షరతులు పెట్టి.. రాయితీ ఎగ్గొట్టి..
జగనన్న మైకు పట్టుకుంటే నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ మాట్లాడతాడు. అవన్నీ నీటి మీద రాతలే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉందేమోనని అందరూ భావించారు.
ఎస్సీ కాలనీల్లో నివాసం ఉంటేనే విద్యుత్తు రాయితీ అంటూ మెలిక
పేరుకే నా.. నా.. అంటూ జగన్ ప్రకటనలు
క్షేత్రస్థాయిలో ఉచిత సర్వీసుల తొలగింపు
- అనంతపురంలోని డీ-5 సెక్షన్ కార్యాలయం పరిధిలో ఉన్న ఒక కాలనీలో ఓ దళితుడు నివాసం ఉంటున్నాడు. అతడి ఇంటి సర్వీసుకు కొన్ని నెలలపాటు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును అమలు చేశారు. నాలుగు నెలల క్రితం విద్యుత్తు అధికారులు సదరు ఎస్సీ నివాస సర్వీసులు ఎస్సీ కాలనీలో లేదని ఇతర ప్రాంతంలో ఉంటూ ఉచిత విద్యుత్తు వాడినట్లు గుర్తించి సర్వీసు తొలగించారు. అప్పటినుంచి సదరు వ్యక్తి ప్రతి నెలా రూ.350 నుంచి రూ.400 వరకు విద్యుత్తుశాఖకు బిల్లు కడుతున్నాడు.
- కదిరి రూరల్ పరిధిలో గిరిజనుడు నివాసం ఉంటున్నాడు. అతడి నివాసం ఉంటున్న ఇంటి సర్వీసుకు ఆరు నెలల వరకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇచ్చారు. విద్యుత్తు అధికారులు సదరు వ్యక్తి ఎస్టీ కాలనీలో లేకుండా వేరే కాలనీలో ఉంటూ ఉచిత విద్యుత్తు వాడుతున్నట్లు అధికారులు గుర్తించి సర్వీసుకు ఉచిత విద్యుత్తును రద్దు చేశారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ప్రతి నెలా తన ఇంటికి 200 యూనిట్లులోపే విద్యుత్తు వాడుతున్నా ఎస్టీ కాలనీలో లేనందుకు విద్యుత్తు బిల్లు కడుతున్నాడు.
అనంతపురం (విద్యుత్తు), న్యూస్టుడే: జగనన్న మైకు పట్టుకుంటే నా ఎస్సీ, నా ఎస్టీలు అంటూ మాట్లాడతాడు. అవన్నీ నీటి మీద రాతలే. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపట్ల చిత్తశుద్ధి ఉందేమోనని అందరూ భావించారు. తాను అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల విద్యుత్తు సర్వీసులకు నెలకు 200 యూనిట్లు వరకూ ఉచితంగా సరఫరా ఇస్తానని జగన్ ప్రకటించారు. ఆయన మాటలు నమ్మి వారంతా ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చాక జగనన్న తన మార్కు రాజకీయానికి తెర లేపారు. ఉచిత కరెంటు వినియోగించుకోవాలంటే ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివాసాలుండాలి. అప్పుడే ఉచిత విద్యుత్తు అమలవుతుందని మెలిక పెట్టాడు. దీంతోపాటు అనేక షరతులు విధించారు. ఆ కాలనీల్లో ఉండేవారికి తప్ప మిగిలిన వారికి ఉచిత కరెంటు సరఫరా అమలు కాలేదు. ఈ విద్యుత్తు పొందాలంటే ఎస్సీ కాలనీలోనే ఉండాలా.. ఇది కులవివక్షకు అవకాశం ఇవ్వడం కాదా? అని ఆయా వర్గాలు వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఉచిత విద్యుత్తు సర్వీసులు..
ఈ ఏడాదిలో మార్చి నుంచి ఉమ్మడి అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలో 1,28,814 ఎస్సీ విద్యుత్తు సర్వీసులుండగా ఇందులో 1,04,156 సర్వీసులు నెలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తును వినియోగించారు. అలాగే 36,190 ఎస్టీ విద్యుత్తు సర్వీసులుండగా ఇందులో మార్చి నెలలో 26,361 సర్వీసులు నెలకు 200 యూనిట్లు రాయితీ పొందారు.
తొలగించినవి ఇలా..
అనంతపురంలో 5,136, కదిరి 1,538, పెనుకొండ 619, పుట్టపర్తి 163, కదిరి 400, మడకశిర 210తో పాటు ఉమ్మడి జిల్లాల్లోని పలు పట్టణ, మండల కేంద్రాల్లో ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో నివాసాలుంటూ నెలకు 200 యూనిట్లు విద్యుత్తు రాయితీ పొందుతున్న రమారమి 14 వేల ఎస్సీ, ఎస్టీల సర్వీసులకు రాయితీ అమలు నిలిపివేశారు. ఇతర ప్రాంతాల్లో ఉండి ఉచితంగా కరెంటు యూనిట్లు వాడిన వారి వివరాలను గుర్తించి సదరు ఎస్సీ, ఎస్టీలు ఎన్ని నెలల కరెంటు సరఫరా వాడారో పరిశీలించి ఆ మొత్తాలను విద్యుత్తు అధికారులు తిరిగి వెనక్కి వసూళ్లు చేశారు.
14 వేల సర్వీసులు..
ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో ఉన్న 14 వేల మంది ఎస్సీ, ఎస్టీల నివాసాలకు రాయితీ విద్యుత్తు సరఫరాను నిబంధనల పేరుతో నిలిపివేశారు. వీరి సర్వీసులకు కొన్ని నెలల పాటు రాయితీ సరఫరా ఇచ్చినప్పటికీ తరువాత ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో నివాసం ఉండకుండా ఇతర ప్రాంతాల్లో నివాసాలుంటూ రాయితీ విద్యుత్తును పొందుతున్నారని విద్యుత్తు అధికారులు గుర్తించారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో ఉండే వారికి మాత్రమే రాయితీ విద్యుత్తు సరఫరా ఇస్తూ మిగిలిన ప్రాంతాల్లో ఉండేవారందరి నివాసాలకు రాయితీ కరెంటు సరఫరా నిలిపివేశారు. మిగిలిన వారంతా తమ సొంత డబ్బులు విద్యుత్తు బిల్లులు లకడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిరప రైతుపై శీతకన్ను
[ 20-05-2024]
మిరప రైతుకు తీరని నష్టం ఏర్పడింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేని కారణంగా వారికి కలిగిన నష్టం అపారం. కానీ, ప్రభుత్వం మిరప రైతులకు పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
కాలువల నిండా పూడిక.. సాగు సాగేదెలా ఏలిక?
[ 20-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో చెరువుల కట్టలు బలహీనంగా మారాయి. తూములు దెబ్బతిని మొరాయిస్తున్నాయి. కాలువలు పూడిక, ముళ్లపొదలతో నిండిపోయాయి. చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి లేదు. -
కష్టాలు కనవయ్యా.. వీరభద్రా!
[ 20-05-2024]
లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేఓణలో నిర్లక్ష్యం అణువణువునా కనపడుతుంది. -
పతకం కల.. దక్కించుకునే పట్టుదల
[ 20-05-2024]
ఆ బాలుడు ఆరో తరగతిలో లాన్ టెన్నిస్ రాకెట్ పట్టాడు. మూడేళ్ల పాటు టెన్నిస్లో పెద్దగా విజయాలు సాధించలేదు. నాలుగేళ్ల క్రితం లాన్ టెన్నిస్ నుంచి సాఫ్ట్ టెన్నిస్లో అడుగుపెట్టాడు. గేమ్ మొత్తం లాన్ టెన్నిస్ మాదిరిగానే ఉంటుంది. -
నేటి నుంచి పెన్నహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 20-05-2024]
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. -
కౌంటింగ్కు మూడంచెల భద్రత
[ 20-05-2024]
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. ఆమె ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పీ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
సిట్ దర్యాప్తుపై తొలగని ఉత్కంఠ
[ 20-05-2024]
తాడిపత్రిలో ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై సిట్ అధికారుల బృందం చేపట్టిన విచారణ ఆదివారం రెండో రోజూ కొనసాగింది. అత్యంత గోప్యంగా విచారణ సాగింది. మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. -
ఎస్కేయూలో హాస్టళ్ల మూసివేతపై రగడ
[ 20-05-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో నాన్బోర్డర్ల బెడదతో వివాదం నెలకొంది. వేసవి సెలవుల్లో కూడా మహానంది వసతి గృహం తెరచి ఉంచాలని విద్యార్థులు పట్టుపడుతున్నారు. -
కొడవలితో వైకాపా కార్యకర్త వీరంగం
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు కాకుండానే ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి గ్రామాల్లో వైకాపా నాయకులు వ్యూహం పన్నుతున్నారు. -
జాతీయస్థాయిలో అనంతకు ఖ్యాతి
[ 20-05-2024]
మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి వేడుకలను ఏకే నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
విద్యుదాఘాతానికి యువతి బలి
[ 20-05-2024]
విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని విరుపాపల్లికి చెందిన చైతన్య(22) సోమవారం ఉదయం ఇంటి దగ్గర విద్యుత్తు మోటారును ఆన్ చేయడానికి ప్రయత్నించింది. -
టిప్పరు, ద్విచక్ర వాహనం ఢీ
[ 20-05-2024]
ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. -
పనితీరు మార్చుకోకపోతే చర్యలు
[ 20-05-2024]
ఉపకారాగారంలో ఉంటున్న కొంత మంది నిందితులకు గుర్తింపుకార్డులు ఇవ్వక, కారాగారానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఉపకారాగారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ