logo

ఎనికేపాడులో వ్యక్తి హత్య?

ఎనికేపాడు సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎనికేపాడులోని ఓ ఫార్మసీ కళాశాల ప్రహరీ సమీపంలో పక్కన ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి పడి ఉండడాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం

Published : 27 Sep 2022 05:33 IST

ఆటోనగర్‌: ఎనికేపాడు సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.  పోలీసుల కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎనికేపాడులోని ఓ ఫార్మసీ కళాశాల ప్రహరీ సమీపంలో పక్కన ఖాళీ స్థలంలో ఓ వ్యక్తి పడి ఉండడాన్ని గమనించిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు సంఘటన స్థలానికి చేరుకుని అతను మృతిచెందినట్లుగా నిర్ధారించారు. ఆ వ్యక్తిని యనమలకుదురుకు చెందిన పాలబత్తిన ఓబయ్య(50)గా గుర్తించి, అతని కుమారుడు ఓంకారమూర్తికి పోలీసులు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న అతడు తన తండ్రి శనివారం రాత్రి 7 గంటలకు తన దగ్గరకు వచ్చి కొంత నగదు తీసుకెళ్లాడని చెప్పాడు. అతడి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కుమారుడి పాత్రపై అనూమానాలు..: ఓబయ్య రోజువారీ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతను భార్యతో విడిపోయి 20 ఏళ్లుగా విడిగా ఉంటున్నాడు. కుమారుడు నాగ ఓంకార మూర్తి, తల్లితో కలసి ఉంటూ పటమట రైతు బజారులో కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. ఈ కేసులో ఓంకార మూర్తి పాత్రపై పోలీసులు అనూమానం వ్యక్తం చేస్తున్నారు. అడిగిన ప్రశ్నలకు కొన్ని పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడి మెడపై గాయాలు ఉండటంతో ఇది హత్యేనని భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని