వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. దుర్గం వాసులకు కష్టం
వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి.
రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల నిర్మాణాల్లో జాప్యం
అనంతపురం మార్గంలో అర్ధాంతరంగా ఆగిన రైల్వే వంతెన అనుసంధాన రహదారి
రాయదుర్గం, న్యూస్టుడే: వైకాపా ప్రభుత్వం 50 శాతం మేర తన వాటా నిధులను మంజూరు చేయకపోవటంతో రాయదుర్గం పట్టణంలోని రెండు రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల పనులు ఆగిపోయాయి. ఆయా రైల్వేగేట్ల వద్ద కొన్నేళ్లుగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనంతపురం మార్గంలో నాలుగేళ్ల కిందట, కణేకల్లు రోడ్డులో మూడేళ్ల కిందట ట్రాక్లపై మాత్రమే రైల్వే వంతెనల నిర్మాణాలు పూర్తయ్యాయి.
50 శాతం నిధులకు రైల్వేశాఖ డిమాండు
రైల్వే శాఖలో ఎక్కడైనా పనులు చేపట్టాలంటే 50 శాతం వాటా కేంద్ర ప్రభుత్వం, 50 శాతం మేర రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. రైల్వే పరిధిలో వంతెనలను సుమారు రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించినందున, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం వాటా నిధులు ఇవ్వగానే అనుసంధాన రహదారులు నిర్మిస్తామని రైల్వేశాఖ చెబుతోంది. అనుసంధాన రహదారులకు అవసరమయ్యే స్థలాన్నిస్తున్నందున స్థలం విలువను అంచనా వేసి మిగిలిన మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నా.. ఆ ప్రక్రియ ముందుకు సాగటం లేదు. ఈ రెండు వంతెనల అనుసంధాన రహదారుల నిర్మాణానికి గతంలో రూ.60 కోట్లు అవసరం కాగా ఎస్ఎస్ఆర్ ధరల ప్రకారం ప్రస్తుతం రూ.77 కోట్ల మేర అంచనాలు పెరిగినట్లుగా అధికారులు చెబుతున్నారు.
తప్పని అవస్థలు..
కణేకల్లు రోడ్డుమార్గంలో రైల్వే గేటు స్టేషన్ సమీపంలో ఉండటంతో రైళ్లు నెమ్మదిగా వెళతాయి. రైళ్ల రాకపోకల సందర్భంగా వేసిన గేట్లు తీయటానికి కనీసం 15 నిమిషాల సమయం పడుతోందని, ఎదురెదురు వాహనాల రాకపోకల సందర్భంగా ఒక్కో మారు అరగంటకు పైగా సమయం పడుతోందని వాహనదారులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అత్యవసర సమయంలో కణేకల్లు రోడ్డును చుట్టేసి వెళ్లాల్సి వస్తోంది. ః అనంతపురం మార్గంలోని రైల్వే గేటు వైపు ప్రధాన వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. 108 వాహనాలు అత్యవసర సమయాల్లో జేఆర్ఎస్ కాలనీల్లోని అంతర్గత రైల్వే మార్గం ద్వారా ఒక కిలో మీటరు దూరం చుట్టేసి వెళ్లాల్సి వస్తోంది.
రోజూ 33 సార్లు ..
రెండు రైల్వే గేట్ల మార్గాల్లో రోజుకు 25 గూడ్సు, 6 రైళ్ళు రాకపోకలు సాగిస్తున్నాయి. నాలుగు వారాంతపు రైళ్లు రాయదుర్గం రైల్వే స్టేషన్ మీదుగా వెళుతున్నాయి. ఈ లెక్కన రోజుకు దాదాపు 33 మార్లు రైల్వే గేట్లు వేస్తూ, తీస్తున్నారు. ఉదయం సాయంత్రం వేళల్లో వాహనదారుల అవస్థలు ఎక్కువగా ఉంటాయి.
నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తారు
రైల్వే వంతెనల అనుసంధాన రహదారుల నిర్మాణాల కోసం తరుచుగా ప్రభుత్వం ద్వారా రైల్వేశాఖకు ప్రతిపాదనలు పంపుతున్నాం. నిర్మాణ వ్యయం రూ.60 కోట్ల నుంచి రూ.77 కోట్లకు పెరిగింది. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభిస్తారు.
రవిశంకర్రెడ్డి, డీఈ, ఆర్అండ్బీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తాడిపత్రి ఆర్వో కార్యాలయం వద్ద ఉద్రిక్తత
[ 26-04-2024]
అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్వో కార్యాలయంలో నామినేషన్ల పరిశీలన జరుగుతున్న గదిలోకి వైకాపా నాయకులు వెళ్లేందుకు ప్రయత్నించారు. -
మాట తప్పాడు.. మడత పెట్టాడు
[ 26-04-2024]
ఒకసారి మాట ఇస్తే.. ఆ మాట కోసం ఎంత దూరమైనా వెళ్లాలి అని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కబుర్లు చెప్పిన జగన్... అధికార పగ్గాలు చేపట్టాక ఇచ్చిన హామీలు ఏరోజూ గుర్తుకు రాలేదు. -
నిరుద్యోగుల ఆశలపై నీళ్లు
[ 26-04-2024]
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గుంతకల్లుతో పాటు వివిధ ప్రాంతాల్లోని హిందీ పండిట్ శిక్షణ కేంద్రాలను మూసేసింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి. -
ప్రతి చేనుకు నీరందిస్తాం..
[ 26-04-2024]
మాజీ మంత్రి పరిటాల సునీత నామినేషన్ కార్యక్రమం గురువారం అట్టహాసంగా సాగింది. -
కృష్ణా జలాలతో చెరువులు నింపుతా
[ 26-04-2024]
ఐదేళ్ల అధికారంలో ఉన్న వైకాపా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి చేసిందేమీలేదని, మంత్రి ఉష, ఎంపీ రంగయ్య రెండు వర్గాలుగా విడిపోయి నాశనం చేశారని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ధ్వజమెత్తారు. -
సైకో పోవాలి.. సైకిల్ గెలవాలి
[ 26-04-2024]
తెదేపా అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ నామినేషన్ ఘట్టానికి తెలుగు సైన్యం కదలివచ్చింది. -
ఉరవకొండలో దాహం కేకలు
[ 26-04-2024]
జగన్ ప్రభుత్వంలో వరుస నాలుగేళ్లుగా ఉరవకొండలో తాగునీటి సమస్య కొనసాగుతోంది. -
గోసంరక్షణ పట్టని జగన్
[ 26-04-2024]
ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు దైవానుగ్రహానికి గోదానం, గోసంరక్షణకు విరాళం ఇస్తున్నారు. -
రోడ్లు, వంతెనలు శిథిలం..కళ్లకు కనిపిస్తున్నా కదలం!
[ 26-04-2024]
ఏ రాష్ట్ర ప్రగతి అయినా రోడ్లను చూస్తేనే అర్థం అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల స్థితిగతులు జగన్ పాలనను వేలెత్తి చూపుతున్నాయి. -
సుక్క వెయ్.. చిందెయ్!
[ 26-04-2024]
రాయదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే వైకాపా అభ్యర్థి మెట్టు గోవిందరెడ్డి నామినేషన్ ర్యాలీకి జన సమీకరణకు ఆ పార్టీ నాయకులు అష్టకష్టాలు పడ్డారు. -
జేఈఈ మెయిన్స్లో విద్యార్థుల ప్రతిభ
[ 26-04-2024]
జేఈఈ మెయిన్స్లో అనంత విద్యార్థులు ప్రతిభ చాటుకున్నారు. -
జగనన్నా.. మహిళా సంక్షేమం ఎక్కడా?
[ 26-04-2024]
నా చెల్లి, నా అక్క అంటూ వేదికలెక్కి హామీలిస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమాన్ని మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
అరాచక శక్తులకు అండగా నిలుస్తారా?
[ 26-04-2024]
అసమర్థులు, అరచాక శక్తులకు అండగా నిలుస్తారా? అభివృద్ధి చేసేవారికి అండగా నిలుస్తారా? అంటూ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రజలను ప్రశ్నించారు. -
ముగిసిన నామినేషన్ల దాఖలు ప్రక్రియ
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం ముగిసింది. వారం రోజుల కోలాహలానికి తెర పడింది. -
వైకాపాను ఓడించాలి: మాదిగ సంఘాల ఐక్యవేదిక
[ 26-04-2024]
మాదిగలను మోసం చేసిన సీఎం జగన్ను ఓడించేందుకు కూటమికి మద్దతుగా నిలుస్తున్నట్లు ఆ సంఘాల ఐక్య వేదిక ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య