సంపద సృష్టిస్తాం... ప్రజలకే అందిస్తాం
రాష్ట్రంలో సంపదను సృష్టించి.. ఆ సంపదను ప్రజలకు అందించేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.
మాట్లాడుతున్న మాజీ మంత్రి దేవినేని, పక్కన కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ
మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్టుడే: రాష్ట్రంలో సంపదను సృష్టించి.. ఆ సంపదను ప్రజలకు అందించేలా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. కూటమి అభ్యర్థులైన వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రల విజయాన్ని కాంకిస్తూ బుధవారం చిన్నాపురంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కొల్లుతో పాటు దేవినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడచిన ఐదు సంవత్సరాలుగా రైతులు పడుతున్న ఇబ్బందులు, సాగునీరు ఇవ్వలేని దుస్థితి పునరావృతం కానీయకుండా చూసుకునే బాధ్యత తీసుకుంటామన్నారు. తెదేపా ప్రకటించిన సూపర్-6 పథకాల ద్వారా పేద, మధ్య తరగతి వర్గాలకు చేకూరే ఆర్థిక ప్రయోజనాలు అపూర్వమన్నారు. మూడు ఉచిత సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక సాయం అందుతాయన్నారు. కూటమి అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాలని కోరారు. కొల్లు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని ఐదేళ్ల పాటు తన వ్యక్తిగత ఎదుగుదల, కొడుకు కిట్టూకు అధికారం కట్టబెట్టాలన్న తాపత్రయం మినహా ప్రజల కోసం చేసింది శూన్యమన్నారు. వచ్చే ఎన్నికల్లో తగురీతిన బుద్ధి చెప్పాలని కోరారు. పార్టీ నాయకులు కొనకళ్ల జగన్నాధరావు(బుల్లయ్య), కాగిత గోపాలరావు , జనసేన ఇన్ఛార్జి బండి రామకృష్ణ, గళ్లా తిమోతి, తదితరుల నేతృత్వాన చిన్నాపురం, నెలకుర్రు తదితర గ్రామాల్లో సాగిన ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధికి.. అహంకారానికి మధ్య జరుగుతున్న ఎన్నికల్లో సంక్షేమ పథకాలకు కాపలాదారు కావాలా... గంజాయి బ్యాచ్కు కొమ్ముకాసే వారు కావాలో విజ్ఞులైన ఓటర్లు ఆలోచించి ఓటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
[ 20-05-2024]
పోలింగ్ రోజు తాను పల్నాడు జిల్లాలో హింసను ప్రేరేపించినట్లుగా వైకాపా దుష్ప్రచారం చేస్తోందని తెదేపా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. -
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
బాలుడి డ్రైవింగ్తో ఇద్దరి మృతి.. ప్రమాదంపై టీనేజర్ను వ్యాసం రాయమన్న కోర్టు
-
అది మనసులో పెట్టుకొనే ఓటేశా: పౌరసత్వం తర్వాత అక్షయ్ కుమార్ తొలి ఓటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 pM
-
ఐఆర్జీసీకి ఆప్తుడు.. ఎవరీ హొస్సేన్ అమీర్ అబ్దొల్లహియన్
-
ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఆ లింకులపై క్లిక్ చేయొద్దు..!
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు