ధర్మవరంలో కూటమి సందడి
భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది.
అట్టహాసంగా భాజపా అభ్యర్థి నామినేషన్
నామినేషన్ వేసేందుకు తెదేపా, భాజాపా, జనసేన శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళుతున్న సత్యకుమార్, పరిటాల శ్రీరామ్, సాయికుమర్, మధుసూదన్రెడ్డి తదితరులు
ధర్మవరం, ధర్మవరం పట్టణం: భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ నామినేషన్ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. ముందుగా సత్యకుమార్ శివానగర్లోని శివాలయంలో కుటుంబ సభ్యులు, తెదేపా ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్, భాజపా నాయకులు, సినీ నటుడు సాయికుమార్, జనసేన రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్తో కలిసి పూజలు చేశారు. అనంతరం ఓపెన్ టాప్ జీపులో వేలాది మంది కార్యకర్తలతో కలిసి ప్రదర్శనగా వెళ్లారు. ధర్మవరం ఆర్డీఓ కార్యలయం సమీపంలోకి ప్రదర్శన రాగానే కేంద్ర మంత్రి వి.కె.సింగ్ ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి చేరుకున్నారు. కేంద్ర మంత్రికి నాయకులు స్వాగతం పలికారు. ఎన్నికల అధికారులకు పత్రాలు సమర్పించిన నాయకులకు పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్లో కార్యకర్తలు గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి విజయ్కుమార్, భాజపా నాయకులు గిర్రాజు నగేశ్, నాయకులు సంధా రాఘవ, కమతం కాటమయ్య, పరిశే సుధాకర్, ఎంపీపీ ఆదినారాయణయాదవ్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా ప్రజాప్రతినిధుల అనుచరులే.. అసురలై
[ 06-05-2024]
నిత్యం మూడు కబ్జాలు, ఆరు ఆక్రమణలతో వైకాపా ప్రజాప్రతినిధులు అవినీతి చక్రవర్తుల్లా మారిపోయారు. మేం తక్కువ తిన్నాం అంటూ వారి అనుచరులు మండలాల్లో అరాచకాలకు పాల్పడుతూ సామంతరాజుల్లా వ్యవహరిస్తున్నారు. -
ఉద్యోగులకు ప్రలోభాల ఎర
[ 06-05-2024]
జిల్లా సచివాలయం, న్యూస్టుడే: ఉద్యోగ, ఉపాధ్యాయ ఓట్లను కొనడానికి వైకాపా బరి తెగించింది. ఓటుకు రూ.5 వేలు ఇస్తామంటూ ప్రలోభాలకు తెరలేపింది. అక్కడ, ఇక్కడ కాదు.. ఏకంగా పోలింగ్ కేంద్రాల (ఫెసిలిటేషన్) వద్దే వైకాపా శ్రేణులు బేరసారాలకు ఒడిగట్టారు. -
ఎన్నికల ముందు హామీలు.. ఆనక నామాలు
[ 06-05-2024]
-
డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అనంత అభివృద్ధి
[ 06-05-2024]
వచ్చే ఎన్నికల్లో అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని కేంద్ర మంత్రి అమిత్షా, తెదేపా అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కారుతో అనంతపురం అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామన్నారు. -
గొడవలపై ఉక్కుపాదం మోపండి
[ 06-05-2024]
‘ఎన్నికల నిర్వహణను సవాల్గా తీసుకోవాలి. ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా సాగాలంటే.. గొడవలు, రౌడీలపై ఉక్కుపాదం మోపాలి. శాంతిభద్రల పరిరక్షణే లక్ష్యంగా పని చేయాలి’ అని ఎన్నికల ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్మిశ్రా పేర్కొన్నారు. -
తెదేపా హయాంలో ఏర్పాటు.. వైకాపా పాలనలో గ్రహపాటు
[ 06-05-2024]
సమూల మార్పులతో విద్యాభివృద్ధికి బాటలు వేశామని గొప్పలు చెబుతున్న వైకాపా ప్రభుత్వం గురుకులాలను పూర్తిగా విస్మరించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. -
వైకాపా వ్యతిరేక ఓటును ఆపేందుకు ప్రయత్నం
[ 06-05-2024]
ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడంలో జిల్లా వ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏ ఉద్యోగి ఎక్కడ ఓటు వినియోగించుకోవాలో.. స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. -
ఫాం-12 ఇచ్చాం.. మా పేర్లు ఏమయ్యాయి
[ 06-05-2024]
‘ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారమే ఫాం-12 సకాలంలో ఇచ్చాం. మేము పని చేసే చోటే ఆర్ఓలకు సమర్పించాం. ఇపుడు ఓటు వేసేందుకు వస్తే.. పేర్లు లేవంటారు. -
గుంతకల్లు భగభగ
[ 06-05-2024]
ఉమ్మడి జిల్లాలో ఆదివారం గుంతకల్లులో అత్యధికంగా 44.0 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు సహదేవరెడ్డి, నారాయణస్వామి తెలిపారు.