ప్రాణం తీసిన ఈత సరదా
స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం.
కాలువలో మునిగి ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
మేడికొండూరు, న్యూస్టుడే: స్నేహితులతో కలిసి సరదాగా ఈతకు వెళ్లిన ఇంజినీరింగ్ విద్యార్థి నీట మునిగి మృతి చెందిన విషాదకర సంఘటన మండలంలో బుధవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. సీఐ జయ్కుమార్ తెలిపిన వివరాల మేరకు మేరకు బాపట్ల పట్టణానికి చెందిన ఇంకొల్లు నాగేశ్వరరావుది వ్యవసాయ కుటుంబం. కొన్నేళ్ల కిందట కృష్ణా జిల్లా మోపిదేవి మండలం కొక్కిలిగడ్డ కొత్తపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. వారి కుమారుడు కార్తిక్(20) గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంలోని ఒక కళాశాల వసతిగృహంలో ఉంటూ బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం శ్రీరామ నవమి కావడంతో కళాశాలకు సెలవు ప్రకటించారు. పండుగ సందర్భంగా ఆలయానికి వెళ్తున్నామని చెప్పి కార్తిక్, మరో ముగ్గురు విద్యార్థులు కలిసి కళాశాల నుంచి బయటకు వచ్చారు. కాసేపటికి కాలకృత్యాలు తీర్చుకునేందుకు బండారుపల్లి మేజర్ కాలవ వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో కార్తిక్ ఈత కొట్టేందుకు కాలువ గట్టుపై నుంచి కాలువలోకి దూకాడు. తొలుత రెండుసార్లు దూకి పైకి వచ్చిన అతడు.. మూడోసారి ఎంతకీ బయటకు రాలేదు. దీంతో స్నేహితులు మేడికొండూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ జయ్కుమార్ సిబ్బందితో కలిసి అక్కడకు వెళ్లారు. స్థానికులు, ఈతగాళ్ల సాయంతో కాలువలో సుమారు నాలుగు గంటల పాటు జల్లెడ పట్టారు. ఘటనా స్థలికి కిలో మీటరు దూరంలో కార్తిక్ మృతదేహాన్ని గుర్తించారు. అతడి తల భాగం వద్ద రక్తపు గాయం ఉంది. ఈతకు దూకిన క్రమంలో నేలకు తగిలి గాయమై ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో మహిళ ..
గూడూరు: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...తోట్లవల్లూరు మండల పరిధిలోని గరికపర్రు నుంచి బోలెం నాగమల్లేశ్వరరావు, శివకుమారి దంపతులు ద్విచక్రవాహనంపై మచిలీపట్నం వచ్చేందుకు బయలుదేరారు. ఈ క్రమంలో గూడూరు వద్ద విజయవాడ నుంచి మచిలీపట్నం వైపు వస్తున్న కారు బైక్ను ఢీకొంది. దీంతో శివకుమారి(55) అక్కడికక్కడే మృతిచెందగా గాయాలపాలైన ఆమె భర్తను చికిత్స నిమిత్తం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు కూడా స్వల్పగాయాలయ్యాయి. వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు.
అనుమానాస్పద స్థితిలో యువకుడు..
కొండపల్లి: యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన కొండపల్లి పారిశ్రామికవాడ లాడ్జిలో బుధవారం చోటుచేసుకొంది. సీఐ సత్యనారాయణ వివరాలు ప్రకారం.. కృష్ణా జిల్లా పెడన ఉరిమి గ్రామానికి చెందిన ఎ.పవన్ (27) స్థానిక ఫార్మా కంపెనీలో కెమిస్ట్గా పనిచేస్తున్నాడు. పరిశ్రమల సమీపంలోని ఓ లాడ్జిలో అద్దెకు ఉంటున్నాడు. బుధవారం ఉదయం లాడ్జి గదిలో పవన్ అచేతనంగా పడిఉండటం చూసిన నిర్వాహకులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం ఇచ్చారు. తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గదిలో యువకుడు వాంతులు చేసుకొని ఉండటంతో అనారోగ్య కారణాలే మృతికి కారణమని భావిస్తున్నారు.
ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు
ఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: ప్రైవేటు పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నంలోని ఓ పాఠశాలలో విద్యార్థినిపై అక్కడి ప్రధానోపాధ్యాయుడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ బాలిక తండ్రి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ప్రధానోపాధ్యాయుడితో పాటు మరో ఇద్దరు ఉపాధ్యాయినిలపై ఇబ్రహీంపట్నం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే విద్యార్థుల ఫీజు విషయంలో ఆ పాఠశాల ఉపాధ్యాయినిలపై సదరు తండ్రి అసభ్యంగా మాట్లాడాడంటూ వారం క్రితం కేసు నమోదవడం గమనార్హం.
ఎన్టీటీపీఎస్ కాల్వలో పడి వ్యక్తి మృతి
ఇబ్రహీంపట్నం, న్యూస్టుడే: ఎన్టీటీపీఎస్కు వెళ్లే చన్నీళ్ల కాలువలో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం చోటుచేసుకొంది. మృతునికి 40-45 వయసు, 5.5 అడుగుల ఎత్తు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. స్నానానికి కాలువలో దిగి ప్రమాదవశాత్తు ప్రవాహంలో కొట్టుకుపోయి ఉండడని భావిస్తున్నారు. మృతదేహాన్ని శవపరీక్షకు విజయవాడ తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదైంది.
ఎలక్ట్రికల్ స్కూటర్ దగ్ధం
సీతారాంపురం, న్యూస్టుడే: స్థానిక 25వ డివిజన్ దుర్గా అగ్రహారంలోని నంబూరివారి వీధిలో నివసించే ఎస్.పవన్కుమార్కు చెందిన ఎలక్ట్రికల్ స్కూటర్ నుంచి మంటలు వ్యాపించి కాలిపోయింది. ఈ నెల 15వ తేదీ సాయంత్రం పవన్కుమార్ ఇంటి బయట ఛార్జింగ్ పెట్టారు. పది నిమిషాలకే పొగలు వచ్చి, మంటలు వ్యాపించాయి. పెద్ద శబ్దంతో కాలిపోయిందని ఆయన తెలిపారు. స్థానికులు నీళ్లు పోసి మంటలు ఆర్పేశారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
[ 30-04-2024]
విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. -
అణువణువూ నిఘా!
[ 30-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సంచార నిఘా వాహనం ఏర్పాటు చేశారు. -
వైకాపా కూపన్లపై దర్యాప్తు ముమ్మరం
[ 30-04-2024]
అజిత్సింగ్నగర్లో ఆదివారం పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్లపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
ఓటమి భయంతో అవినాష్ అసత్య ప్రచారం
[ 30-04-2024]
వైకాపా విజయవాడ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి దేవినేని అవినాష్కు ఓటమి భయం పట్టుకుందని.. దీంతో హైదరాబాద్ గంగోత్రి పాఠశాల ప్రాంతంలో జరిగిన అభివృద్ధిని వీడియోగా చిత్రీకరించి.. అది విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా పాలనలో తాము చేసిన అభివృద్ధి అంటూ ఫేక్ ప్రచారాలు చేసుకునే స్థాయికి దిగజారిపోయారని తెదేపా జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుల నియామకం
[ 30-04-2024]
సాధారణ ఎన్నికలు 2024కు సంబంధించి జిల్లాలోని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల కమిషన్ ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్ అధికారులను పరిశీలకులుగా నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. -
నాలుగేళ్లుగా నాన్చుడే పని
[ 30-04-2024]
-
వైకాపా అరాచకీయం!
[ 30-04-2024]
‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్ బూత్ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. -
రసబరితం..!
[ 30-04-2024]
‘‘నామపత్ర ఘట్టం పూర్తయింది. బుజ్జగింపులకు తెరపడింది. కొందరు బరి నుంచి వైదొలిగారు. పోటీపడే అభ్యర్థుల లెక్క తేలింది. -
కత్తిగట్టారు.. కుట్రపన్నారు!
[ 30-04-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో 4,81,629 మంది పింఛనుదారులు ఉన్నారు. వీరికి రూ.142.98 కోట్లు సొమ్ము పంచాలి. మొత్తంగా 1,113 వార్డు, గ్రామ సచివాలయాలు ఉన్నాయి. -
కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో.. మహోన్నత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ : బుద్ధప్రసాద్
[ 30-04-2024]
కూటమి ప్రుభుత్వం ఏర్పాటుతో ఆంధ్ర ప్రదేశ్ మహోన్నత రాష్ట్రంగా రూపొందుతుందని మాజీ ఉపసబాపతి మండలి బుద్ధప్రసాద్ చెప్పారు. -
అత్యాచారం కేసులో ఇద్దరికి పదేళ్ల జైలు
[ 30-04-2024]
వివాహితపై సామూహిక అత్యాచారం చేసి ఆమెను చిత్రహింసలకు గురిచేసిన ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష, రూ.3 వేల చొప్పున జరిమానా విధిస్తూ విజయవాడ మహిళా సెషన్స్ న్యాయస్థానం న్యాయాధికారి ఐ.శైలజాదేవి సోమవారం తీర్పు చెప్పారు -
గురువులపై దమనకాండ
[ 30-04-2024]
జగన్ ప్రభుత్వం తమపై కక్ష గట్టి, పోలీసులతో కేసులు పెట్టించి.. ఉద్యమాన్ని అణచివేసేలా వ్యవహరించిందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రాజధాని అమరావతితోనే నగరాభివృద్ధి
[ 30-04-2024]
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంతోనే విజయవాడ నగరం అభివృద్ధి చెందుతుందని జనసేన, భాజపా బలపరిచిన విజయవాడ పార్లమెంట్ తెదేపా ఎంపీ అభ్యర్థి కేశినేని శివనాథ్(చిన్ని) అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చూసిన 5 నిమిషాలకే పెళ్లి చేసుకోవాలనిపించింది
-
ధరలు పెరిగినా.. బంగారం గిరాకీ తగ్గలే!
-
కేజ్రీవాల్ను కలిసిన పంజాబ్ సీఎం.. ఆయన ఏం చెప్పారంటే?
-
విప్రో కొత్త సీఈఓ వేతనం ఎంతో తెలుసా?
-
కరోనా జన్యు గుట్టువిప్పిన శాస్త్రవేత్తకు చైనా వేధింపులు..!
-
‘ఇప్పటికి నిద్ర లేచారు..’: పతంజలి ఉత్పత్తుల లైసెన్సు రద్దుపై సుప్రీం