logo

ఓపెన్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా 2022-23 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్‌ ప్రవేశానికి తత్కాల్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం  కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు.

Published : 09 Dec 2022 06:04 IST

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ఏపీ సార్వత్రిక విద్యా పీఠం ద్వారా 2022-23 విద్యా సంవత్సరంలో పది, ఇంటర్‌ ప్రవేశానికి తత్కాల్‌ పద్ధతిలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం  కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి తాహెరాసుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతికి  రూ.300, ఇంటర్మీడియట్‌కు రూ.400 చొప్పున అపరాధ రుసుము చెల్లించి ఈ నెల 11వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 13వ తేదీ వరకు ప్రవేశ రుసుము చెల్లించవచ్చని అన్నారు. మరిన్ని వివరాలకు 8008403506 నెంబర్లలో సంప్రదించాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని