ఎడారి నివారణ ఎండమావే
జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు, బెళగుప్ప మండలాల్లోని వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు రాజస్థాన్లోని థార్ ఎడారిని తలపిస్తున్నాయి. మొత్తం 4,700 ఎకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి.
ఐదేళ్లలో ఒక్క రూపాయీ ఇవ్వని జగన్ సర్కారు
ఇసుక మేటలతో రైతులకు తీవ్ర ఇబ్బందులు
బొమ్మనహాళ్, కణేకల్లు, న్యూస్టుడే: జిల్లాలోని బొమ్మనహాళ్, కణేకల్లు, బెళగుప్ప మండలాల్లోని వేదవతి హగరి పరివాహక ప్రాంతాల్లో ఇసుక దిబ్బలు రాజస్థాన్లోని థార్ ఎడారిని తలపిస్తున్నాయి. మొత్తం 4,700 ఎకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి. దర్గాహొన్నూరు, గోవిందవాడ, కల్హోళ, బొల్లనగుడ్డం, బిదురుకుంతంŸ, నాగేపల్లి, తుంబిగనూరు, మాల్యం, కళ్లేకుర్తి, మీనహళ్లి, బెళుగుప్ప మండలంలోని శ్రీరాంపురం గ్రామాల్లో వేదవతి హగరిలోని సున్నితమైన ఇసుక కొట్టుకువచ్చి దిబ్బలుగా ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారి ఎడారి నివారణ పథకాన్ని తెదేపా ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగానే నిధులు మంజూరు చేసి నివారణ చర్యలు చేపట్టింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఒక్క రూపాయి మంజూరు చేయలేదు. దాంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
తెదేపా హయాంలో రూ.300 కోట్ల కేటాయింపు
బొమ్మనహాళ్, కణేకల్లు మండలాల్లో ఇసుక మేటలను అరికట్టడానికి, సున్నితమైన ఇసుకను చౌడు భూములకు తరలించి సారవంతమైన భూములుగా మార్చేందుకు గత తెదేపా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేదవతి హగరి నదిని జీవనదిగా మార్చేందుకు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు శాస్త్రవేత్తలు, జిల్లా కలెక్టర్, ఉద్యాన, వ్యవసాయశాఖ అధికారులతో ప్రత్యేక సమావేశంను నిర్వహించి చర్చించారు. ఈ మేరకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.300 కోట్లు కేటాయించారు. ఆ నిధులతో ఉచితంగా బోర్లు వేయించారు. డ్రిప్ సౌకర్యం కల్పించారు. ఇసుకను చౌడు భూములకు తరలించారు. దర్గాహొన్నూరు, మాల్యం, గరుడచేడు, గోవిందవాడ, బొల్లనగుడ్డం తదితర గ్రామాల్లో ఇసుక దిబ్బల్లో ఉచితంగా బోర్లు వేయించి పండ్ల మొక్కలు సాగు చేయించారు. బొల్లనగుడ్డం గ్రామంలో నాటి రకం రేగు చెట్లకు హైబ్రిడ్ మొక్కలతో అంటు కట్టి ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఇది సత్ఫలితాన్నిచ్చింది. వేరుసెనగ మొలకపై ఇసుక కొట్టుకుని రాకుండా పొలం చుట్టు సుబాబుల్ మొక్కలు పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఏడారి నివారణ పథకాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఒక్క రూపాయి నిధులు మంజూరు చేయకపోవడం గమనార్హం.
అధికార పార్టీ నాయకులు కన్నెత్తి చూడలేదు
- ఆనంద్, దర్గాహొన్నూరు
వైకాపా ప్రభుత్వ హయాంలో ఎడారి నివారణ పథకం నిర్వీర్యం అయ్యింది. తెదేపా ప్రభుత్వ పాలనలో తమ పొలాలకు వ్యవసాయ బోర్లు వేయించి డ్రిప్ సౌకర్యం కల్పించారు. సపోటా, హైబ్రిడ్ రేగు చెట్ల పెంపకం చేపట్టాం. వైకాపా ప్రభుత్వం ఇసుక దిబ్బల్లో ఒక్క బోరు వేయించలేదు. ఐదేళ్లలో ఎడారి నివారణ పథకాన్ని పట్టించుకోలేదు. ఒక్క సాయం కూడా చేయలేదు.
పంటల సాగుకు అవస్థలు
- రాజశేఖరగౌడ్, రైతు, తుంబిగనూరు
నాకున్న ఆరెకరాల్లో ఇసుక దిబ్బలు విస్తరించి ఉన్నాయి. ఏటా పంటల సాగుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. ఇసుక దిబ్బలు తరలించడం కష్టంగా ఉంది. తెదేపా ప్రభుత్వ హయాంలో ఎడారి నివారణలో భాగంగా నల్లరేగడి నేలల రైతుల పంట పొలాలకు ఉచిత ఇసుక తరలింపు చేపట్టారు. వైకాపా ప్రభుత్వం ఇసుక దిబ్బల నివారణను అటకెక్కించడంతో అవస్థ పడుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మిరప రైతుపై శీతకన్ను
[ 20-05-2024]
మిరప రైతుకు తీరని నష్టం ఏర్పడింది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యం, మరోవైపు గిట్టుబాటు ధరలు లేని కారణంగా వారికి కలిగిన నష్టం అపారం. కానీ, ప్రభుత్వం మిరప రైతులకు పంట నష్ట పరిహారం వర్తింపజేయకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. -
కాలువల నిండా పూడిక.. సాగు సాగేదెలా ఏలిక?
[ 20-05-2024]
శ్రీసత్యసాయి జిల్లాలో చెరువుల కట్టలు బలహీనంగా మారాయి. తూములు దెబ్బతిని మొరాయిస్తున్నాయి. కాలువలు పూడిక, ముళ్లపొదలతో నిండిపోయాయి. చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి లేదు. -
కష్టాలు కనవయ్యా.. వీరభద్రా!
[ 20-05-2024]
లేపాక్షి దుర్గా, పాపనాశేశ్వర, వీరభద్రస్వామి ఆలయానికి వచ్చే భక్తులకు కనీస మౌలిక వసతుల కల్పన, పర్యవేఓణలో నిర్లక్ష్యం అణువణువునా కనపడుతుంది. -
పతకం కల.. దక్కించుకునే పట్టుదల
[ 20-05-2024]
ఆ బాలుడు ఆరో తరగతిలో లాన్ టెన్నిస్ రాకెట్ పట్టాడు. మూడేళ్ల పాటు టెన్నిస్లో పెద్దగా విజయాలు సాధించలేదు. నాలుగేళ్ల క్రితం లాన్ టెన్నిస్ నుంచి సాఫ్ట్ టెన్నిస్లో అడుగుపెట్టాడు. గేమ్ మొత్తం లాన్ టెన్నిస్ మాదిరిగానే ఉంటుంది. -
నేటి నుంచి పెన్నహోబిలం శ్రీవారి బ్రహ్మోత్సవాలు
[ 20-05-2024]
పెన్నహోబిలం లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. ఉత్సవాలకు రాష్ట్రంతోపాటు కర్ణాటక ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. -
కౌంటింగ్కు మూడంచెల భద్రత
[ 20-05-2024]
జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసేలా పటిష్ట చర్యలు చేపడతామని జిల్లా నూతన ఎస్పీ గౌతమిశాలి పేర్కొన్నారు. ఆమె ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయం ఎస్పీ ఛాంబర్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. -
సిట్ దర్యాప్తుపై తొలగని ఉత్కంఠ
[ 20-05-2024]
తాడిపత్రిలో ఎన్నికల అనంతరం జరిగిన గొడవలపై సిట్ అధికారుల బృందం చేపట్టిన విచారణ ఆదివారం రెండో రోజూ కొనసాగింది. అత్యంత గోప్యంగా విచారణ సాగింది. మీడియా ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదు. -
ఎస్కేయూలో హాస్టళ్ల మూసివేతపై రగడ
[ 20-05-2024]
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోని వసతి గృహంలో నాన్బోర్డర్ల బెడదతో వివాదం నెలకొంది. వేసవి సెలవుల్లో కూడా మహానంది వసతి గృహం తెరచి ఉంచాలని విద్యార్థులు పట్టుపడుతున్నారు. -
కొడవలితో వైకాపా కార్యకర్త వీరంగం
[ 20-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిసి వారం రోజులు కాకుండానే ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడానికి గ్రామాల్లో వైకాపా నాయకులు వ్యూహం పన్నుతున్నారు. -
జాతీయస్థాయిలో అనంతకు ఖ్యాతి
[ 20-05-2024]
మండల పరిధిలోని కల్లూరు గ్రామంలో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి జయంతి వేడుకలను ఏకే నరసింహులు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
విద్యుదాఘాతానికి యువతి బలి
[ 20-05-2024]
విద్యుదాఘాతంతో వివాహిత మృతి చెందిన ఘటన బెళుగుప్ప మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని విరుపాపల్లికి చెందిన చైతన్య(22) సోమవారం ఉదయం ఇంటి దగ్గర విద్యుత్తు మోటారును ఆన్ చేయడానికి ప్రయత్నించింది. -
టిప్పరు, ద్విచక్ర వాహనం ఢీ
[ 20-05-2024]
ద్విచక్ర వాహనం, టిప్పరు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని నల్లబోయనపల్లి జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకుంది. -
పనితీరు మార్చుకోకపోతే చర్యలు
[ 20-05-2024]
ఉపకారాగారంలో ఉంటున్న కొంత మంది నిందితులకు గుర్తింపుకార్డులు ఇవ్వక, కారాగారానికి సంబంధించిన దస్త్రాలు సక్రమంగా నిర్వహించకపోవడంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ ఉపకారాగారం అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
నలుగురు ఐసీస్ అనుమానిత ఉగ్రవాదులు అరెస్టు
-
టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
-
బాధితుల వేదనను ప్రసారం చేయడం తప్పా?: నాదెండ్ల
-
ప్రశాంతమైన పల్నాడుని వల్లకాడు చేశారు: ధూళిపాళ్ల
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నానికి కౌంట్డౌన్ షురూ..: ప్రధాని మోదీ