logo

Tadipatri: కత్తితో దంపతులపై దుండగులు దాడి

తాడిపత్రిలో దంపతులపై దాడి జరిగింది. కొంతమంది దుండగులు విజయనగర్‌ కాలనీకి చెందిన దంపతులపై కత్తితో దాడి చేశారు.

Published : 29 Nov 2023 11:13 IST

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో దంపతులపై దాడి జరిగింది. కొంతమంది దుండగులు విజయనగర్‌ కాలనీకి చెందిన దంపతులపై కత్తితో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయాన్నే రమాదేవి అనే మహిళ ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. అదే సమయంలో  ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి కత్తితో మహిళ గొంతు కోశారు. అక్కడే ఉన్న రమాదేవి భర్త వెంకటరామిరెడ్డి.. వారిని అడ్డుకోవడంతో అతడిపై కూడా దాడికి పాల్పడ్డారు. 

అయితే దుండగులు పాత కక్షలతో చేశారా? బంగారం కోసం చేశారా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పట్టణ సీఐ హమిత్‌ఖాన్‌ ఘటనాస్థలికి చేరుకుని సీసీ కెమేరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు