చక్కని తిండి... తక్కువ తినండి..!
‘తక్కువ తినండి... ఎక్కువ పని చేయండి... ఎక్కువ పనిచేసి ఎక్కువకాలం బతకండి’- చాలా ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలో డైలాగ్ ఇది.అందులోని సందర్భం... భావన వేరే అయినా ఇప్పటి పరిస్థితులకు సానుకూలంగా అన్వయించుకుంటే ఈ డైలాగ్ అతికినట్లు సరిపోతుంది. రుచిగా ఉందని నాణ్యతలేని తిండి అతిగా తింటే వచ్చే అనర్థాలు, మితంగా తిని పెద్ద వయసులోనూ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యంగా ఉండేవారి అనుభవాలను తెలుసుకుందాం.
న్యూస్టుడే- సత్యనారాయణపురం
‘తక్కువ తినండి... ఎక్కువ పని చేయండి... ఎక్కువ పనిచేసి ఎక్కువకాలం బతకండి’
- చాలా ఏళ్ల క్రితం వచ్చిన సినిమాలో డైలాగ్ ఇది.
అందులోని సందర్భం... భావన వేరే అయినా ఇప్పటి పరిస్థితులకు సానుకూలంగా అన్వయించుకుంటే ఈ డైలాగ్ అతికినట్లు సరిపోతుంది. రుచిగా ఉందని నాణ్యతలేని తిండి అతిగా తింటే వచ్చే అనర్థాలు, మితంగా తిని పెద్ద వయసులోనూ ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యంగా ఉండేవారి అనుభవాలను తెలుసుకుందాం.
20 గ్రాములే..
ప్రతి మనిషి నిత్యం 20 గ్రాముల నూనె వాడాలి. కానీ దీనికి రెట్టింపుస్థాయిలో నూనెల వాడకం జరుగుతుంది. ఇదే అసలు సమస్యగా ఉంది.
సీజనల్గా లభించే పండ్లను చిన్నారులకు అలవాటు చేయాలి. పండ్లలో పీచు పదార్థం ఉంటుంది. దీంతో బరువు పెరిగే సమస్య ఉండదు. పైగా అనారోగ్య సమస్యల్ని పండ్లు దరిచేరనివ్వవు.
25 దాటొద్దు..
* వ్యక్తి బరువు కేజీల్లో.. ఎత్తును మీటర్లలో తీసుకోవాలి. బరువు, ఎత్తుతో భాగిస్తే వచ్చే అంకెలు మన శరీరస్థితిని తెలియజేస్తాయి. 18.5 కంటే తక్కువగా ఉంటే పోషకాహార లోపంతో బాధపడుతున్నట్లు. 25 కంటే ఎక్కువ ఉంటే ఊబకాయం ఉచ్చులో పడినట్లే. 30 కంటే ఎక్కువ ఉంటే అత్యంత ప్రమాదంలో ఉన్నట్లు.
* ఉదహరణకు ఒక వ్యక్తి ఎత్తు 165 సెంటిమీటర్లు.. బరువు 65 కేజీలు అనుకుంటే బీఎంఐ పద్ధతిలో భాగింపు ద్వారా 23.9 వస్తుంది. ఇది సాధారణస్థాయిలో లావు ఉన్నట్లు. అదే 165 సెంటిమీటర్లు పొడవు.. 68 కేజీల బరువు ఉంటే 25.0 వస్తుంది. ఇది ఊబకాయంలో ఉన్నట్లు సూచిస్తుంది.
30%
ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుమారు 20 లక్షల మంది వరకు ఊబకాయంతో బాధపడుతున్నారనేది నిపుణుల భావన. వీరిలో 25 నుంచి 30 శాతం చిన్నారులే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
గోరు వెచ్చటి నీరు తాగుతా,..
- పి.ప్రసాదరాజు(68), విశ్రాంత ఉద్యోగి, ముత్యాలంపాడు, విజయవాడ
రోజూ ఐదు గంటలకు నిద్రలేస్తా, గోరు వెచ్చటి నీరు అరలీటరు తాగుతా, అనంతరం వాకింగ్కు వెళతా. ఇంటికి వచ్చి స్నానాదులు ముగించుకుని 3 రాగి ఇడ్లీ తింటాను. తిరిగి మధ్యాహ్నం వరకు ఏ రకమైన ఆహారం తీసుకోను. వ్యాపార పనులు చూసుకుంటా 12గంటలకు ఎక్కువ ఆకుకూరలతో తక్కువ అన్నం తింటాను. కొద్ది సేపు నడుస్తా. సాయంత్రం 5గంటలకు మొలకెత్తిన పెసలు, క్యారెట్, ఉల్లి, ఎర్రదుంప, నానబెటివ్టన శనగలు వంటివి తింటాను. రాత్రి 8గంటలకు రెండు గోధుమ రొట్టెలు నూనె లేకుండా తింటా..మితాహారంతో భేషుగ్గా ఉన్నాను.
సమయ పాలన పాటించాలి
- డాక్టర్ సిహెచ్ మనోజ్ కుమార్, మణిపాల్ ఆసుపత్రి
సమయ పాలన తప్పక పాటించాలి.ఉదయం అల్పాహారం 40శాతం, మధ్యాహ్నం భోజనం 40శాతం, రాత్రి 20శాతం ఉండే విధంగా చూసుకోవాలి. ఆకుకూరలు, కాయగూరలు 50శాతం ఉండాలి. 30శాతం మేర ప్రోటీన్లు ఉండాలి. 20శాతం మేర నూనె పదార్ధాలు, ఇతరాలు ఉండాలి. అన్నం, ఉప్పు తగ్గించాలి. రాత్రి నిద్ర కనీసం 8గంటలుండాలి. నిద్రకు ఉపక్రమించేందుకు 2 గంటల ముందు ఆహారం తీసుకోవాలి.
పద్ధతి ప్రకారమే తిండి
- ఎ.ప్రభావతి(74)అయోధ్యనగర్ గృహిణి
ఉదయాన్నే 5 గంటలకు నిద్రలేస్తాను. ఇంటి పనులు ముగించుకుని 8 గంటలకు రెండు ఇడ్లీ తింటాను. ఇంటిపనులు చూసుకుని మధ్యాహ్నం 12గంటలకు పప్పు, ఆకుకూరలతో కూడిన భోజనం మితంగా తింటాను. ఉడకబెట్టిన కూరలే తింటాను. మసాలాలు, పులుపు, ఉప్పు, నూనెలున్న పదార్ధాల జోలికి పోను. 30 సంవత్సరాలుగా ఇదేరకమైన ఆహారం తింటున్నాం. రాత్రి రెండు గోధుమ రొట్టెలు తింటాను. రాత్రి 8.30 గంటలకు నిద్ర పోతాను. ఇప్పటి వరకు ఏ రకమైన అనారోగ్యం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్