గతం కంటే కాస్త ఊరట
కేంద్ర బడ్జెట్లో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ప్రాజెక్టులకు గతం కంటే ఈసారి కాస్త ఊరట కలిగింది. గూడూరు-విజయవాడ మూడోలైన్ సహా కొన్ని ప్రాజక్టులకు ఆశాజనకంగానే కేటాయింపులు చేశారు.
గూడూరు-విజయవాడ మూడోలైన్కు రూ.800కోట్లు
అమరావతి సహా ఇతర ప్రాజెక్టులకు మళ్లీ నిరాశ
ఈనాడు, అమరావతి
కేంద్ర బడ్జెట్లో విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ప్రాజెక్టులకు గతం కంటే ఈసారి కాస్త ఊరట కలిగింది. గూడూరు-విజయవాడ మూడోలైన్ సహా కొన్ని ప్రాజక్టులకు ఆశాజనకంగానే కేటాయింపులు చేశారు. కానీ.. అమరావతి నూతన రైల్వేలైన్ లాంటి కీలకమైన ప్రాజెక్టులకు మాత్రం నామమాత్ర విధిలింపులతో సరిపెట్టారు.
విజయవాడ డివిజన్ పరిధిలోని గూడురు-విజయవాడ మూడోలైన్కు రూ.800 కోట్లు తాజా బడ్జెట్లో కేటాయించారు. ఇది కాస్త ఊరట కలిగించే అంశం. 2015-16లో 288కిలోమీటర్ల పొడవైన ఈ లైన్ మంజూరైంది. ప్రస్తుతం పనులు మధ్యలో ఉన్నాయి. మిగతా పనులను పూర్తిచేసేందుకు తాజా బడ్జెట్లో బాగానే కేటాయింపులు చేశారు. విజయవాడ, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మధ్యలో వచ్చే ఈ మూడో లైన్ పూర్తయితే.. సరకు రవాణా రైళ్లను దీనిపైకి మళ్లించేయొచ్చు. దీనివల్ల ప్రధాన లైన్పై వీటి తాకిడి తగ్గుతుంది. విజయవాడ-కాజీపేట మూడోలైన్, విద్యుదీకరణకు కూడా రూ.337 కోట్లను బడ్జెట్లో కేటాయించారు. కానీ.. విజయవాడ డివిజన్ పరిధిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఇప్పటికే పూర్తయిపోయాయి. విజయవాడ నుంచి చెరువుమాధవరం వరకూ డివిజన్ పరిధిలోని లైన్ పూర్తయిపోయింది. అక్కడి నుంచి కాజీపేట వరకూ మిగతా పనులు పూర్తిచేయాల్సి ఉంది. తాజా బడ్జెట్లో కేటాయించిన నిధులతో ఆ పనులు వేగవంతమవుతాయి. విజయవాడ, కాజీపేట బైపాస్ లైన్లకు రూ.310 కోట్లను కేటాయించారు. విజయవాడకు 20కిలోమీటర్లు, కాజీపేటకు 11కిలోమీటర్ల లైన్ కోసం ఈ నిధులు కేటాయించారు.
కోటిపల్లి-నర్సాపూర్ కొత్తలైన్ పూర్తయితే..
కాకినాడ నుంచి విజయవాడకు వచ్చేందుకు కీలకమైన ప్రాజెక్టు కోటిపల్లి-నర్సాపూర్ నూతన లైన్. దీనికి తాజా బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించడం శుభపరిణామం. విజయవాడ-దువ్వాడ ప్రధాన రైల్వే లైన్తో సంబంధం లేకుండా ప్రత్యామ్నాయమార్గంగా ఇది మారబోతోంది. కాకినాడ నుంచి కోటిపల్లికి ఇప్పటికే ఒక పాత లైన్ ఉంది. ఈ లైన్ను కలుపుతూ కోటిపల్లి నుంచి నర్సాపూర్కు కొత్త లైన్ వేస్తున్నారు. ఇది పూర్తయితే.. కాకినాడ నుంచి ఈ ప్రత్యామ్నాయ మార్గంలో విజయవాడకు చేరుకోవచ్చు. కాకినాడ నుంచి కోటిపల్లి మీదుగా నర్సాపూర్, భీమవరం, గుడివాడ, విజయవాడకు వచ్చేయొచ్చు. విజయవాడ-దువ్వాడ ప్రధాన మార్గంపై ఒత్తిడి తగ్గుతుంది. నర్సాపూర్-భీమవరం-మచిలీపట్నం, గుడివాడ, నిడదవోలు బ్రాంచ్లైన్ డబ్లింగ్కు రూ.100 కోట్లను తాజా బడ్జెట్లో కేటాయించారు.
స్టేషన్ల అభివృద్ధి నిధుల్లో రాబట్టొచ్చు..
రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనుల కోసం రూ.555 కోట్లను దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు చేశారు. కీలకమైన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ఈ నిధులను వెచ్చించాలని సూచించారు. ఇవికాకుండా మరో రూ.215 కోట్లను రైల్వేస్టేషన్ల అభివృద్ధికోసం ఇచ్చారు. ఈ రెండు కోటాల్లో విజయవాడ డివిజన్లోని ప్రధాన స్టేషన్ల ఆధునికీకరణ, అభివృద్ధి కోసం ఎక్కువ నిధులను రాబడితే కొంత ఉపశమనం ఉంటుంది. విజయవాడ ఎలక్ట్రిక్ లోకో షెడ్డు అభివృద్ధి కోసం రూ.3 కోట్లను ప్రత్యేకంగా కేటాయించారు.
అమరావతి ప్రాజెక్టుకు మళ్లీ నిరాశ..
విజయవాడ నుంచి గుంటూరుకు వయా అమరావతి మీదుగా వెళ్లే కొత్త లైన్కు ఈసారి కూడా నిరాశే ఎదురైంది. కంటితుడుపుగా కేవలం రూ. రూ.10 లక్షలు ఇచ్చారు. అమరావతి రాజధానిని రెండు ప్రధాన నగరాలకు అనుసంధానించే ఈ కీలక ప్రాజెక్టు విషయంలో ప్రతి బడ్జెట్లోనూ నిరాశే ఎదురవుతోంది. 106కిలోమీటర్ల పొడవుతో రూ.2800 కోట్ల బడ్జెట్తో నిర్మించాలని ప్రతిపాదించిన ఈ లైన్ విషయంలో 2017 నుంచి కేంద్రం మొండిచేయి చూపిస్తూనే ఉంది. దీనికితోడు విజయవాడ డివిజన్ పరిధిలోని కీలకమైన పిఠాపురం-కాకినాడ, ఓబులవారిపల్లె-కృష్ణపట్నం లైన్లకు కేవలం రూ.వెయ్యి చొప్పున బడ్జెట్ ఇవ్వడం నిరాశ కలిగించింది. పిఠాపురం-కాకినాడ లైన్ పూర్తయితే.. దువ్వాడ-అన్నవరం-పిఠాపురం మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో విజయవాడకు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతుంది. గూడురు-దుగ్గరాజపట్నం లైన్కు కూడా కేవలం రూ.10లక్షలు ఇచ్చి వదిలేశారు. దువ్వాడ-విజయవాడ మూడోలైన్కు కూడా కేవలం రూ.10లక్షలు కేటాయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల
[ 26-04-2024]
గుడివాడలో వైకాపా అభ్యర్థి, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) నామినేషన్ వెలవెలబోయింది. భారీగా జనసమీకరణ చేయాలని, బలప్రదర్శన నిరూపించుకోవాలని నాని వర్గం తీవ్రంగానే ప్రయత్నించినా.. -
గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?
[ 26-04-2024]
రాష్ట్రంలో 93 శాతం మందికి పెద్ద చదువుల కోసం మొత్తం ఫీజులను.. జగనన్న విద్యాదీవెన పథకం కింద.. మీ అన్న ప్రభుత్వమే కడుతుంది. పిల్లల చదువుల వల్ల ఏ పేద కుటుంబం అప్పుల పాలవకూడదనే లక్ష్యంతోనే.. -
సీపీ రామకృష్ణ బాధ్యతల స్వీకరణ
[ 26-04-2024]
ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్గా పి.హెచ్.డి.రామకృష్ణ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఇక్కడ సీపీగా పనిచేసిన కాంతిరాణాను ఎన్నికల సంఘం బదిలీ చేసింది. -
‘బుద్ధప్రసాద్కే మా మద్దతు’
[ 26-04-2024]
తెదేపా, భాజపా బలపరిచిన జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కే మా మద్దతు అని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. -
మార్చేస్తున్నా.. మారరంతే..!
[ 26-04-2024]
విజయవాడ ఎంపీ అభ్యర్థి చిన్ని వెంట ఓ ఇంటిలిజెన్సు అధికారి తిరుగుతుండగా తెదేపా నేతలు పట్టుకున్నారు. చిన్ని ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నట్లు ఆయన ఫిర్యాదు చేశారు. -
కలల ధీరులు కార్యసాధకులు
[ 26-04-2024]
విజయవాడ నగరంలో శిక్షణ తీసుకున్న వివిధ జిల్లాలకు చెందిన విద్యార్థులు గురువారం జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో సత్తా చాటారు. -
అయిదు గంటల నరకం
[ 26-04-2024]
గన్నవరంలో గురువారం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ ర్యాలీ సందర్భంగా 16వ జాతీయ రహదారిపై వాహనదారులకు నరకం కనపడింది. -
భారమన్నా వినరు.. పని విభజించరు
[ 26-04-2024]
ఉపాధ్యాయులంటే సరదాగా పాఠశాలకు వెళ్లి నాలుగు పాఠాలు చెప్పి ఇంటికి రావడమేగా అని గతంలో వారిపై ఒక ముద్ర ఉండేది. వైకాపా అధికారం చేపట్టాక గురువులంటే ఇన్ని పనులు ఉంటాయా అనే పరిస్థితి ఏర్పడింది. -
తెదేపా కార్యకర్త స్థలం స్వాధీనానికి యత్నం
[ 26-04-2024]
అవనిగడ్డలో బుధవారం వైకాపా ర్యాలీలో అగ్నికి ఆహుతైన గృహం పక్కన ఉన్న స్థలం ఎంతో కాలంగా యాసం వెంకటేశ్వరరావు తాత నల్లయ్య అనుభవంలో ఉంది. -
అన్నొచ్చారు.. కష్టాలు తెచ్చారు
[ 26-04-2024]
విద్యార్థులు అందరూ రూపాయి ఫీజు చెల్లించకుండా చదువుకునే అవకాశాన్ని ఈ జగనన్న కల్పిస్తున్నాడు.నిర్దేశించిన సమయానికి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఎంతో ఆర్భాటంగా హామీ ఇచ్చారు. -
ఉద్యోగులు నియమావళిపై అవగాహన పెంచుకోవాలి
[ 26-04-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి పేరుతో ఉద్యోగులను భయాందోళనలకు గురిచేసేలా సామాజిక మాధ్యమాల్లో అనేక పోస్టులు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్య వేదిక ఛైర్మన్ కె.ఆర్.సూర్యనారాయణ అన్నారు. -
పేరు జనఔషధి.. తీరు దోపిడీ
[ 26-04-2024]
తక్కువ ధరకు మందులు లభిస్తుండటంతో పేద, మధ్య తరగతి వర్గాలు జనరిక్ (జన ఔషధి) మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. -
7 రోజులు.. 237 నామపత్రాలు
[ 26-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 237 నామపత్రాలు దాఖలయ్యాయి. -
వంశీ నామినేషన్ సందర్భంగా అపశ్రుతి
[ 26-04-2024]
గన్నవరం వైకాపా అభ్యర్థి వల్లభనేని వంశీ నామినేషన్ కార్యక్రమం సందర్భంగా గురువారం అపశ్రుతి చోటుచేసుకుంది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!