమ్మింగ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రోహన్ గ్రూపు-2 కేటగిరీ బాలుర విభాగంలో 200 మీ బ్రెస్ట్ స్ట్రోక్ను 3 నిమిషాల, 16.16 సెకన్లలో పూర్తిచేసి తృతీయ స్థానంలో నిలిచాడని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం స్కూల్లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ పరిమి పవన్ చంద్, డీన్ ఎస్బీ రావులు.. రోహన్ను అభినందించారు. వైస్ ప్రిన్సిపల్ సంజయ్ భాటియా, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
30న అండర్-19 చదరంగ పోటీలు
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: ది విజయవాడ చెస్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన నగరంలోని బర్డ్స్ సాంగ్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రాంగణంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అండర్-19 బాలబాలికల చదరంగ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎండీ అక్బర్ పాషా, ఎం.రాజీవ్ తెలిపారు. జనవరి ఒకటి, 2003 తర్వాత జన్మించినవారు పోటీలో తలపడేందుకు అర్హులన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు సొంత చదరంగ కిట్లతో అదే రోజు ఉదయం 8 గంటల్లోపు హజరవ్వాలని పేర్కొన్నారు. వివరాలకు 90303 08811 నంబరులో సంప్రదించాలని సూచించారు.
జాతీయ జూనియర్ ఫెన్సింగ్ ఛాంపియన్షిప్కు రాష్ట్ర జట్టు
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: కటక్లో ఈ నెల 29వ తేదీ నుంచి నాలుగు రోజుల పాటు జరిగే 30వ జాతీయ జూనియర్ బాలబాలికల ఫెన్సింగ్ ఛాంపియన్షిప్లో తలపడే రాష్ట్ర జట్టును రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం ప్రధాన కార్యదర్శి జీఎస్వీ కృష్ణమోహన్ మంగళవారం వెల్లడించారు.
* బాలుర విభాగం: ఫాయల్లో డి.రాజు, ఎల్.సాయి నిఖిల్ రాజ్, సీహెచ్పీఎల్ విష్ణువర్థన్ నాయుడు, ఎన్.చరణ్ తేజ, ఎపీలో జె.వెంకట ధన్వి, కె.సాయి ప్రీతమ్, కె.నాగేంద్రనాథ్, కె.రోహన్, సాబ్రెలో ఎన్.వంశీ ప్రదీప్ యాదవ్, కె.సురుత్ సింహ, పి.సాయి తారక్ హర్ష, బి.హరి చంద్రప్రసాద్. ఈ జట్టుకు కోచ్గా బి.అశోక్, మేనేజరుగా ఎం.సతీష్ నియమితులయ్యారు.
* బాలికల విభాగం: ఫాయల్లో జి.అక్షయ, బి.హిమ సాయివర్ష, ఎస్.మోబినా, ఎన్.రూప నిహారికారెడ్డి, ఎపీలో ఎస్.మౌనిక, హెచ్ చరణ్య సిరి, వై.ఉమామహేశ్వరి, వై.జ్యోతి, సాబ్రెలో వై.లక్ష్మీ లావణ్య, పి.భావగ్న, పి.గ్రీష్మ, కె.అమూల్య. ఈ జట్టుకు కోచ్గా జె.వంశీ, మేనేజరుగా డి.భవాని నియమితులయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్