వంశీకి ఓటేస్తే.. మహిళలను అవమానించినట్లే: పవన్
కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. జంక్షన్లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు.. గన్నవరం, పెనమలూరు, నూజివీడు, దెందులూరు నుంచి జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికాయి.
జంక్షన్లో... జనసేనానికి జన నీరాజనం
మండుటెండను లెక్కచేయని అభిమానులు
జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న పవన్కల్యాణ్
ఈనాడు, అమరావతి - హనుమాన్ జంక్షన్, న్యూస్టుడే: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు బుధవారం అపూర్వ స్వాగతం లభించింది. జంక్షన్లో నిర్వహించిన వారాహి విజయభేరి సభకు.. గన్నవరం, పెనమలూరు, నూజివీడు, దెందులూరు నుంచి జనసేన, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా తరలివచ్చి స్వాగతం పలికాయి. మిట్టమధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఎండ తీవ్రంగా ఉన్నా.. లెక్కచేయకుండా జనసేనాని కోసం శ్రేణులు ఉత్సాహంగా ఎదురుచూశాయి. జంక్షన్లో దారులన్నీ.. కూటమి శ్రేణులతో కిక్కిరిశాయి. సభావేదిక వద్ద ఇసుక వేస్తే రాలనంత మంది జనం తరలివచ్చారు. మధ్యాహ్నం ఒంటిగంటన్నరకు సభ ప్రారంభమైనప్పటి నుంచి పవన్ ప్రసంగం ముగిసే వరకూ.. అలాగే జంక్షన్ పోలీస్స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై సభా వేదిక వద్ద నిలబడి.. ప్రతి మాటకూ చప్పట్లు, ఈలలతో మోతమోగించారు. ఎన్డీయే కూటమి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, గన్నవరం, పెనమలూరు, దెందులూరు, నూజివీడు అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, బోడే ప్రసాద్, చింతమనేని ప్రభాకర్, కొలుసు పార్థసారథి, తెదేపా, జనసేన జిల్లా అధ్యక్షులు కొనకళ్ల నారాయణరావు, బండ్రెడ్డి రామకృష్ణ, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ తదితరులు హాజరయ్యారు.
అతను.. సంస్కారం లేని వ్యక్తి..
గన్నవరం నుంచి వైకాపా తరఫున పోటీ చేస్తున్న వంశీ లాంటి వారికి అసలు ఓట్లు వేయొద్దని పవన్ సూచించారు. ‘నేతల మధ్య రాజకీయ పరమైన విభేదాలుండొచ్చు. పార్టీల పరంగా విమర్శలు చేసుకోవచ్చు. కానీ.. నాకెంతో ఇష్టమైన మహనీయులైన ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని కించపరిచే మాటలు వంశీ మాట్లాడటం అసలు సరికాదు. ఆమె నా సోదరితో సమానం. ఒక మహిళపై ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేసిన వాళ్లకు జనసేన మద్దతుదారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయకండి. ఒకవేళ వేస్తే.. స్త్రీలను అగౌరవపరిచిన మనస్తత్వం ఉన్న వ్యక్తికి మద్దతు ఇచ్చినట్లే. మన సోదరిని అగౌరవపరిచిన వ్యక్తికి మనం ఓటేసినట్లే. అలాంటి నైజం ఉన్న వాళ్లు.. ఏ ఆడవాళ్లనైనా అలాగే అగౌరవపరుస్తారు. సంస్కారం లేని వంశీ లాంటి వాళ్లకు ఓట్లేయొద్దని.. జనసేన శ్రేణులు, వీరమహిళలకు నా విజ్ఞప్తి’ అని పవన్ అన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, నాయకులతో కలిసి ఐక్యత చాటుతున్న పవన్కల్యాణ్
బాలశౌరి, యార్లగడ్డను గెలిపించండి.. మచిలీపట్నం లోక్సభ పరిధిలో కూటమి అభ్యర్థిగా జనసేన గాజు గ్లాసు గుర్తుపై పోటీచేస్తున్న వల్లభనేని బాలశౌరి, గన్నవరం అసెంబ్లీలో తెదేపా తరఫున పోటీ చేస్తున్న యార్లగడ్డ వెంకట్రావును మంచి మెజార్టీతో గెలిపించాలని పవన్ విజ్ఞప్తి చేశారు. వంశీ లాంటి వాళ్లు జనసేన శ్రేణులను ప్రలోభాలకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందన్నారు. ఎంపీగా ఓటు బాలశౌరికి వేసి.. ఎమ్మెల్యేగా తనకు వేయమని వంశీ అడుగుతున్నారని తెలిసిందన్నారు. కానీ.. అలాంటి వారి మాటలు వినొద్దని పవన్ సూచించారు. సంస్కారవంతుడు, ప్రజలకు అండగా నిలిచే యార్లగడ్డ వెంకట్రావుకే జనసైనికులు అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.
మల్లవల్లి, విమానాశ్రయ రైతులకు న్యాయం.. మల్లవల్లి పారిశ్రామికవాడ, గన్నవరం విమానాశ్రయ విస్తరణతో భూములు కోల్పోయిన రైతుల ఆవేదన తనకు తెలుసనీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారికి పూర్తి న్యాయం జరిగేలా చూస్తానని పవన్ భరోసా ఇచ్చారు. మల్లవల్లి పారిశ్రామికవాడలో పూర్తిస్థాయిలో పరిశ్రమలు నెలకొల్పేలా కార్యాచరణ చేపట్టి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు.
సంపద సృష్టించి.. సంక్షేమం అమలు చేస్తాం..
బాలశౌరి, ఎన్డీయే కూటమి మచిలీపట్నం లోక్సభ అభ్యర్థి
వైకాపా ప్రభుత్వానికి సంపద సృష్టి తెలియదు. అమరావతి, పోలవరాన్ని నాశనం చేశారు. మల్లవల్లి వంటి పారిశ్రామికవాడలను ఆపేశారు. ఇలాంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలి. రైతుల గురించి ఆలోచించే ప్రభుత్వం కాదిది. పవన్ తను సంపాదన నుంచి రూ.30 కోట్లు కౌలు రైతులకు ఇచ్చారు. నాయకుడంటే అలా ఉండాలి. కృష్ణాలో తాగు, సాగు నీళ్లు లేవు. పోలవరం పూర్తవ్వాలంటే.. కూటమి గెలవాలి. మచిలీపట్నం లోక్సభను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేలా అభివృద్ధి చేస్తాం. బందరు పోర్టును సాకారం చేసి, విస్తృతంగా ఉద్యోగ, ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పిస్తాను. సంపద సృష్టించి, సంక్షేమాన్ని అమలు చేస్తాం.
గన్నవరంలో గెలుపుతోనే వారికి సమాధానం
యార్లగడ్డ వెంకట్రావు, గన్నవరం అసెంబ్లీ ఎన్డీయే కూటమి అభ్యర్థి
వైకాపాలో ఎన్నో అవమానాలు ఎదుర్కొని, ఇక వద్దనుకుని బయటకొచ్చేశాను. గన్నవరంలో ఓడిపోతే.. అమెరికాకు వెళ్లిపోతానని దుష్ప్రచారం చేశారు. కానీ.. గత ఏడేళ్లుగా వెళ్లిపోయానా.. ఇక్కడే ఉన్నాను. ఎన్టీఆర్ బిడ్డ భువనేశ్వరిపై వంశీ చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరచిపోం. అసెంబ్లీలో ఒక మహిళ గురించి దిగజారి మాట్లాడుతుంటే.. ముఖ్యమంత్రి జగన్ కూడా చూస్తూ కళ్లుండీ.. ధృతరాష్ట్రుడిలా ఉండిపోయారు. మౌనం అర్ధాంగీకారంలా.. తన మంత్రులకు సీఎం మద్దతు ఇచ్చారు. బాంబులతో దాడిచేసినా చలించని.. చంద్రబాబుతో కన్నీరు పెట్టించినందుకు.. నా విజయంతో సమాధానం చెబుదాం. చంద్రబాబు అక్రమ అరెస్టు సమయంలో పవన్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తెదేపా శ్రేణులకు నైతికంగా ఎంతో అండగా నిలిచారు. ప్రజలకు మంచి చేయాలనే తపన ఉన్న జనసేనాని మద్దతుతో కూటమి గెలవబోతోంది.
చింతమనేనిపై ఆసక్తికర వ్యాఖ్యలు.. దెందులూరు నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతమనేని ప్రభాకర్కు జనసేన శ్రేణులంతా ఓట్లు వేసి గెలిపించాలని పవన్ సూచించారు. ఈ సందర్భంగా చింతమనేని గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘మా ఇద్దరి మైత్రి గొడవతో ఆరంభమైంది. చింతమనేని అంటే నాకు చాలా ఇష్టం. నేను దెందులూరు నుంచి పోటీ చేస్తానంటే గెలిపించే బాధ్యత తనదని అన్నందుకు ఆయనకు ధన్యవాదాలు.’ అని పవన్ అనడంతో సభలోని వారంతా ఈలలు, చప్పట్లతో మోత మోగించారు. పెనమలూరులో బోడే ప్రసాద్, నూజివీడులో పార్థసారథిని మంచి మెజార్టీతో గెలిపించాలనీ, జనసేన మద్దతుదారులంతా అండగా ఉండాలని పవన్ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఎన్నికల హింసపై సిట్ నివేదిక సిద్ధం
[ 20-05-2024]
ఏపీలో ఎన్నికలకు ముందు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. ఉదయం 10 గంటలకు డీజీపీకి ప్రత్యేక విచారణ బృందం నివేదిక అందించనుంది. -
నెగ్గేది మేమే.. తగ్గేది లేదే..!
[ 20-05-2024]
కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో గత ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడంతో.. విజయావకాశాలు ఎవరికి ఎక్కువనే దానిపైనే అన్ని పార్టీల్లో, ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. -
‘ఓటే’మాతరం
[ 20-05-2024]
ప్రజాస్వామ్యానికి ఊపిరి ఓటరే. సమర్థులైన పాలకులను ఎన్నుకునే బాధ్యతా వీరిదే. సమర్థులు ఇంట్లో ఉంటే.. అసమర్థులు రాజ్యమేలతారని ఓ సినీ రచయిత ఏనాడో చెప్పారు. -
డొక్కువి తప్పించరు.. కొత్తవి తెప్పించరు..
[ 20-05-2024]
ఆర్టీసీకి సకాలంలో కొత్త బస్సులు రాక.. పాత వాటినే నడపాల్సి వస్తోంది. ఫలితంగా నడిరోడ్లపై నిత్యం ఆగిపోతున్నాయి. అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. -
జాతీయ రహదారైతే మాకేంటి?
[ 20-05-2024]
16వ జాతీయ రహదారి వాహనాల పార్కింగ్కు అడ్డాగా మారిపోయింది. చెన్నై నుంచి కోల్కతా వరకు వ్యాపించి ఉన్న ఈ మార్గంలో వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేయడం పరిపాటైంది. -
ఓటమి భయంతోనే ముందస్తు దాడులు
[ 20-05-2024]
గన్నవరం నియోజకవర్గంలో ఓటమి ఖాయమని తేలడంతోనే పోలింగ్ సందర్భంగా వైకాపా మూకలు ముందస్తు అల్లర్లు, దాడులకు దిగాయని తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పేర్కొన్నారు. -
ఆసుపత్రి నుంచి కొనకళ్ల డిశ్ఛార్జి
[ 20-05-2024]
గుండెపోటుతో అస్వస్థతకు గురై గత నాలుగు రోజులుగా విజయవాడ రమేష్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న మచిలీపట్నం మాజీ ఎంపీ, జిల్లా తెదేపా అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు ఆదివారం డిశ్ఛార్జి అయ్యారు. -
ఓపెన్ చదరంగం విజేత మహేష్కుమార్
[ 20-05-2024]
తూర్పుగోదావరి జిల్లా చదరంగం సంఘ ఆధ్వర్యంలో ఫ్యూచర్కిడ్స్ పాఠశాలలో రాష్ట్రస్థాయి ఓపెన్ ర్యాపిడ్ చదరంగం టోర్నమెంట్ ఆదివారం జరిగింది. -
నైపుణ్యనారీ.. విజయాల భేరి
[ 20-05-2024]
కాలంతో పాటు పరిస్థితులూ మారుతున్నాయి. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన అతివలు.. నేడు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి కొత్త పుంతలు తొక్కుతున్నారు. -
అక్రమార్కులపై ఔదార్యం ఎందుకో..!
[ 20-05-2024]
ఇసుక అక్రమార్కులపై పోలీసు, రెవెన్యూ అధికారులు ఎనలేని ఔదార్యం చూపిస్తున్నారు. -
తిరుపతమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
[ 20-05-2024]
పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయానికి భక్తులు పోటెత్తారు.ఆదివారం తెల్లవారుజాము నుంచే మొదలైన రద్దీ మధ్యాహ్నం వరకు కొనసాగింది. -
సీసాలో పెట్రోల్ పోయలేదని బెదిరింపుల
[ 20-05-2024]
సీసాలో లూజుగా పెట్రోల్ పోయనని చెప్పిన పెట్రోల్ బంక్ సిబ్బందిని బెదిరించడమే కాకుండా.. బంక్ను తగలబెడతానన్న యువకుడిపై గవర్నర్పేట పోలీసులు శనివారం రాత్రి కేసు నమోదు చేశారు. -
పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ నేడు
[ 20-05-2024]
ఎన్టీఆర్ జిల్లా పవర్ లిఫ్టింగ్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం తిరువూరు సాయిబాబా కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణా జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహిస్తామని ఆ సంఘం కార్యదర్శి వి.మల్లేశ్వరరావు తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!
-
హెలికాప్టర్ ప్రమాదానికి ముందు.. రైసీ చివరి ఫొటో ఇదే..!
-
మరి కాసేపట్లో తెలంగాణ ఈసెట్ ఫలితాలు.. మీ eenadu.netలో
-
బెంగళూరు రేవ్పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
-
బెల్-212.. ఇరాన్ అధ్యక్షుడు ప్రయాణించిన ‘వర్క్హార్స్’!