logo

గుడివాడ ఆర్డీవో వాహనాన్ని ఢీకొట్టిన ఆటో

పెడన ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుడివాడ ఆర్డీవో పద్మావతి స్కార్పియో వాహనం ప్రమాదానికి గురైంది.

Published : 01 Dec 2022 06:12 IST

పోలీసుల తనిఖీలకు భయపడి వాహనం తిప్పడంతో ఘటన

ఆర్డీవో వాహనం వెనుకవైపు వేలాడుతున్న బంపర్‌

పెడన, న్యూస్‌టుడే: పెడన ప్రధాన రహదారిపై బుధవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గుడివాడ ఆర్డీవో పద్మావతి స్కార్పియో వాహనం ప్రమాదానికి గురైంది. రహదారిపై కంప్యూటర్‌ సెంటరు ఎదురుగా పోలీసులు ఆటోలపై ఉన్న ట్రాఫిక్‌ ఉల్లంఘన చలానాలను తనిఖీచేస్తున్నారు. ఈసమయంలో మచిలీపట్నం వైపు నుంచి వస్తోన్న ఆటో డ్రైవర్‌ పోలీసుల తనిఖీలను గుర్తించి ఒక్కసారిగా వాహనాన్ని వెనక్కి తిప్పాడు. ఇదే సమయంలో గుడివాడ నుంచి మచిలీపట్నం వెళ్తోన్న ఆర్డీవో వాహనానికి ఆటో కుడివైపున తగిలి వెనుక బంపర్‌ ఊడిపోయింది. ఈఘటనతో మచిలీపట్నం-గుడివాడ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్‌ నిలిచింది. పెడన మండలం నందమూరు జయంతి కాలనీకి చెందిన ఆటో డ్రైవర్‌ ఓడిబోయిన బసవయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం పోలీసుస్టేషన్‌కు తరలించారు. అయితే ఈప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని