logo

‘రెండేళ్లలో బీటీపీకి కృష్ణాజలాలు తీసుకొస్తాం’

అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు కాలువ పనులు పూర్తి చేసి బ్రహ్మసముద్రం మండలం, బీటీపీ జలాశయానికి గ్రావీటి ద్వారా కృష్ణా జలాలు తీసుకొస్తానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు.

Published : 28 Apr 2024 03:44 IST

ప్రజలకు అభివాదం చేస్తున్న అమిలినేని సురేంద్రబాబు

బ్రహ్మసముద్రం, న్యూస్‌టుడే: అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపు కాలువ పనులు పూర్తి చేసి బ్రహ్మసముద్రం మండలం, బీటీపీ జలాశయానికి గ్రావీటి ద్వారా కృష్ణా జలాలు తీసుకొస్తానని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. శనివారం మండలంలోని కుర్లగుండ, తీటకల్లు, యనకల్లు, రాయలప్పదొడ్డి, కన్నేపల్లి, ముద్దలాపురం, గుడిపల్లి, బుడిమేపల్లి, అజ్జయదొడ్డి, చెలిమేపల్లి, గోవిందయ్యదొడ్డి, వేపులపర్తి గ్రామాల్లో రోడ్‌షో నిర్వహించారు. మండల కన్వీనర్‌ శ్రీరాములు ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో పర్యటించారు. తెదేపా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆయనకు గజమాలలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సురేంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వానికి చరమగీతం పాడే సమయం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలో తెదేపా అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు మల్లికార్జున, మాజీ ఎంపీపీ మంజుల, వన్నూరస్వామి, మంజునాథ్‌, తిమ్మప్ప, శిరియన్న, రాజశేఖర్‌గౌడ్‌, చిత్తప్ప, సుభాన్‌, నాగరాజు, వెంకటేశులు, విరుపాక్షిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని