పరికరం లేదు.. నీడా కానరాదు..!
పల్లెల్లోని పేదలకు కనీస ఆదాయం కల్పించడంతో పాటు గ్రామాల్లో సామాజిక ఆస్తులను సృష్టించడమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది. పనిచేసిన 15 రోజుల్లోగా కూలీల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉండగా క్షేత్రస్థాయిలో నెల రోజులకూ ఆ పరిస్థితి కనిపించడంలేదు. పనికి అవసర
ఐదేళ్లుగా ఉపాధి కూలీలకు అందని గడ్డపారలు
సొంత డబ్బులతో కొనుగోలు చేస్తున్న వైనం
పెద్దపంజాణి మండలం చిన్నారికుంట చెరువులో ఫిష్పాండ్ పనిలో నిమగ్నమైన కూలీలు
ఈనాడు డిజిటల్, చిత్తూరు- న్యూస్టుడే, పెద్దపంజాణి: గ్రామాల్లో జాబ్ కార్డులున్న వ్యక్తులకు ఏడాదికి వంద పనిదినాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇదే సమయంలో వంద రోజులు పనిచేసే బృందాలకు గడ్డపార (గునపం) అందించాలి. పదును పెట్టేందుకు వారానికి రూ.10 చొప్పున నగదు జమ చేయాలి. ఐదేళ్లుగా గునపాలు సరఫరా చేయడంలేదు. ఈ విషయమై సిబ్బందిని ప్రశ్నిస్తే సమాధానం కరవవుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన తర్వాతే ఇస్తామని చెబుతున్నారు. అధికారులను అడిగితే.. కూలి ఖర్చులో కలిపి ఈ మొత్తాన్ని అందిస్తున్నామని అంటున్నారు. దీంతో ఎక్కడ కూలి తక్కువ వస్తుందోననే ఉద్దేశంతో కూలీలే సొంతంగా వాటిని సమకూర్చుకుంటున్నారు. మరికొందరు అరిగిన గడ్డపారలతోనే పనులు చేస్తున్నారు.
సేద తీరాలంటే చెట్ల చెంతకు వెళ్లాల్సిందే
పని ప్రదేశంలో కూలీలు సేదతీరే ప్రాంతంలో కచ్చితంగా నీడను కల్పించాలని కేంద్రం నిర్దేశించింది. ప్రభుత్వం నుంచి టార్పాలిన్లు రాకపోవడంతో జిల్లావ్యాప్తంగా కూలీలు పని ముగిసిన తర్వాత ఎండలోనే కూర్చోవాల్సి వస్తోంది. సమీపంలో చెట్లు ఉంటే వాటి చెంత సేద తీరుతున్నారు. పనులు చేస్తున్న సందర్భంలో కూలీలకు గాయాలైతే ప్రథమ చికిత్స కిట్ కూడా అందుబాటులో ఉండటం లేదు.
సొంతంగా కొన్నా
ఉపాధి పనులకు అరిగిపోయిన గడ్డపార తీసుకెళ్లాలంటే ఇబ్బందిగా ఉంది. దీంతో సొంతంగా డబ్బులు వెచ్చించి గడ్డపార కొనుగోలు చేసి పనులు చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే ఉపాధి కూలీలకు పరికరాలు, పని ప్రదేశంలో నీడ, మెడికల్ కిట్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. - వెంకట రమణ, ఉపాధి కూలీ, చిన్నారికుంట
జిల్లాలో జాబ్కార్డులున్న కుటుంబాలు : 1,50,682
ఏప్రిల్ చివరి నాటికి పనుల్లో పాల్గొన్నవి : 45,956
వీరికి కల్పించిన పనిదినాలు : 6,06,248
నిలువ నీడలేక చెట్టు కింద సేదతీరుతున్న కూలీలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సైకిల్పై ప్రచారం చేస్తున్న కార్యకర్తపై వైకాపా మూకదాడి
[ 07-05-2024]
కుప్పం మండలం కొట్టాలూరు పంచాయతీ సిద్ధప్పనూరు గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్త స్వామినాథన్పై సోమవారం సాయంత్రం వైకాపా మూకలు దాడికి పాల్పడ్డాయి. -
ఓటమిని జగన్ ముందే ఒప్పుకొన్నారు
[ 07-05-2024]
అంతర్జాతీయ స్థాయిలో అవినీతిలో పురస్కారాలు ఇవ్వదలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి, ఆయన మంత్రివర్గానికి ఇవ్వాలని సినీనటుడు, జనసేన నాయకుడు పృథ్వీరాజ్ ఎద్దేవా చేశారు. -
బాబు భరోసా.. జగన్ రుసురుస
[ 07-05-2024]
ప్రభుత్వాన్ని అనుసరించి పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తుంటారు. జిల్లా పరిధిలో పరిశీలిస్తే చంద్రబాబు హయాంలో భారీ పరిశ్రమలు క్యూ కట్టగా.. జగన్ ప్రభుత్వం కొత్తగా భారీ పరిశ్రమలు తెచ్చింది ఏమీ లేదు. -
నా అంటూ వల్లించి.. వంచించి
[ 07-05-2024]
నా ఎస్సీలు, నా ఎస్టీలని సీఎం జగన్ బహిరంగ సభల్లో గొప్పగా ఊదరగొడుతుంటారు. అయితే అదంతా ధృతరాష్ట్ర ప్రేమ అని ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు చేసిన ఘనకార్యాలను పరిశీలిస్తే అర్థమవుతుంది. -
ఏది కుట్ర.. ఎవరిది అరాచకం
[ 07-05-2024]
ఆధ్యాత్మిక నగరం తిరుపతిపై ఎన్టీఆర్ మొదలు ఎందరో నేతలు తమదైన అభివృద్ధి ముద్ర వేశారు. -
మురిపించి.. విస్మరించి..
[ 07-05-2024]
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అనే బండికి వ్యవసాయం, పాడి.. జోడుచక్రాలు. ఐదేళ్ల వైకాపా పాలనలో జిల్లాలో వ్యవసాయ రంగం కుదేలైంది. -
అసంపూర్తి భవనాలే.. అభివృద్ధి కలే
[ 07-05-2024]
ప్రతి పంచాయతీలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ ఏర్పాటుకు వైకాపా ప్రభుత్వం శ్రీకారం చుట్టి మూడేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అవి అందుబాటులోకి రాలేదు. -
ఇదేం జగన్.. ఇలా చేశావ్
[ 07-05-2024]
చేతికందినా.. నోటికందలేదన్న సామెత పింఛన్ల లబ్ధిదారులకు అచ్చుగుద్దినట్లు సరిపోతుంది. -
‘రాక్షస పాలనకు అంతం పలకండి’
[ 07-05-2024]
మంచి చేసేవారికి ఓటేసి అరాచక పాలనకు అంతం పలకాలని తెదేపా అభ్యర్థి గురజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. -
నేడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ రాక
[ 07-05-2024]
తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్లు తిరుపతి నగరంలో పర్యటించనున్నారు. -
కుప్పంలో నేడు, రేపు.. నారా భువనేశ్వరి పర్యటన
[ 07-05-2024]
తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడి సతీమణి భువనేశ్వరి మంగళ, బుధవారాల్లో కుప్పం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించనున్నారు. -
మా పేర్లెక్కడ సారూ..!
[ 07-05-2024]
ఎన్నికల విధుల్లోని సిబ్బంది పోస్టల్ బ్యాలెట్ వినియోగ ప్రక్రియ రెండో రోజైన సోమవారమూ కొనసాగింది. -
వైకాపాకు నిబంధనలు వర్తించవా..
[ 07-05-2024]
కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేకుండా గుడుపల్లె వైకాపా ఎంపీపీ వరలక్ష్మి వెళ్లారు. -
ముస్లింలకు ప్రత్యేక వ్యాక్సినేషన్
[ 07-05-2024]
హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు ప్రత్యేక వ్యాక్సినేషన్ అందిస్తున్నామని.. ఈ యాత్రకు వెళ్లే ప్రతిఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని డీఎంహెచ్వో ప్రభావతిదేవి తెలిపారు. -
సీఈసీ స్పందన హర్షణీయం
[ 07-05-2024]
అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేయడం హర్షణీయమని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవైపీ) అధ్యక్షుడు రామచంద్రయాదవ్ ఓ ప్రకటనలో సోమవారం పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ వర్షం.. కరీంనగర్లో కూలిన టెంట్లు
-
వాటర్ ట్యాంక్లో మహిళ మృతదేహం.. యూనివర్సిటీలో కలకలం
-
ప్రజల నమ్మకాన్ని కోల్పోతే.. ఇంకేం మిగలదు: దీదీ సర్కారుకు సుప్రీం చురక
-
రూ.కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో వెళ్తున్న కంటెయినర్ బోల్తా.. తర్వాత ఏమైందంటే?
-
నష్టాల్లో సూచీలు.. 383 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
శామ్సంగ్ కొత్త పవర్బ్యాంకులు.. ఒకేసారి 3 డివైజ్లకు ఛార్జింగ్