ఒకటో తేదీ వచ్చే..
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే: ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ గత కొంతకాలంగా జమ కావడం లేదు
జీతాలు, పింఛన్లు జమయ్యేనా ?
చిత్తూరు కలెక్టరేట్, న్యూస్టుడే: ఒకటో తేదీన ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాల్లోకి వేతనాలు, విశ్రాంత ఉద్యోగులకు పింఛన్ గత కొంతకాలంగా జమ కావడం లేదు. ఠంఛనుగా జరిగే ఈ ప్రక్రియ వారాల తరబడి సాగదీత ప్రక్రియగా మారుతోంది. గత నెలలో సంక్రాంతి పండుగ సమయంలోనూ వేతనాలు, పింఛన్లు జమ కాని పరిస్థితి జిల్లాలో కనిపించిందని ఉద్యోగ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్య పరిష్కారానికి ఉద్యమించే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు.. తమ ఉద్యమాల్లో ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు వేయాలని డిమాండు చేసే పరిస్థితికి రావడం గమనార్హం. జనవరి నెల జీతం బుధవారం జమవుతుందా అనే సందేహాలు ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఖజానా శాఖ ఉద్యోగులు ప్రతి నెలా బిల్లుల్ని సకాలంలో అప్లోడ్ చేసినా ఒకటో తేదీ జీతం రావడం కష్టమవుతోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మొత్తం 22 ఉప ఖజానాల పరిధిలో వెయ్యి మంది డ్రాయింగ్ డిస్బర్స్మెంట్ అధికారులు (డీడీవో) ఉన్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగులు 50 వేల మంది, పింఛనర్లు మొత్తం 30 వేల మంది ఉన్నారు. గెజిటెడ్ స్థాయి అధికారుల నుంచి క్లాస్-4 స్థాయి వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇంకా ఆప్కాస్ కింద, ఒప్పంద పద్ధతిలో పనిచేస్తున్న వారు ఉన్నారు. ఉద్యోగులకు సంబంధించి ప్రతి నెలా అన్ని రకాల బిల్లులు 4 వేల వరకు అందుతున్నాయి. ప్రతి నెలా 17 నుంచి 25లోపు సంబంధిత డీడీవోల నుంచి ఎస్టీవో కార్యాలయాలకు జీతాల బిల్లులు అప్లోడ్ చేస్తారు. 26 నుంచి 30వ తేదీ లోపు సదరు ఎస్టీవోలు సీఎఫ్ఎంఎస్ పోర్టల్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులు, పెన్షనర్లు తమకు వచ్చే నగదుతో ఇంటి అద్దె, ఈఎంఐలు, సరకులు, పిల్లల చదువులు, వైద్య అవసరాలకు చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. గతకొన్ని నెలలుగా జీతం ఆలస్యమవుతుండటంతో ఉద్యోగులకు ఇబ్బందులు తప్పట్లేదు.
ఎదురుచూపులు
పెన్షనర్లకు పీఆర్సీ బకాయిలు జమవుతాయా లేదా అని విశ్రాంత ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. నాలుగు త్రైమాసిక కంతుల పీఆర్సీ బకాయిల చెల్లింపులు ఇంకా పెండింగ్లో ఉందని విశ్రాంత ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఇందులో మొదటి కంతును జనవరి పింఛన్తో కలిపి చెల్లించాలన్న వినతులు అమలవుతాయో? లేదో వేచి చూడాలి మరి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐదు నామినేషన్లు తిరస్కరణ
[ 26-04-2024]
తెదేపా తరఫున నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సతీమణి గుల్నాజ్ బేగం పార్టీ బీఫారం సమర్పించకపోవడంతో నామినేషన్ తిరస్కరించారు. -
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
[ 26-04-2024]
అసలే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపాకు ఇప్పుడు కాంగ్రెస్ రూపంలో కొత్త కష్టం వచ్చింది. -
అగ్రాసనం అంటివి.. మరణశాసనం రాస్తివి
[ 26-04-2024]
వ్యవసాయం దండగ కాదు.. పండగ చేస్తామని ఆర్భాటపు ప్రకటనలిచ్చిన సీఎం జగన్ ఆచరణలో అన్నదాతను గాలికొదిలేశారు. -
జేఈఈలో జయకేతనం
[ 26-04-2024]
తిరుపతి విద్యార్థులు రాణించారు. జేఈఈ మెయిన్ ఫలితాల్లో సత్తాచాటారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించి శెభాష్ అనిపించారు. -
సమయం అయిపోయింది.. ఫాం- 12 తీసుకోం!
[ 26-04-2024]
పోలీసు శాఖలో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఫాం-12 సమర్పణకు శుక్రవారం వరకు సమయం ఉన్నా ఏప్రిల్ 23తో గడువు ముగిసిందని ఏఎస్పీ ఆరిఫుల్లా తెలిపారని ఆ శాఖ సిబ్బందే చర్చించుకున్నారు. -
ఆఖరు రోజున 130 నామపత్రాలు
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. మొత్తంగా గురువారం ఒక్క రోజునే ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు కలిపి జిల్లాలో 130 సెట్ల నామపత్రాలు దాఖలు కావడం విశేషం. -
పైలెట్ ప్రాజెక్టు అమలులో పల్టీలు
[ 26-04-2024]
‘మొదటిదశలో క్యాన్సర్ను గుర్తిస్తేనే నివారణ సాధ్యం. వ్యాధి గుర్తింపు, అవగాహన లోపంతో ఎంతోమంది బలవుతున్నారు. -
ఇలా బయల్దేరి.. అలా ఆగుతూ
[ 26-04-2024]
ఆర్టీసీ బస్సులపై వైకాపా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించటంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పటం లేదు. -
క్రమబద్ధీకరణ..జగన్ విస్మరణ
[ 26-04-2024]
అందని ద్రాక్షపళ్లులా.. రాష్ట్రంలోని ఒప్పంద ఉద్యోగుల పరిస్థితి తయారైంది. ఐదేళ్లుగా క్రమబద్ధీకరణ కలలుగన్న వారి ఆశలు చివరకు అడియాసలయ్యాయి. -
రామచంద్రయాదవ్పై 28 కేసులు
[ 26-04-2024]
బీసీవైసీ అధ్యక్షుడు రామచంద్రయాదవ్పై 28 కేసులు ఉన్నట్లు నామపత్రాల్లో పేర్కొన్నారు. వీటిలో చాలా వరకు వైకాపా ప్రభుత్వం పెట్టినవిగా ఆయన ఆరోపించారు. అలాగే వారి దంపతుల వద్ద 596 గ్రాముల బంగారు ఆభరణాలున్నాయి. -
రెండు నిమిషాల ఆలస్యం.. నామినేషన్కు నో ఎంట్రీ
[ 26-04-2024]
ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో పోటీకి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు గడువు ముగిసింది. -
‘అవినీతి వైకాపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలి’
[ 26-04-2024]
తెదేపా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముస్లిం మైనారిటీలకు సూపర్ సిక్స్ పథకాలతో పాటు డిమాండ్లను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. -
తిరుపతిలో రణరంగం.. వైకాపా కార్యకర్తల వీరంగం
[ 26-04-2024]
చంద్రగిరి నియోజకవర్గ తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ దాఖలు ఘట్టం గురువారం రణరంగంగా మారింది. పోలీసులు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడంతో తీవ్ర ఉద్రికత్తకు దారితీసింది. -
తెదేపా, జనసేన అభ్యర్థులను గెలిపించాలి
[ 26-04-2024]
ఉమ్మడి కూటమి నేతలు అంతా ఏకమై తిరుపతి ఎమ్మెల్యేగా ఆరణి శ్రీనివాసులు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్రెడ్డిని గెలిపించుకుని తన వద్దకు రావాలని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్కళ్యాణ్ ఆయా పార్టీల నాయకుల్ని ఆదేశించారు. -
వాస్తవాలు చెప్పినా తప్పేనా?
[ 26-04-2024]
ఉపాధ్యాయులు పాఠశాలలో అంతర్జాలం లేదని నిజం చెప్పినందుకు తిరుపతి గ్రామీణ మండలంలోని ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు డీఈవో షోకాజ్ నోటీసులు జారీచేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?