నిలదీస్తున్నారు.. తిరగలేం!
క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదు. గ్రామాలకు వెళ్తే సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో తిరగలేని పరిస్థితి ఉంది.. అని పలువురు ప్రజాప్రతినిధులు దిశా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
దిశా సమావేశంలో ప్రజాప్రతినిధుల ఆవేదన
సమావేశంలో మాట్లాడుతున్న దిశా ఛైర్మన్, ఎంపీ రంగయ్య, చిత్రంలో కలెక్టర్ గౌతమి, కాపు రామచంద్రారెడ్డి
లక్ష్మీనగర్(అనంతపురం), న్యూస్టుడే: క్షేత్రస్థాయిలో వివిధ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదు. గ్రామాలకు వెళ్తే సమస్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. క్షేత్రస్థాయిలో తిరగలేని పరిస్థితి ఉంది.. అని పలువురు ప్రజాప్రతినిధులు దిశా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం అనంతపురంలోని జిల్లా పరిషత్తు కార్యాలయం డీపీఆర్సీ సమావేశ భవనంలో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశా) సమావేశాన్ని నిర్వహించారు. అనంతపురం పార్లమెంట్ సభ్యుడు, దిశా ఛైర్మన్ రంగయ్య, దిశా కమిటీ మెంబర్ సెక్రటరీ జిల్లా కలెక్టర్ గౌతమి అధ్యక్షతన నిర్వహించారు. ఎమ్యెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రామచంద్రారెడ్డి, జిల్లా పరిషత్తు ఛైర్ పర్సన్ గిరిజమ్మ, ఎంపీపీలు పలు సమస్యలను లేవనెత్తారు. గ్రామాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉందని ఎందుకు సకాలంలో చర్యలు తీసుకోలేదని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్బాషాను ప్రశ్నించారు. మండలానికి ఒక ఆర్వో ప్లాంట్ పెట్టాలని ప్రతిపాదిస్తే ఎలా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రంలో ఆర్వో ప్లాంట్ పెడితే గ్రామాల్లో ఉండే ప్రజలు మండల కేంద్రానికి వచ్చి నీళ్లు తీసుకెళ్లాలా అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. పంచాయతీకొకటి చొప్పున ఆర్వో ప్లాంట్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని పథకాలకు సంబంధించి టెండర్లు పిలుస్తున్నా గుత్తేదారులు ముందుకు రావటం లేదని ఎస్ఈ వివరించారు. పీఏంఏవై కింద ఒక్కో నియోజకవర్గానికి ఒకలా ఇళ్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. ఒక నియోజకవర్గంలో వేల సంఖ్యలో ఇళ్లు కేటాయించారని మరో నియోజకవర్గంలో తక్కువ సంఖ్యలో కేటాయించారని ఇలా ఎందుకు చేశారో చెప్పాలన్నారు. ఇళ్లు కేటాయించాలని ప్రజలు అడుగుతున్నారని హౌసింగ్ అధికారులే వారికి సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. అనంతరం డ్వామా పీడీ వేణుగోపాల్రెడ్డిని ఉపాధి పనిదినాలు 100 రోజులు ఎందుకు కల్పించటం లేదని అడిగారు. పనులు కల్పించకపోవటం వల్ల కేంద్ర ప్రభుత్వ ఇచ్చే నిధులు వెనక్కి వెళ్లిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. పీడీ మాట్లాడుతూ.. ఉపాధి పనులకు సంబంధించి కేంద్రం కొత్త సాఫ్ట్వేర్ను అమలు చేస్తోందని కొన్ని సమస్యలు తలెత్తటంతో వివరాలు నమోదు చేయలేకపోయామన్నారు. ఉపాధిలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేయించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యాహక్కు చట్టం ప్రకారం 25శాతం సీట్లు పేదలకు ఇవ్వాల్సి ఉండగా ఎంతమంది ఇస్తున్నారో వివరాలను సేకరించి అందజేయాలన్నారు.
సమావేశ భవనానికి ఉన్న విద్యుత్తు వైరింగ్ను సక్రమంగా ఏర్పాటు లేక ఏసీలు పనిచేయలేదు. అధికారులు ఉక్కపోతను భరించలేక కాగితాలతో గాలి వీచుకుంటూ కనిపించారు. సమావేశంలో చర్చించిన అంశాలపై తీర్మానాలు చేశామని, వాటి వివరాలను అధికారులు ప్రజాప్రతినిధులకు అందజేస్తారని కలెక్టర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?