logo

ధర్మవరంలో కూటమి సందడి

భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌ నామినేషన్‌ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది.

Published : 24 Apr 2024 04:59 IST

అట్టహాసంగా భాజపా అభ్యర్థి నామినేషన్‌

నామినేషన్‌ వేసేందుకు తెదేపా, భాజాపా, జనసేన శ్రేణులతో కలిసి ర్యాలీగా వెళుతున్న సత్యకుమార్‌, పరిటాల శ్రీరామ్‌, సాయికుమర్‌, మధుసూదన్‌రెడ్డి తదితరులు

ధర్మవరం, ధర్మవరం పట్టణం: భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్‌ నామినేషన్‌ కార్యక్రమం మంగళవారం అట్టహాసంగా సాగింది. తెదేపా, భాజపా, జనసేన కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరు కావడంతో పట్టణం కాషాయం, పసుపుమయంగా మారిపోయింది. ముందుగా సత్యకుమార్‌ శివానగర్‌లోని శివాలయంలో కుటుంబ సభ్యులు, తెదేపా ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్‌,  భాజపా నాయకులు, సినీ నటుడు సాయికుమార్‌, జనసేన రాష్ట్ర కార్యదర్శి మధుసూదన్‌తో కలిసి పూజలు చేశారు. అనంతరం ఓపెన్‌ టాప్‌ జీపులో వేలాది మంది కార్యకర్తలతో కలిసి ప్రదర్శనగా వెళ్లారు. ధర్మవరం ఆర్‌డీఓ కార్యలయం సమీపంలోకి ప్రదర్శన రాగానే కేంద్ర మంత్రి వి.కె.సింగ్‌ ప్రత్యేక హెలికాప్టర్‌లో అక్కడికి చేరుకున్నారు. కేంద్ర మంత్రికి నాయకులు స్వాగతం పలికారు. ఎన్నికల అధికారులకు పత్రాలు సమర్పించిన నాయకులకు పట్టణంలోని కళాజ్యోతి సర్కిల్‌లో కార్యకర్తలు గజమాలతో సన్మానించారు.  కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి విజయ్‌కుమార్‌, భాజపా నాయకులు గిర్రాజు నగేశ్‌, నాయకులు సంధా రాఘవ, కమతం కాటమయ్య, పరిశే సుధాకర్‌, ఎంపీపీ ఆదినారాయణయాదవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని