సీఎం వద్దకు చేరిన పంచాయితీ!
రెండు ఘటనలు.. అధికార పార్టీలో ఆధిపత్య పోరు.. ఒకటి ఇసుక అక్రమ రవాణా.. రెండు భౌతిక దాడులు.. రెండు ఘటనలపై పోలీసు కేసులు లేవు. కానీ పంచాయితీ తాడేపల్లికి చేరింది.
ఫిర్యాదు చేసినా కేసులు లేవు
ఈనాడు, అమరావతి
రెండు ఘటనలు.. అధికార పార్టీలో ఆధిపత్య పోరు.. ఒకటి ఇసుక అక్రమ రవాణా.. రెండు భౌతిక దాడులు.. రెండు ఘటనలపై పోలీసు కేసులు లేవు. కానీ పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఇరువర్గాలతో పెద్దలు మాట్లాడేందుకు ఏర్పాట్లు చేశారు. అధికార పార్టీ కావడంతో పోలీసులు కేసులు నమోదు చేయకుండా వేచి చూస్తున్నారు. న్యాయసలహా తీసుకుంటున్నామంటూ నిరీక్షిస్తున్నారు. పెద్దల సూచన మేరకు కేసులు నమోదు చేయాలా వద్దా అనేది నిర్ణయించనున్నారు. సామాన్యులు, ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై ఆఘమేఘాల మీద కేసులు నమోదు చేసి విచారణ పేరుతో అర్ధరాత్రి.. అపరాత్రి అనకుండా ఠాణాకు తీసుకెళ్లే పోలీసులు.. ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. ఈ రెండు కేసుల తీరుపై జిల్లా వైకాపాలో అంతర్గత పోరు మరోసారి బహిర్గతమైంది. ఇసుక అక్రమ రవాణా గుట్టును రట్టు చేసింది. తాడేపల్లి పెద్దల వద్దకు చేరిన పంచాయితీ తీర్పుపై వైకాపా వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఎస్ఈబీ ఫిర్యాదు ఇచ్చినా..!
తమ విధులను అడ్డుకోవడమే కాకుండా ఘర్షణకు దిగారంటూ ఎస్ఈబీ ఇన్స్పెక్టర్, ఎస్ఐ, హెడ్కానిస్టేబుల్ స్వయంగా రాత పూర్వకంగా నందిగామ పోలీసులకు ఫిర్యాదు చేసి రెండు రోజులు గడిచినా ఇంతవరకు ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) నమోదు చేయలేదు. నందిగామ మండలం అంబారుపేట ఇసుక తవ్వకాల కేసు ఎమ్మెల్సీకి, మైలవరం ఎమ్మెల్యేకు ప్రతిష్ఠాత్మకంగా మారింది. నందిగామ మండల కన్వీనర్తో పాటు వైకాపా నాయకులు తమపై దాడికి యత్నించారని, తమ విధులను అడ్డుకున్నారని, తమ వాహనంపై దాడికి దిగారని, ఇసుక తవ్వకాలు జరుపుతాం.. దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించారని సీఐ, ఎస్ఐ, హెచ్సీలు స్వయంగా ఫిర్యాదు చేశారు. పోలీసుల సమక్షంలోనే ఈ బెదిరింపు జరిగింది. అక్కడే ఉన్న పోలీసులు ఇసుక నింపిన వాహనాలను స్వాధీనం చేసుకోకుండా.. జేసీబీని స్వాధీనం చేసుకోకుండా.. ఇసుకను అన్లోడ్ చేసి వాహనాలను పంపించేశారు. మరవైపు ఇదే ఘటనపై ఇసుక అధికారిక గుత్త సంస్థ జేపీ వెంచెర్స్ తరఫున జిల్లా అధికారి పి.బాబూరావు అదనపు ఎస్పీ (ఎస్ఈబీ)కి ఫిర్యాదు చేశారు. ఈ కాపీని పోలీసులకు పంపారు. దీనిపై చర్యలు లేవు. పోలీసులు మాత్రం దీనిపై న్యాయసలహా తీసుకుంటున్నామని చెబుతున్నారు. మరోవైపు వైకాపా పంచాయితీ తాడేపల్లికి చేరింది. ఎమ్మెల్సీ దీనిపై పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి వద్దకు పంచాయితీ చేరింది. ఇరువర్గాలను పిలిచి మాట్లాడి పరిష్కరిద్దామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మరోసారి మైలవరం ఎమ్మెల్యేను పిలిచి ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే ఎస్ఈబీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతం నుంచి ఇసుక భారీగా అక్రమ రవాణా అవుతున్నట్లు గుత్త సంస్థ ఆరోపిస్తున్నట్లు తెలిసింది.
అవనిగడ్డ వ్యవహారమూ...
మరోవైపు అవనిగడ్డ వ్యవహారం కూడా సీఎం కార్యాలయానికి చేరింది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పీఏ శివపై ఎమ్మెల్యే సింహాద్రి రమేష్, ఆయన తనయుడు వికాస్ భౌతికంగా దాడి చేయడం కలకలం రేపింది. బందరులో ఎంపీ, ఎమ్మెల్యేకు పొసగడం లేదు. తాజాగా అవనిగడ్డ రాజకీయాలు కూడా భిన్నంగా మారాయి. దీనికి కారణాలు ఉన్నట్లు తెలిసింది. ఆధిపత్య పోరులో భాగంగానే ఇక్కడ దాడులు జరిగినట్లు తెలిసింది. గత ఏడాది అవనిగడ్డలో షరతులుగల పట్టాల పంపిణీకి సీఎం వచ్చిన సందర్భంగా ఎంపీ అనుచరుడు శివ పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇవ్వలేదు. వచ్చే ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి పోటీ చేసేందుకు శివ టిక్కెట్ ఆశిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ పీఏగా అవనిగడ్డ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నారనేది ఎమ్మెల్యే వర్గీయుల ఆరోపణ. ఇటీవల సంక్రాంతి సంబరాల సందర్భంగా పేకాట శిబిరం నిర్వహించారు. దీనిలో ఒక నిందితుడిని పోలీసులు పట్టుకుంటే ఎంపీ వర్గీయులు విడిపించారని తెలిసింది. ఈ విషయం పోలీసులు ఎమ్మెల్యేకు చేరవేశారు. అప్పటి నుంచి ఎమ్మెల్యే, ఆయన తనయుడు మరింత ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. శనివారం నాగాయలంకలో నాబార్డు ఛైర్మన్ రాక సందర్భంగా ఆయన ముందే భౌతిక దాడులకు పాల్పడ్డారు. ఈ వ్యవహారంపై నాబార్డు ఛైర్మన్ కూడా అసహనం వ్యక్తం చేశారని ఎంపీ ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఆ సమయంలో ఎమ్మెల్యే సహనంతో ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. దీనిపై సీఎంకు సమాచారం ఇవ్వడంతో పిలిచి మాట్లాడతామని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇప్పటికే బందరు పంచాయితీలో ఎంపీ, ఎమ్మెల్యేలతో మాట్లాడారు. తాజాగా ఈ వ్యవహారం సీఎం వద్దకు చేరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్