కరెంటు బిల్లు చూస్తేనే షాక్!
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు.
జగన్ పాలనలో బాదుడే బాదుడు
అనంతపురం (విద్యుత్తు), న్యూస్టుడే
విద్యుత్తు బిల్లులను చూసి వినియోగదారులు జడుసుకుంటున్నారు. దొడ్డిదారిన వైకాపా ప్రభుత్వం అదనపు భారం మోపడంపై మండిపడుతున్నారు. ఛార్జీలను పెంచబోమంటూ ఓట్లు వేయించుకున్న జగన్ నడ్డివిరిచారని వాపోతున్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులపై ఇంధన సర్దుబాటు, ట్రూఅఫ్, ఈడీ (ఎలక్ట్రిసిటీ డ్యూటీ) పేరిట సుమారు రూ.475 కోట్ల భారం మోపి వసూలు చేశారు. ఉమ్మడి జిల్లాలో గృహ కనెక్షన్లు 12 లక్షలు ఉన్నాయి. సర్దుబాటు, ట్రూఅప్, ఈడీ పేరిట అదనంగా కలిపి విడతల వారీగా యూనిట్కు కొంత మొత్తం నిర్ణయించి ఆ మేరకు బిల్లుల్లో కలిపారు.
ఆరు పైసలు నుంచి రూపాయి
తెదేపా ప్రభుత్వ హయంలో గృహ, వాణిజ్య, పరిశ్రమల సర్వీసులకు ఈడీ కింద యూనిట్కు రూ.6 పైసలు వసూలు చేసేవారు. ఈ మొత్తం ప్రభుత్వానికే వెళుతుంది. వైకాపా సర్కారు వచ్చాక గృహ సర్వీసులకు రూ.6 పైసలు అట్లాగే ఉంచినా.. వాణిజ్య, పరిశ్రమల సర్వీసులు వినియోగించిన యూనిట్కు ఒక రూపాయి చేసింది. ఇలా పెంచినప్పటి నుంచి సదరు సర్వీసులకు రూ.65 కోట్లు అదనపు భారం మోపింది.
ఫిక్స్డ్ ఛార్జీలు అంటూ...
తెదేపా ప్రభుత్వ హయంలో గృహ సర్వీసులకు ఫిక్స్డ్ ఛార్జీలు ఉండేవి కావు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత గృహ సర్వీసులకు సంబంధించి కిలోవాట్కు రూ.10 ఫిక్స్డ్ ఛార్జీ నిర్ణయించి వసూలు చేస్తున్నారు. సాధారణంగా గృహ కనెక్షన్కు ఐదు కిలోవాట్ల లోడ్ తీసుకుంటారు. అంటే సగటున ఫిక్స్డ్ ఛార్జీల రూపేణా అదనంగా రూ.50 చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటి వరకు రూ.10 కోట్లుపైగా వినియోగదారుల నుంచి విద్యుత్తు శాఖ వసూలు చేసింది.
- అనంతపురం మూడో రోడ్డులో ఉన్న గృహ విద్యుత్తు కనెక్షన్దారు హరినాథ్ ఈఏడాది ఫిబ్రవరిలో 140 యూనిట్లు వినియోగించగా రూ.662 బిల్లు వచ్చింది. ఇదే సర్వీసుకు ఇంచుమించు అవే యూనిట్లకు సంబంధించి మార్చిలో రూ.832 బిల్లు వచ్చింది. ఈలెక్కన సదరు వినియోగదారుకు అదనంగా రూ.250 భారం పడింది.
- రాప్తాడు మండలం ఆకుతోటపల్లిలో వాణిజ్య కనెక్షన్దారు ఆదినారాయణ ఫిబ్రవరిలో 2,778 యూనిట్లు వినియోగించగా రూ.30,715 బిల్లు వచ్చింది. అటుఇటుగా యూనిట్లు మార్చిలో రాగా రూ.34,608 బిల్లు వచ్చింది. దీంతో రూ.4 వేలు అదనంగా చెల్లించారు.
వీరే కాదు.. ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా లక్షలాది వినియోగదారులది ఇదే పరిస్థితి.
తెదేపా హయాంలో ఇష్టారాజ్యంగా విద్యుత్తు ఛార్జీలు పెంచేశారు.. బాదుడే బాదుడే అంటూ దీర్ఘాలు తీశారు జగన్. అధికార పగ్గాలు చేపడితే ఛార్జీలు తగ్గిస్తామని ప్రతిపక్ష నాయకుడి హోదాలో పలుమార్లు హామీ ఇచ్చారు. తీరా గద్దె నెక్కాక హామీని తుంగలోకి తొక్కి.. దొడ్డిదారిన బిల్లులు అమాంతం పెంచేసి అదనపు భారం మోపారు. సర్దుబాటు పేరిట వినియోగదారులు షాక్ తినేలా చేశారు. గృహ కనెక్షన్లకు సంబంధించి చాలా మంది వినియోగదారులు బిల్లులు కట్టలేక నానా అవస్థలు పడుతున్నారు.మాట తప్పను.. మడమతిప్పను అంటూ జగన్ చెప్పిన మాటలు నీటిమూటలే... నమ్మి మోసపోయాం అని ఆవేదన చెందుతున్నారు.
రెట్టింపు ఛార్జీలు
ఉరవకొండ: పట్టణానికి చెందిన తిరుపతయ్య వృత్తి రీత్యా రజకుడు. దుస్తులు ఇస్త్రీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. బొగ్గుల ధరలు విపరీతంగా పెరగడంతో విద్యుత్తుతోనే ఇస్త్రీ చేస్తున్నారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఇతనికి నెలకు రూ.600 విద్యుత్తు బిల్లు వచ్చేది. ఇప్పుడు అది రూ.1200 దాటుతోంది. గతంలోనూ విద్యుత్తు ఆధారంగా ఇస్త్రీ చేస్తూ వచ్చారు. రోజంతా కష్టపడితే రూ.500 వస్తుంది. దీనికితోడు విద్యుత్తు బిల్లు అధికంగా వస్తుండడంతో మరింత ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా విద్యుత్తు ఛార్జీలను ప్రభుత్వం పెంచడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉందని వాపోతున్నారు.
భారంగా జీవనం
పామిడి: పామిడికి చెందిన లలిత కుట్టు మిషన్పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. భర్త భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేసేవారు. కొంతకాలంగా పనులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దుస్తులు కుట్టగా వచ్చే రూ.3 వేల ఆదాయంతో ఇద్దరు పిల్లలను పోషిస్తున్నారు. గతంలో రూ.300 విద్యుత్తు బిల్లు రాగా.. ప్రస్తుతం రూ.600 వస్తోంది. నిత్యావసర సరకుల ధరలు పెరగడంతో నెల గడవటం కష్టంగా మారిందని లలిత చెబుతున్నారు. విద్యుత్తు బిల్లును సమయానికి చెల్లించకపోతే ఉన్నఫళంగా సరఫరా తీసేస్తున్నారని వాపోతున్నారు.
చేసిన కష్టం కరెంటు బిల్లుకే
శింగనమల, గార్లదిన్నె: గార్లదిన్నెకు చెందిన సుబ్బు బస్టాండ్ సమీపంలో ఇరవై ఏళ్లుగా పంక్చర్ దుకాణం నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. నెల సంపాదన దాదాపు రూ.8 వేలు. ఇందులో కరెంటు బిల్లు రూ.1500 చెల్లించాలి. మిగిలిన రూ.6,500లతో ఇద్దరు పిల్లలు, భార్యను పోషించాలి. గతంలో రూ.400 విద్యుత్తు బిల్లు వచ్చేది. మండల కేంద్రానికి పరిసర గ్రామాలవారు వచ్చేవారు. ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లకు పంక్చర్, గాలి వంటి వాటితో దాదాపు రూ.15 వేలు వచ్చేది. గ్రామాలవారు రాకపోవడంతోపాటు ఆదాయం తగ్గింది. పెరిగిన విద్యుత్తు బిల్లు కుటుంబ పోషణకు అడ్డుగా మారింది. చేసిన కష్టం కరెంటు బిల్లుకే సరిపోతోందని సుబ్బు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాలుగున్నరేళ్లలో ఉమ్మడి అనంతపురం జిల్లాపై మోపిన అదనపు భారం: రూ.475 కోట్లు
ఉమ్మడి అనంత జిల్లాలో విద్యుత్తు సర్వీసులు ఇలా..
గృహ కనెక్షన్లు: 12 లక్షలు
వాణిజ్య : 1.10 లక్షలు
చిన్న, మధ్యతరహా
పరిశ్రమలు: 25,000
భారీ పరిశ్రమలు: 600
తాగునీటి పథకాలు, విద్యాసంస్థలు, మున్సిపాలిటీలు: 35,000
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దోపిడీ విలువ రూ.4,080 కోట్లు
[ 02-05-2024]
దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తానని 2019 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చాక మోసం చేశారు. కొత్త విధానం పేరుతో ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచారు. బార్లు బార్లా తెరిచి విక్రయాలు కొనసాగిస్తున్నారు. -
ఇస్తే సులభం.. కుట్ర చేస్తే కష్టం
[ 02-05-2024]
ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయడం సులభం కాదని ప్రభుత్వ పెద్దలు, ఉన్నతాధికారులు వల్లె వేసిన మాటలు బూటకమని తేలింది. బ్యాంకు ఖాతాలు లేని 1.13 లక్షల మందికి తొలిరోజే ఇంటివద్దకు వెళ్లి పింఛను సొమ్ము అందజేయడమే ఇందుకు నిదర్శనం. -
ఈవీఎంలపై అపోహలు వద్దు
[ 02-05-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం) పనితీరుపై ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దు. పక్కా సాఫ్ట్వేర్తో తయారు చేసినట్లు కలెక్టర్/జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్కుమార్, ఎన్నికల పరిశీలకులు అజయ్నాథ్ ఝు, మనీష్ సింగ్ తెలిపారు. -
కానుకలు ఎత్తివేత.. సరకుల్లో కోత
[ 02-05-2024]
తెదేపా ప్రభుత్వ హయాంలో పండగలు వస్తే పేదలంతా పిండివంటకాలతో సంతోషంగా గడిపేవారు. ఏటా సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్కు కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఏటా క్రమం తప్పకుండా తెదేపా సర్కారు అందించింది. -
కొండను కొల్లగొట్టారు
[ 02-05-2024]
పామిడి మండలంలోని వంకరాజుకాలువ, నెమళ్లపల్లి గ్రామ కొండల్లో నుంచి ఎర్రమట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. తాత్కాలిక అనుమతి పత్రాలు ఉన్నాయంటూ వైకాపా నాయకులు రెచ్చిపోతున్నారు. రోజూ ఇరవై టిప్పర్ల వరకు మట్టిని తరలిస్తున్నారు. -
అధికార పక్షానికి పోలీసులు దాసోహం
[ 02-05-2024]
ఎన్నికల సమయంలో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీ సేవలో తరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో తెదేపా అభ్యర్థులు, కార్యకర్తలపై వైకాపా శ్రేణులు దాడులకు తెగపడుతున్నా కళ్లప్పగించి చూస్తున్నారు. దాడులపై ఫిర్యాదులు కూడా తీసుకోవడం లేదు. -
ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి ఓటమి భయం : సునీత
[ 02-05-2024]
రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి ఆయన సోదరులతో సొంత పార్టీ నాయకులనే బెదిరింపులు, వేధింపులతో ఇబ్బందులు పెడుతున్నారని, నియోజకవర్గంలో చాలాచోట్ల వైకాపా నాయకులు, కార్యకర్తలు తెదేపాలో చేరడంతో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేకు ఓటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. -
తెదేపాతోనే మహిళల సంక్షేమం
[ 02-05-2024]
మహిళలు అభివృద్ధి పథాన నడవాలన్నా, వారు సంక్షేమాన్ని సమర్థంగా అందుకోవాలన్నా తెదేపాతోనే సాధ్యం అవుతుందని ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. -
వైకాపా అరాచక పాలనను సాగనంపుదాం
[ 02-05-2024]
అవినీతి, అరాచక పాలన సాగిస్తున్న వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపుదామని కళ్యాణదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి పిలుపునిచ్చారు. -
ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుదాం
[ 02-05-2024]
వైకాపా అవినీతి, అక్రమాల పాలనకు అంతం పలకాలని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని కెంచానపల్లి, జుంజురాంపల్లి, బీఎన్హళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. -
వైకాపా ప్రచారానికి వెళ్తున్న కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
[ 02-05-2024]
వైకాపా ప్రచారానికి వెళ్తున్న ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై రామ్భూపాల్ వివరాల మేరకు.. శెట్టూరు మండలం కనుకూరుకు చెందిన ఓబన్న, భార్య నాగమణి, కోడలు అనురాధ ద్విచక్ర వాహనంలో కళ్యాణదుర్గం వెళుతున్నారు. -
అనంతలో తెదేపా నాయకుడి అరెస్టు
[ 02-05-2024]
అనంతపురం గ్రామీణం రామకృష్ణ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ, తెదేపా నాయకుడు జయరాం నాయుడి అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టి నగేశ్పై దాడి చేయించాడనే కారణంతో వన్టౌన్ పోలీసులు బుధవారం తెల్లవారు జామున జయరాం నాయుడిని అరెస్టు చేశారు. -
తెదేపా అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ
[ 02-05-2024]
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటేనే మహిళలకు రక్షణ ఉంటుందని ఎమ్మెల్యే బాలకృష్ణ సతీమణీ వసుంధర అన్నారు. నేడు ఎక్కడ చూసినా మహిళలపై దౌర్జన్యాలు, మెడలో గొలుసుల చోరీలు, వేధింపులు పెరిగి మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. -
‘ముస్లింల నమ్మకద్రోహి జగన్’
[ 02-05-2024]
రాష్ట్రంలో ముస్లిం, మైనారిటీలకు నమ్మించి మోసం చేసిన ఘనత జగన్దేనని శాసనమండలి మాజీ ఛైర్మన్, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు షరీఫ్ ఆరోపించారు. బుధవారం నగరం అనంత కన్వెన్షన్ హాలులో ముస్లిం, మైనారిటీలకు ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి