నకిలీ మద్యం.. తాగితే ప్రాణాంతకం
నకిలీ మద్యం కొన్ని వేల కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. ఆర్థికంగా, అనారోగ్య పరంగా చితికిపోతున్న వ్యసనపరులు అర్థంతరంగా మృత్యువాత పడుతున్నారు. తీరప్రాంత మండలాల్లో రోజువారీ సంభవిస్తున్న మరణాల్లో ఆరు శాతం మద్యం సంబంధిత కారణాల వల్లే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
బానిసైతే కుటుంబాలు ఛిద్రం
ఎన్నికల వేళ అప్రమత్తత అవసరం
మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్టుడే: నకిలీ మద్యం కొన్ని వేల కుటుంబాల్లో చీకట్లు నింపుతోంది. ఆర్థికంగా, అనారోగ్య పరంగా చితికిపోతున్న వ్యసనపరులు అర్థంతరంగా మృత్యువాత పడుతున్నారు. తీరప్రాంత మండలాల్లో రోజువారీ సంభవిస్తున్న మరణాల్లో ఆరు శాతం మద్యం సంబంధిత కారణాల వల్లే అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల పరిధిలో అత్యధికశాతం మంది చేతివృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. చేపలవేట, చేనేతతో పాటు అసంఘటిత రంగాల ద్వారా రమారమి రెండు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. చేసిన కష్టం నుంచి ఉపశమనం లభిస్తుందన్న అపోహతో మద్యానికి అలవాటు పడిన వారికి ఆ వ్యసనమే మరణశాసనంగా మారుతోంది. నాణ్యతతో కూడిన ఆల్కహాల్ను పరిమితంగా తీసుకోవడం వల్ల ప్రాణాంతక ప్రమాదం ఉండదని వైద్యులు స్పష్టం చేస్తున్నా, బహిరంగ మార్కెట్లో దొరికే నాసిరకం మద్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
తీరప్రాంత వాసుల్లో కలవరం
కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం మండలాల పరిధిలో ఎక్కువగా తీరప్రాంత గ్రామాలున్నాయి. మత్స్యకారుల్లో 90 శాతానికి పైబడి మద్యం అలవాటు ఉన్న వారే. నాసిరకం మద్యం కారణంగా శరవేగంగా ఆరోగ్యం పాడై చనిపోతున్న వారి సంఖ్య ఆందోళన కల్గించే స్థాయికి చేరుకుంటోంది. సంభవిస్తున్న మరణాల్లో ఆరుశాతం వరకూ మద్యం కారణంగా తలెత్తిన వ్యాధుల వల్లే అనేది స్పష్టంగా కన్పిస్తోంది. పెడనలో కేవలం మద్యం కారణంగా ఇటీవల కాలంలో ఇద్దరు మహిళలు మృత్యువాత పడడం గమనార్హం. మద్యం కారణంగా తలెత్తిన ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇటీవల కాలంలోనే చిన్నాపురం, పీటీపాలెం, పీతలావ, తదితర గ్రామాల పరిధిలో కొందరు బలవన్మరణాలకు గురయ్యారు. నాసిరకం మద్యాన్ని నియంత్రించే చర్యలు లేకపోవడం పట్ల ముఖ్యంగా తీరప్రాంత వాసుల్లో కలవరం వ్యక్తమవుతోంది.
ఎన్నికÛల వేళ అప్రమత్తం
ఎన్నికల నేపథ్యంలో గ్రామగ్రామాన కన్పిస్తున్న గోవా బ్రాండ్ల పేరుతో కన్పిస్తున్న మద్యం సీసాలు మరింత ఆందోళన కల్గిస్తున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గానికి చెందిన వ్యక్తుల ద్వారా జిల్లా వ్యాప్తంగా గోవా బ్రాండ్ పేరుతో సరఫరా చేసినట్టుగా భావిస్తున్న మద్యం స్థానికంగానే తయారుచేశారన్న ప్రచారం ఉంది. ఇదే విషయం సామాజిక మాధ్యమాల్లోనూ హల్చల్ చేసింది. గన్నవరంలో భారీగా పోలీసులకు పట్టుబడిన మద్యం కూడా వారు సరఫరా చేసిందే అన్న దిశగా దర్యాప్తు సాగుతున్నట్టు సమాచారం.
పత్తాలేని ఈఎన్ఏ నిబంధన
గతంలో శుద్ధి చేసిన ఎక్స్ట్రాక్టెడ్ న్యూట్రల్ ఆల్కహాల్(ఈఎన్ఏ)తో తయారు చేసిన మద్యం మాత్రమే విక్రయించాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు ఈఎన్ఏతో పనిలేకుండా ఇష్టానుసారం వివిధ బ్రాండ్ల రూపంలో వస్తున్న మద్యంపై తీవ్ర విమర్శలున్నాయి. ఎన్నికల నేపథ్యంలో లాభాపేక్షతో మత్తు కోసం ఆరోగ్యానికి హానికరమైన కొన్ని రసాయనాలు కలుపుతున్నారన్న ఆరోపణలున్నాయి.
రోజూ రూ.కోటికి తగ్గకుండా వ్యాపారం
మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల పరిధిలోని బార్లు, ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా రోజూ కోటి రూపాయలకు తగ్గకుండా మద్యం వ్యాపారం సాగుతోంది. ఇందులో 60 శాతం వాటా కేవలం రెక్కల కష్టం చేసుకునే వారిదే కావడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి సీసాకు నిర్ణయించిన ధరకన్నా రూ.50 వరకూ అదనంగా వసూలు చేస్తున్నారు. వ్యసనం పట్ల కాస్తోకూసో నియంత్రణ ఉన్న వారు సగటున రోజుకు రూ.400 వరకూ మద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. పనులు లేని రోజుల్లో అప్పులు చేస్తూ కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారు.
ఎక్కడికి వెళ్లారో తెలియదు
ఏసోబు, కోన
ఇంటిల్లపాదీ కష్టం చేసుకుంటూ దర్జాగా బతికే నా సోదరుడు మద్యం వ్యసనంతో వలస వెళ్లిపోవాల్సి వచ్చింది. తాగుడు కోసం ఆర్థికంగా చితికిపోవడమే కాకుండా అప్పుల పాలయ్యారు. వైద్యం కోసం తెచ్చిన అప్పులతో ఆరోగ్యం చేకూరకపోగా ఆ భారం పెరిగిపోయింది. దీంతో మూడో కంటికి తెలియకుండా కుటుంబంతో ఎటో వెళ్లిపోయారు.
మగదిక్కు లేకుండా పోయింది
తాగుడు కారణంగా ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది. నాభర్త మద్యం తాగడంతో నరాలు చచ్చుబడి రెండేళ్ల పాటు మంచానికే పరిమితమై చచ్చిపోయాడు. ఇది జరిగిన ఏడాదికే నాకొడుకు మద్యానికి బానిసై అర్ధంతరంగా మరణించాడు. పింఛను మీద ఆధారపడి బతుకు వెళ్లదీయాల్సి వస్తోంది.
సువార్తమ్మ, పెదతుమ్మిడి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!