వైకాపాకు మరో అవకాశం ఇస్తే.. అరాచక పాలనే
ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైకాపాకు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు.
మాజీ మంత్రి పరిటాల సునీత, శ్రీరామ్
బసినేపల్లిలో మాట్లాడుతున్న పరిటాల సునీత
చెన్నేకొత్తపల్లి, అనంతపురం (కళ్యాణదుర్గంరోడ్డు), న్యూస్టుడే: ఒక్క ఛాన్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన వైకాపాకు మరో ఛాన్స్ ఇస్తే రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. చెన్నేకొత్తపల్లి మండలం ఉప్పరవాండ్ల కొట్టాల, బసినేపల్లి, నాగసముద్రం గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఆయా గ్రామాల్లో స్థానికులు, పార్టీ శ్రేణులు మాజీ మంత్రికి ఘనస్వాగతం పలికారు. తోపుదుర్తి సోదరుల నిరంకుశ ధోరణితో విసుగెత్తి ఆ పార్టీలోని అనేక మంది తెదేపాలో చేరుతున్నారన్నారు. దాన్ని జీర్ణించుకోలేని సోదరులు బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెదేపాకు వస్తున్న ఆదరణను ఓర్వలేక చెన్నేకొత్తపల్లి మండలం మేడాపురంలో తెదేపా సానుభూతిపరురాలు పసల రత్నమ్మ చీనీతోటకు నిప్పు పెట్టారని, నాగసముద్రంలో ఇటీవల తెదేపాలో చేరిన రైతు చంద్ర అరటి తోటకు నిప్పుపెట్టారని ధ్వజమెత్తారు. అదే గ్రామంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఓబిలేశుపై కనగానపల్లి మండలం నుంచి వైకాపా గూండాలు వచ్చి దాడి చేశారని, ఎర్రోనిపల్లిలో దళితుడు గణేష్పై దాడికి యత్నించారన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా తోపు సోదరులు, వారి అనుచరులు దాడులకు తెగబడ్డారని దుయ్యబట్టారు. వాటన్నింటికీ సమాధానం చెప్పే రోజు దగ్గరలోనే ఉందని నిప్పులు చెరిగారు. నియోజకవర్గంలో ఏ గ్రామానికి ప్రజలకు కనీసం తాగు నీళ్లిచ్చిన పాపాన పోలేదన్నారు.
తెదేపాలోకి భారీగా చేరికలు
కనగానపల్లి మండలం కోనాపురం, చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల, ముష్టికోవెల, ఆత్మకూరు, రాప్తాడు, అనంతపురం గ్రామీణం ఆకుతోటపల్లి, గ్రామాలకు చెందిన పలువురు వైకాపా నాయకులు శనివారం అనంతపురంలోని క్యాంప్ కార్యాలయంలో తెదేపాలో చేరారు. వారందరికీ సునీత, శ్రీరామ్, సీనియర్ నాయకుడు ఎల్ నారాయణచౌదరి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం సునీత, శ్రీరామ్ మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో ప్రకాశ్రెడ్డిని ఎవరైతే గెలిపించారో వారే ఇప్పుడు ఆయన ఓటమి కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి దమనకాండ
[ 10-05-2024]
అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు.. అన్యాయాన్ని నిలదీస్తే ఎదురుదాడులు.. అవినీతిపై ఫిర్యాదు చేస్తే ఇక అంతే సంగతులు. జగనన్న ఐదేళ్ల పాలన సాగిన తీరిది. ప్రశ్నించడం దేవుడెరుగు ప్రతిపక్ష పార్టీల సమావేశాలకు వెళ్లినా తలలు పగలగొట్టారు. -
తుస్సుమన్న జగన్ సభ
[ 10-05-2024]
కళ్యాణదుర్గంలో గురువారం జరిగిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి రోడ్షో, బహిరంగ సభ తుస్సుమంది. -
గొడవలు సృష్టిస్తే కఠిన చర్యలు
[ 10-05-2024]
‘జిల్లాలో జరిగే సార్వత్రిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, ప్రశాంతంగా నిర్వహించడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడా ఏ సమస్య తలెత్తకుండా వ్యూహాత్మక ప్రణాళికతో సిద్ధంగా ఉన్నాం.నెక్కడైనా గొడవలు సృష్టిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తాం. -
ఎడారి నివారణ ఎండమావే
[ 10-05-2024]
జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు, బెళగుప్ప మండలాల్లోని వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు రాజస్థాన్లోని థార్ ఎడారిని తలపిస్తున్నాయి. మొత్తం 4,700 ఎకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి. -
షరతులు పెట్టి.. రాయితీ ఎగ్గొట్టి..
[ 10-05-2024]
జగనన్న మైకు పట్టుకుంటే నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ మాట్లాడతాడు. అవన్నీ నీటి మీద రాతలే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉందేమోనని అందరూ భావించారు. -
జానెడు రోడ్డేయలేని ఎమ్మెల్యే అవసరమా?: సునీత
[ 10-05-2024]
వచ్చే ఎన్నికల్లో రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి పరాజయం తప్పదు. వైసీపీ నాయకులు తెదేపాలోకి కొనసాగుతున్న వలసలే ఓటమికి సంకేతమని మాజీ మంత్రి పరిటాల సునీత, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. -
ఫెసిలిటేషన్ కేంద్రం మూసివేత
[ 10-05-2024]
పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులంతా తెదేపాకే మొగ్గు చూపడంతో వైకాపా నాయకులు కుట్రలకు తెరలేపారని, గురువారం గడువు ఉన్నప్పటికీ ఫెసిలిటేషన్ కేంద్రం మూసేశారని అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైకాపాను ఓటుతో తరిమివేయాలి: కాలవ
[ 10-05-2024]
నవరత్నాల పేరుతో సామాన్య ప్రజలను నట్టేట ముంచి ఐదేళ్లపాటు నయవంచక పాలన సాగించిన జగన్ను ఓటుతో తరిమి వేయాలని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు పిలుపునిచ్చారు. -
చెరువు మట్టినే కాదు.. చేపలనూ వదలని నాయకులు
[ 10-05-2024]
దోచుకోవడానికి ఏదీ అనర్హం కాదన్నట్లుగా హిందూపురంలో అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారు. చెరువు మట్టిని లేఅవుట్లకు తోలుకొని సొమ్ము చేసుకున్న నాయకులు కొందరైతే, చెరువుల్లోని చేపలను అమ్ముకున్నది మరికొందరు. -
ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ
[ 10-05-2024]
పట్టణంలోని 11వ వార్డులో ఓటరు స్లిప్పుల మాటున నగదు పంపిణీ చేస్తున్న వైకాపా కార్యకర్తలకు స్థానికుల నుంచి ఊహించని రీతిలో తిరుగుబాటు ఎదురైంది. -
వేరే పార్టీకి ఓటేస్తే పథకాలు రావంటూ బెదిరింపు
[ 10-05-2024]
వేరే పార్టీకి ఓటు వేస్తే ఎలాంటి పథకాలు రావని ధర్మవరం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఓటర్లను బెదిరించేలా మాట్లాడారు. -
తెదేపాతోనే మీ భూములకు రక్షణ: నారా రోహిత్
[ 10-05-2024]
తెదేపా అధికారంలోకి వచ్చి నారాచంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మీ భూములకు గ్యారంటీ లభిస్తుందని సినీ హీరో నారా రోహిత్ అన్నారు. గురువారం రొళ్లలో నిర్వహించిన తెదేపా ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. -
దోచుకొని.. దాచుకోవడానికే వచ్చిన వలస పక్షులు
[ 10-05-2024]
కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచి వైకాపా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మ, బెంగళూరు/కళ్యాణదుర్గం నుంచి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉషశ్రీచరణ్ అనే వలస పక్షులు ఎన్నికల్లో డబ్బులు వెదజల్లి ఎలాగైనా గెలుపొంది ప్రకృతి వనరులను దోచుకొని.. -
డీఐజీగా షేముషి బాధ్యతల స్వీకరణ
[ 10-05-2024]
అనంతపురం రేంజ్ డీఐజీగా షేముషి బాజ్పేయి గురువారం అనంతపురం పోలీస్ హెడ్క్వార్టర్స్లోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. -
న్యూస్టుడే విలేకరి రమేష్పై దాడి హేయం
[ 10-05-2024]
ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో కళ్యాణదుర్గం బహిరంగసభలో న్యూస్టుడే విలేకరి రమేష్పై వైకాపా గూండాలు దాడి చేయడం అత్యంత బాధాకరమని... -
పెల్లుబుకిన ఆక్రోశం, అసంతృప్తి
[ 10-05-2024]
ఐదేళ్ల వైకాపా పాలనపై ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆక్రోశం పెల్లుబుకింది. జగన్ పాలనపై వ్యతిరేకత కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. నీ పాలన ఇక చాలంటూ పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో వారిలో కసి.. కోపం ప్రస్ఫుటమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!
-
ఐఫోన్లు తయారు చేయడం స్టీవ్జాబ్స్కు ఇష్టంలేదట!