అమాయకత్వమే ఆసరాగా మోసాలు
నగరంలోని శ్రీనివాస్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ దుకాణం పేరిట వ్యాపారి కార్తీక్ కుమార్.. తనకు తెలిసిన వారి క్రెడిట్ కార్డులను సొంతానికి ఉపయోగించుకుని రూ.3 కోట్ల వరకు మోసం చేశాడు.
ఉద్యోగాల పేరుతో దగా..
వెలుగులోకి మరో కుంభకోణం
సూర్యారావుపేట, న్యూస్టుడే
నగరంలోని శ్రీనివాస్ మెడికల్ అండ్ ఫ్యాన్సీ దుకాణం పేరిట వ్యాపారి కార్తీక్ కుమార్.. తనకు తెలిసిన వారి క్రెడిట్ కార్డులను సొంతానికి ఉపయోగించుకుని రూ.3 కోట్ల వరకు మోసం చేశాడు.
మనీ సర్క్యులేషన్ పేరుతో అమాయకుల నుంచి రూ.కోట్లు వసూలు చేసిన సంకల్ప సిద్ధి సంస్థ బోర్డు తిప్పేసింది.
తాజాగా ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.లక్షలు వసూలు చేసిన మరో సంస్థ నిర్వాకం వెలుగుచూసింది.
నిరుద్యోగుల అమాయకత్వం ఆసరాగా చేసుకుని, వారి నుంచి రూ.లక్షలు వసూలు చేసి నిలువునా ముంచేస్తున్నాయి పలు సంస్థలు. ఒకదాని తర్వాత మరొకటి వెలుగు చూస్తుండటంతో.. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియన జనం గందరగోళానికి గురవుతున్నారు. ఇదిగో ఉద్యోగం వచ్చేసిందంటూ అపాయింట్మెంట్ ఆర్డర్లు చేతిలో పెట్టి, ఉద్యోగాలు ఇచ్చేసినట్లు నటిస్తున్నారు. జీతం వద్దకు వచ్చేసరికి చేతులు ఎత్తేస్తుండటంతో మోసపోయినట్లు ఉద్యోగార్థులు గుర్తిస్తున్నారు. అప్పటికే ఆయా సంస్థలు రూ.కోట్లు వసూలు చేసి బోర్డులు తిప్పేస్తున్నాయి. తాజాగా సూర్యారావుపేటలో ఇదే తరహా మోసం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే అధికారుల ఉద్యోగాలు ఉన్నాయంటూ ఒక్కొక్కరి నుంచి రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు వసూలు చేసిన ‘ఆల్ఫా బెట్ వెంచర్’ అనే సంస్థ గుట్టు రట్టయింది. దీనిపై సూర్యారావుపేట పోలీసులు విచారణ చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి..
సూర్యారావుపేట వేమూరి వారి వీధిలో ఆల్ఫా బెట్ వెంచర్ అనే సంస్థ ఉంది. ఉద్యోగావకాశాలున్న విభాగాల్లో శిక్షణ ఇస్తామని ప్రచారం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలను తమ సంస్థ ద్వారానే నిర్వహిస్తామని విస్తృతంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేర్వేరు ప్రాంతాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ ఇచ్చే సూపర్వైజర్, ఫీల్డ్ ఆఫీసర్లను నియమిస్తున్నామంటూ చెప్పారు. దీన్ని నమ్మి కొంత మంది రూ.4లక్షల నుంచి రూ.6లక్షల వరకు చెల్లించారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.40వేల వరకు జీతం వస్తుందని చెప్పటంతో.. చాలా మంది ఆకర్షితులయ్యారు. శిక్షణ పూర్తి చేసినా ఉద్యోగాలు ఇవ్వకుండా సదరు సంస్థ ముఖం చాటేయటంతో.. డబ్బులు కట్టిన వారు ఆందోళన బాట పట్టారు.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
ఆల్ఫా బెట్ వెంచర్ సమాచారం బయటకు రాగానే సూర్యారావుపేట పోలీసులు రంగంలోకి దిగారు. శనివారం ఉదయం వేమూరి వారివీధిలోని సంస్థ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఇద్దరు మాత్రమే ఉండటంతో.. వివరాలు సేకరించారు. సంస్థకు సంబంధించిన సమాచారంతో పోలీస్స్టేషన్కు రావాలని సూచించారు. రాష్ట్రపతి నగర పర్యటన ఉండటంతో పోలీసు అధికారులంతా బందోబస్తులో ఉండటంతో.. ఒకటి రెండు రోజుల్లో దీనిపై విచారణ జరుపుతామని అధికారులు అంటున్నారు. ఎవరైనా డబ్బులు కట్టి మోసపోయి ఉంటే తమకు సమాచారం అందించాలని పోలీసులు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?