చేదోడు కొందరికేనా..?
అనంతపురం నగరంలోని రజకనగర్లోని ఒకే సచివాలయంలోనే 200 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతంలోనే ఎక్కువమంది లబ్ధిదారులు ఉన్నారు.
పెండింగ్లో వేల దరఖాస్తులు
అర్హులకు మొండిచేయి
అనంతపురం నగరంలోని రజకనగర్లోని ఒకే సచివాలయంలోనే 200 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ ప్రాంతంలోనే ఎక్కువమంది లబ్ధిదారులు ఉన్నారు. గురువారం సెలవు రోజైనా సచివాలయ సిబ్బంది వివరాలు అనుసంధానం చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు వివరాలు అనుసంధానం చేసినా కేవలం 40 మంది లబ్ధిదారుల వివరాలు నమోదు చేశారు. ఇంకా 160 మందివి పెండింగ్లో ఉన్నాయి. అక్టోబరులో వరదలు రావడంతో ఇళ్లలోకి నీరు చేరడంతో పలువురు లబ్ధిదారుల ధ్రువపత్రాలు తడిసిపోవడంతో కొత్తవి తీసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. వరదలు వచ్చిన ప్రాంతాల్లోనే ఎక్కువగా రజకులు ఉన్నారు. రజకనగర్, గౌరవ గార్డెన్, ఇంద్రానగర్, మాతంగినగర్ ప్రాంతాల్లో ఇబ్బందిగా మారింది.
న్యూస్టుడే-అనంత సంక్షేమం
వైఎస్సాఆర్ చేదోడు పథకం లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తోంది. సాయం అందించేందుకు దరఖాస్తుల గడువు ముగిసింది. సవా లక్ష ధ్రువపత్రాలు అందివ్వాలంటూ సాయం ఎగ్గొట్టేందుకు హడావుడిగా షెడ్యూల్ ప్రకటించడంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది. కేవలం మూడ్రోజులు మాత్రమే గడువు ఇచ్చి పలు రకాల ధ్రువీకరణ పత్రాలు అందివ్వాలని చెప్పడంతో తిప్పలు పడాల్సిన పరిస్థితి. ఇచ్చింది మూడు రోజులు.. అదీ సెలవు రోజు ఆఖరి గడువుగా నిర్ణయించడంతో అధికారులు అందుబాటులో లేక వేలసంఖ్యలో దరఖాస్తులు నమోదుకు నోచుకోలేదు. ఈ పథకం కింద దర్జీలు, నాయీబ్రాహ్మణులు, రజకులకు మూడో విడత సాయం అందివ్వాలని సంక్షేమ క్యాలెండరులో ప్రకటించారు. ఈనెల 30న మూడో విడత సాయం అందివ్వాలని నిర్ణయించినట్లు అధికారులకు సమాచారం అందించారు.
సర్వర్ మొరాయింపు
గతంలో లబ్ధిదారులు కార్మిక ధ్రువీకరణ పత్రం (లేబర్ సర్టిఫికెట్) మీసేవ ద్వారా ఉండేది. తాజాగా కేవలం సచివాలయాల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. కుల ధ్రువీకరణ పత్రం పొందాలంటే తహసీల్దార్లు ఇతరత్రా పనుల్లో ఉండటంతో తీసుకొని రాలేకపోయారు. చూపిస్తున్నారు. ఈనెల 23వ తేదీ సాయంత్రం చేదోడు షెడ్యూల్ ఇచ్చారు. కులం, లేబర్, ఆదాయం, బ్యాంకు పాసుపుస్తం, రేషన్కార్డు, ఆధార్ కార్డు, ఫొటోను లబ్ధిదారుడు ఏప్రాంతంలో ఉంటే అక్కడే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలను గురువారం సాయంత్రం లోగా అనుసంధానం చేయాల్సి ఉండేది. సర్వర్ మొరాయించడంతో శుక్రవారం మధ్యాహ్నం వరకు గడువు పొడిగించారు.
నేటి మధ్యాహ్నం వరకు గడువు
గురువారం చేదోడు వివరాల నమోదు చేస్తున్న సచివాలయ సిబ్బంది
ఉమ్మడి జిల్లాలో 10 వేలకు పైగా దరఖాస్తులు పరిశీలనలో పెండింగ్లో ఉన్నాయి. గురువారం సాయంత్రం నుంచి సర్వర్ పనిచేయడం లేదు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట వరకు గడువు పెంచుతున్నట్లు గురువారం రాత్రి సమాచారం ఇచ్చారు. కేవలం కొన్ని గంటల్లోనే ఇన్ని వేల దరఖాస్తులు ఎలా పరిశీలించి అనుసంధానం చేస్తారన్నది ప్రశ్నార్థకమే. ఇంకా పూర్తిస్థాయిలో దరఖాస్తులు అందజేయనివారి పరిస్థితి ఇబ్బందికరమే. గంట గంటకు పరిశీలన ప్రక్రియ చేస్తున్నారని, శుక్రవారం వరకు గడువు పెంచడంతో ప్రక్రియ పూర్తి చేస్తామని బీసీ కార్పొరేషన్ ఈడీ నాగముణి తెలిపారు.
ప్రాంతం మారితే ఇక్కట్లే
లబ్ధిదారులు ఇళ్లు మారినా, దుకాణం మరోచోటకు మార్పు చేసుకొన్నా ఇక్కట్లు తప్పడం లేదు. వారంతా కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రెండుసార్లు లబ్ధిపొందడంతో గతంలో ఉన్న సచివాలయం వద్దకు వెళితే మీరు మరో ప్రాంతానికి వెళ్లాలని చెబుతుండటంతో వివరాలు సకాలంలో అందివ్వలేకపోతున్నారు. మారినవారు వేరే సచివాలయంలోకి వెళ్లాలని చెబుతున్నారు. సచివాలయంలో కొత్తగా దరఖాస్తు చేసుకోమంటున్నారు. రెన్యువల్ కాకపోవడంతో సచివాలయ సిబ్బంది మరో ప్రాంతానికి వెళ్లాలని సూచిస్తున్నారు.
దిక్కుతోచడం లేదు
రెన్యూవల్ చేయించుకోవాలని బుధవారం చెప్పారు. కుల, ఆదాయ, ఫొటోలు, లేబర్ సర్టిఫికెట్ కావాలంటున్నారు. లేబర్ సర్టిఫికెట్ మీసేవా కేంద్రంలో ఇవ్వలేదు. సచివాలయం వద్దకు గురువారం వెళితే ఈ సచివాలయంలో చేయంటున్నారు. వేరే సచివాలయంలోకి వెళ్లాలంటున్నారు. ఏం చేయాలో దిక్కు తోచలేదు. గడువు పెంచాలి.
- కవిత, రజకనగర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్కపోతకు ఉపశమనం
[ 08-05-2024]
ఉమ్మడి జిల్లాలో మంగళవారం రాత్రి మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో ప్రజలకు కాస్తా ఉపశమనం కలిగింది. పలు మండలాల్లో సాయంత్రం నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. -
అనంత రైతులకు జగన్ నవమోసాలు
[ 08-05-2024]
రైతు పక్షపాతి..బాంధవుడినంటూ గొప్పలు చెప్పుకొనే సీఎం జగన్...అనంత అన్నదాతలకు చేసిందేమీ లేదు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేపట్టి.. కనపడిన వారందరికీ ముద్దులు పెట్టిన జగన్.. అధికారంలోకి వచ్చాక పిడిగుద్దులు గుప్పిస్తున్నారు. -
‘ఇచ్చట ఓట్లు అమ్మబడవు’
[ 08-05-2024]
గుత్తిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పర్యవేక్షకుడిగా పని చేస్తున్న ఇస్మాయిల్ ఓటర్లను చైతన్యం పరుస్తున్నారు. గుంతకల్లులోని భాగ్యనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. -
అధికార పార్టీ సేవలో దుర్గం పోలీసు అధికారి
[ 08-05-2024]
ఎన్నికల నియమావళి పాటించడం లేదని, అధికార వైకాపాకు మేలు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని డీజీపీ, ఐజీ, ఎస్పీలపై ఎన్నికల కమిషన్ వేటు వేస్తున్నప్పటికీ కిందిస్థాయి అధికారులు, సిబ్బందిలో ఎటువంటి మార్పు కనిపించడం లేదు. -
నాడు బాదుడే బాదుడన్నాడు.. నేడు పన్నులు దండుకున్నాడు
[ 08-05-2024]
చంద్రబాబు పాలనలో ప్రజలపై పన్నులు బాదుడే బాదుడు అంటూ.. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నాటి తెదేపా ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలోకొచ్చాక.. నిస్సిగ్గుగా ఏటా ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపాడు. -
అనంతపురం అర్బన్ డీఎస్పీ బాధ్యతల స్వీకరణ
[ 08-05-2024]
అనంతపురం అర్బన్ నూతన డీఎస్పీగా టీవీవీ ప్రతాప్కుమార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న వీరరాఘవరెడ్డి ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేసిన విషయం విధితమే. -
తెదేపాలో భారీగా చేరికలు
[ 08-05-2024]
నియోజకవర్గంలోని పలు కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. మంగళవారం స్థానిక ప్రజావేదిక వద్ద తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. -
కన్నుపడితే కబ్జానే
[ 08-05-2024]
రాయదుర్గంలో వైకాపా నాయకులు వంకలు, రిజర్వుడ్ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో తెలుసుకొని ఆక్రమించేస్తున్నారు. -
వీఆర్కు కానిస్టేబుల్
[ 08-05-2024]
కళ్యాణదుర్గంలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి డబ్బులు పంచిన కానిస్టేబుల్ శివను పోలీసు అధికారులు వీఆర్కు పంపారు. -
నోట్లతో ఎర.. వినకుంటే బెదిరింపు
[ 08-05-2024]
పోస్టల్ బ్యాలెట్ పోలింగ్లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. పుట్టపర్తి ప్రభుత్వ పాఠశాల వద్ద వైకాపా నాయకులు మోహరించి బేరసారాలు సాగించారు. మండుటెండల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా ఉద్యోగులు ఓపిగ్గా నిరీక్షించి ఓటు వేశారు. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
[ 08-05-2024]
‘రానున్న కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. కూటమి మేనిఫెస్టోలోని సూపర్ సిక్స్ పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయి.