logo

భార్య బుగ్గకొరికిన భర్తపై కేసు

భార్య బుగ్గ కొరికి గాయపర్చిన భర్తపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా కానూరు కేసీపీ కాలనీకి చెందిన తాళ్లపూడి స్రవంతి, రాంబాబులు భార్యాభర్తలు.

Updated : 09 Aug 2022 20:49 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: భార్య బుగ్గ కొరికి గాయపర్చిన భర్తపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లా కానూరు కేసీపీ కాలనీకి చెందిన తాళ్లపూడి స్రవంతి, రాంబాబులు భార్యాభర్తలు. భర్త కాపలాదారుగా పనిచేస్తుంటాడు. ఇతను మద్యానికి బానిసై భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చి భార్యతో వివాదానికి దిగాడు. భార్య మందలించడంతో ఆగ్రహం చెందిన ఇతను ఆమెపై దాడి చేసి బుగ్గ కొరికేశాడు. చికిత్స పొందిన అనంతరం ఈమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా భర్త రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని