జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలి
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలని ఏడీసీపీ(అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్) వెంకటరత్నం సూచించారు.
'
ఏడీసీపీ వెంకటరత్నానికి జ్ఞాపిక బహూకరిస్తున్న నిర్వాహకులు
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: జాతీయ, అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటాలని ఏడీసీపీ(అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్) వెంకటరత్నం సూచించారు. స్థానిక ఆంధ్రా లయోలా కళాశాల ప్రాంగణంలో మూడు రోజుల పాటు జరిగే 5వ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలబాలికల బాక్సింగ్ ఛాంపియన్షిప్ను రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తమ్తో కలిసి శుక్రవారం ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ శిక్షకులు, సంఘ ప్రతినిధుల సూచనలు, సలహాలు పాటిస్తూ రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు ఆర్కే పురుషోత్తమ్ మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత నగరంలో జరుగుతున్న ఈ పోటీలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు నిర్వాహకులు చేసిన ఏర్పాట్లను ఆయన ప్రశంసించారు. ఎన్టీఆర్ జిల్లా బాక్సింగ్ సంఘం కార్యదర్శి వైవీఎస్ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోటీల నిర్వహణకు సహకరించిన ఆంధ్రా లయోలా కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ ఎస్జే కిషోర్, రాష్ట్ర బాక్సింగ్ సంఘం కార్యదర్శి లక్ష్మణ్దేవ్కు కృతజ్ఞతలు తెలిపారు. బాక్సింగ్ ద్రోణాచార్య అవార్డీ ఐ.వెంకటేశ్వరరావు, రాష్ట్ర రెజ్లింగ్ సంఘం కార్యదర్శి వీవీ రమణ, రాష్ట్ర ఒలింపిక్ సంఘం సీఈవో శశికాంత్, కళాశాల వ్యాయామ విద్యా విభాగాధిపతి జేవీ నాగేంద్రప్రసాద్ పాల్గొన్నారు.
స్కూల్ గేమ్స్ వెయిట్ లిఫ్టింగ్లో సత్తా
పసిడి పతకంతో రేవతి
విజయవాడ క్రీడలు, న్యూస్టుడే: న్యూదిల్లీలో జరుగుతున్న 66వ జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-19 వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అల్లు రేవతి పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. 76 కేజీల బాలికల విభాగంలో తలపడిన రేవతి స్నాచ్లో 78 కేజీలు, క్లీన్ అండ్ జర్క్లో 85 కేజీలతో మొత్తం 163 కేజీల బరువెత్తి ప్రథమ స్థానంలో నిలిచింది. రేవతి ఏలూరులోని శాయ్ రాష్ట్ర స్థాయి ఖేలో ఇండియా కేంద్రంలో శాయ్ వెయిట్ లిఫ్టింగ్ కోచ్ వై.ఉదయ్ సందీప్ పర్యవేక్షణలో సాధన చేస్తోందని రాష్ట్ర స్కూల్ గేమ్స్ సమాఖ్య కార్యదర్శి జి.భానుమూర్తిరాజు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బందరు సాక్షిగా జగన్ అబద్ధాలు
[ 07-05-2024]
ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బందరు వచ్చిన సీఎం జగన్... సభ సాక్షిగా అభివృద్ధి, సంక్షేమాలపై మరోసారి ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. ఎన్నికల సందర్భంగా ఈసీ నిష్పక్షపాత చర్యలను సైతం ప్రతిపక్ష నేత చంద్రబాబుపైకి నెట్టేస్తూ తన కుట్రలను కప్పిపుచ్చుకున్నారు. -
జగన్ నిర్వాకం.. యువశక్తి నిర్వీర్యం
[ 07-05-2024]
జగన్ ఐదేళ్ల పాలన తలచుకుంటే యువత గుండెలు బరువెక్కిపోతున్నాయి. కోపంతో రగిలిపోతున్నాయి. ఎంతో విలువైన కాలాన్ని కోల్పోయి.. జీవితంలో స్థిరపడలేక.. తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడలేక.. వైకాపా ప్రభుత్వ చేతకానితనానికి బలైపోయిన యువత దైన్య స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. -
ఓటుకు రేటు..!
[ 07-05-2024]
ఉమ్మడి జిల్లాలో అది కీలక నియోజకవర్గం. అక్కడ అభివృద్ధి లేక.. స్థానిక ప్రజాప్రతినిధి బూతులు వినలేక.. సకల సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న జనం ఈసారి స్పష్టమైన మార్పు కోరుతున్నారు. -
వివరాలు రాలేదని ఓటు వేయనీయలేదు
[ 07-05-2024]
పోస్టల్ బ్యాలట్ ఓటు వినియోగంలో తలెత్తిన సమస్యలతో పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో విధులు నిర్వహిస్తూ ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు మచిలీపట్నంలోని చిలకలపూడి మున్సిపల్ పాండురంగ ఉన్నతపాఠశాలలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశారు. -
నగరంలో రెడ్ జోన్ అమలు
[ 07-05-2024]
ఈ నెల 8న ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా విజయవాడ నగరంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మోదీ పర్యటించే ప్రాంతాల్లో రెండు కిలోమీటర్ల మేర ప్రాంతాన్ని రెడ్జోన్ (నో ఫ్లయింగ్ జోన్)గా ప్రకటించారు. -
నాలుగు సార్లు గెలిపించినా.. నీరివ్వరేమని
[ 07-05-2024]
గుడివాడలో గుక్కెడు మంచినీటి కోసం ప్రజలు అల్లాడిపోతున్నారంటే ఆ పాపం కచ్చితంగా ఎమ్మెల్యే కొడాలి నానిదే. ఈ నియోజకవర్గం నుంచి ఆయన్ను వరుసగా నాలుగుసార్లు శాసనసభకు పంపించిన ప్రజల కష్టాలకు ఏమాత్రం చలించకుండా బెల్లం కొట్టిన రాయిలా మిన్నకుండిపోయారు. -
వైకాపా నాయకుల ఒత్తిడితో 122 మంది వాలంటీర్ల రాజీనామా
[ 07-05-2024]
ఆట చివరకు వచ్చింది..ముసుగేసుకున్న ముఖాలన్నీ వాటిని తొలగించి రోడ్డుపైకి వచ్చేశాయి.. వైకాపా నాయకుల ఒత్తిడితో గుడ్లవల్లేరు మండలంలోని 122 మంది గ్రామవాలంటీర్లు సోమవారం మూకుమ్మడిగా రాజీనామాలు చేసి నేరుగా ఇంటింటికి వెళ్లి వైకాపాకు ఓటేయాలని ప్రచారం చేపట్టారు. -
ఆశీర్వదించండి...అండగా ఉంటా: కొల్లు
[ 07-05-2024]
ఆశీర్వదించండి అందరికీ అండగా ఉంటానని కూటమి మచిలీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన నగరంలోని 26,27,28 డివిజన్లతోపాటు బందరు మండల పరిధిలోని గుండుపాలెం, ఆర్.గొల్లపాలెం తదితర గ్రామాల్లో పర్యటించారు. -
మూడు వంతెనలన్నారు.. రైతులను ముంచారు
[ 07-05-2024]
కృత్తివెన్ను మండలంలోని పెదలంక డ్రైయిన్కు రూ.40కోట్లు, పడతడిక-చినగొల్లపాలెం మధ్యగల కొత్తకాలువకు రూ.136.6కోట్లు, ఏటిమొండిపల్లెపాలెం-మోళ్లపర్రు మధ్యగల ఉప్పుటేరుకు రూ.188.4కోట్ల నిధులతో మొత్తం మూడు రెగ్యులేటర్ కం బ్రిడ్జిలకు రూ.365 కోట్లు నిధులు సీఎం జగన్ మంజూరు చేసినట్లు మంత్రి జోగి రమేష్ ప్రజలను మోసం చేశారు. -
రాక్షస సంహారానికే కూటమి : నారా రోహిత్
[ 07-05-2024]
కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం సినీ నటుడు నారా రోహిత్, హాస్య నటుడు రఘు, ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) కుమారుడు వెంకట్, ఎమ్మెల్యే అభ్యర్థిని తంగిరాల సౌమ్యలతో కలిసి ఎన్టీఆర్ జిల్లాలోని చందర్లపాడులో రోడ్షో నిర్వహించారు. -
నా ఎస్సీ, నా ఎస్టీ.. నా బీసీలంటూనే దాడులు
[ 07-05-2024]
జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందని... నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూనే వారిపై వైకాపా నేతలే దాడులకు తెగబడుతున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. -
ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కేసులు
[ 07-05-2024]
ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డిల్లీరావు తెలిపారు. నందిగామలో నిర్వహించిన ఎన్నికల సిబ్బంది శిక్షణలో ఆయన పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. -
తుమ్మలపల్లి కళా క్షేత్రంలో పోస్టల్ బ్యాలట్ సదుపాయం
[ 07-05-2024]
నగరంలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వివిధ విభాగాలకు చెందిన వారికి పోస్టల్ బ్యాలట్ వినియోగ సౌకర్యాన్ని ఈ నెల 7, 8 తేదీల్లో కల్పించినట్టు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు. -
నేటి నుంచి హోమ్ ఓటింగ్
[ 07-05-2024]
పోలింగ్ శాతం పెంచేందుకు, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల కమిషన్ వివిధ ఏర్పాట్లను చేస్తోంది. ఈ క్రమంలో 85 సంవత్సరాల వయసు పైబడిన వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు ఈ నెల 7, 8 తేదీల్లో ఇంటి వద్దే (హోమ్) ఓటు వేసే సదుపాయం కల్పించినట్లు కలెక్టర్ ఎస్.డిల్లీరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
భారత్ స్నేహ పూర్వకమే కాదు.. శక్తిమంతమైనది కూడా: జైశంకర్
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
ఎప్పటికైనా పూర్తి యానిమేషన్ మూవీ తీస్తా.. ఆసక్తికర విషయాలు చెప్పిన రాజమౌళి
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
ఏపీలో మరో ఇద్దరు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు