ఎన్నిక ఏదైనా నగరంలో ప్రత్యేకమే
తిరుపతిలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నిక ఏదైనా విజయం కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న దొడ్డిదారి పనులు మేధావులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి.
నకిలీ ఓట్ల ప్రభావం
ఈనాడు-తిరుపతి; న్యూస్టుడే, తిరుపతి(నగరపాలిక): తిరుపతిలో నాలుగేళ్లుగా జరుగుతున్న ఎన్నికలు చర్చనీయాంశంగా మారాయి. ఎన్నిక ఏదైనా విజయం కోసం అధికార పార్టీ నాయకులు చేస్తున్న దొడ్డిదారి పనులు మేధావులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఎన్నికల ప్రకటన సమయం నుంచి తెరవెనుక జరిగే కుట్రలు ఎన్నికల ముందు రోజు వరకు బయటకు పొక్కనీయడం లేదు. అప్రజాస్వామికంగా జరుగుతున్న ఎన్నికల తీరుతో విద్యావంతులు కూడా పోలింగ్కు దూరం అవుతున్నారు. ఈ కారణంగా అత్యల్ప పోలింగ్ నమోదయ్యే అసెంబ్లీ నియోజకవర్గంగా తిరుపతి నిలుస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార పార్టీ పక్కా వ్యూహంతో వ్యహరిస్తున్నట్లు ఇప్పటికే అనేక సంఘటనలు వెలుగు చూశాయి. పట్టభద్రులు కాని వేలాది మందికి ఓటు హక్కు కల్పిస్తూ ఓటరు జాబితాలో చోటు కల్పించినట్లు ఫిర్యాదులు ఎన్నికల కమిషన్కు అందాయి. ఈ వ్యవహారంలో 8 మంది అధికారులు, సిబ్బందిని ఎన్నికల విధుల నుంచి తప్పించారు. ఒక్కో ఇంటి చిరునామాతో 10 నుంచి 20కి పైగా ఓట్లు నమోదు కావడం, ఖాళీ జాగాలు, వాలంటీర్ల గృహాలు, తాళాలు వేసి ఉన్న ఇళ్లలో వాటి యజమానులకే తెలియకుండా ఓట్లు నమోదు చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. కొర్లగుంటలో 150 మంది ఆటో డ్రైవర్లకు ఓటు హక్కు కల్పించి వారందరినీ ఓటు హక్కు వినియోగించాలని భయపెడుతూ ఓ కార్పొరేటర్ పంపిన వాట్సప్ సందేశం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇతరులు నామినేషన్ వేయకుండా..
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తైన తరువాత తిరుపతిలో కార్పొరేషన్, పార్లమెంట్ ఉప ఎన్నికలు, తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికలు జరిగాయి. కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర పార్టీల వారిని నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకోవడం, మాట వినని వారిని కిడ్నాప్ చేయడం, వేసిన వారిపై దాడులు చేయడంతో పాటు బెదిరించి ఉపసంహరించుకునేలా చేయడం, అభ్యర్థులకు తెలియకుండా బినామీ సంతకాలతో నామినేషన్లు ఉపసంహరింపజేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అనంతరం జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ఇతర ప్రాంతాల నుంచి వందలాది వాహనాలతో దొంగ ఓటర్లను రప్పించి వారి వాహనాలను నగర శివార్లలో నిలిపి ఆటోల్లº తరలించి వేలాది దొంగ ఓట్లు వేయించారని ఆరోపణలు వచ్చాయి. ఇందుకోసం ప్రత్యేకంగా నకిలీ ఓటరు గుర్తింపు కార్డులను ముద్రించి వారికి పంచినట్లు విపక్షాలు గుర్తించి పోలీసులకు పట్టించినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటీవల కాలంలో జరిగిన తిరుపతి సహకార బ్యాంకు ఎన్నికల్లో 90 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కొందరు ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రంలో కూర్చొని దగ్గరుండి రిగ్గింగ్కు పాల్పడిన ఘటన అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైకాపా పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం: కిరణ్ కుమార్రెడ్డి
[ 28-04-2024]
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందని రాజంపేట లోక్సభ కూటమి అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
వెంకటగిరిలో జగన్ సభ.. జనాలకు చుక్కలు చూపించిన వైకాపా
[ 28-04-2024]
సీఎం జగన్ ఎక్కడ సభ పెట్టినా వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రోడ్లను బ్లాక్ చేస్తుండంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. -
తిరుమల శ్రీవారి సన్నిధిలో విశేష ఉత్సవాలు
[ 28-04-2024]
తిరుమల శ్రీవారి సన్నిధిలో తితిదే ఆధ్వర్యంలో మే నెలలో విశేష ఉత్సవాలు నిర్వహించనున్నారు. -
శ్మశానాలకు సమాధి.. ఆక్రమణలకు పునాది
[ 28-04-2024]
వైకాపా నేతలు ఎన్నికలప్పుడు మాత్రం శ్మశానాలు చూపిస్తామని హామీలు ఇస్తుంటారు.. ఎన్నికల అనంతరం వాటి ఊసే మరుస్తున్నారు.. పైగా స్థలాలు చూపకపోగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. -
ప్రాజెక్టుల పుణ్యం ఎన్టీఆర్దే..!
[ 28-04-2024]
రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలోని ప్రాజెక్టులను తీసుకురావడం కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైందని హిందూపురం తెదేపా అభ్యర్థి నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. -
కుప్పంలో వైకాపా హైడ్రామా..?
[ 28-04-2024]
వైకాపా అడుగడుగునా కోడ్ ఉల్లంఘిస్తున్నా.. అభివృద్ధి పనుల పేరుతో ప్రలోభాలకు తెర తీస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కుప్పం ప్రాంతంలో ఇటీవల కొందరు తెదేపా, జనసేన కార్యకర్తలు వైకాపాలో చేరగా. -
భృతిలేక.. పీఆర్సీ అమలుకాక
[ 28-04-2024]
‘ఎన్నికలకు ఆరు నెలల ముందు చేసే శంకుస్థాపనలు నమ్మొద్దు అని’ విపక్ష నేతగా చెప్పిన ప్రస్తుత సీఎం జగన్, ఇప్పుడు అచ్చం అవే పనులు చేశారు.. -
భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు
[ 28-04-2024]
వాలంటీర్లను ప్రజాప్రతినిధులు.. ఓ చోట నిర్బంధించి భయపెట్టి.. బలవంతంగా రాజీనామాలు చేయించారని తెదేపా నాయకులు ఆరోపించారు. -
‘జగన్కు ఆ నలుగురే మిగిలారు’
[ 28-04-2024]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని.. సీఎం జగన్కు ఆ నలుగురే మిగిలారని తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి పీఎస్ మునిరత్నం ఎద్దేవా చేశారు. -
‘అరాచక పాలనకు ప్రజలే బుద్ధి చెప్పాలి’
[ 28-04-2024]
ప్రజలకు జవాబుదారీగా ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని తెదేపా కూటమి చిత్తూరు ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే అభ్యర్థి మురళీమోహన్ ప్రజలకు హామీ ఇచ్చారు. -
ఇదేంది జగన్.. ఇలా ముంచేశావ్
[ 28-04-2024]
ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఐదేళ్లకోసారి చేయాల్సిన వేతన సవరణను వైకాపా ప్రభుత్వం అటకెక్కించింది.. గతేడాది జులైలో 12వ పీఆర్సీ కమిషన్ను ప్రకటించి పది నెలలు కావస్తున్నా తదుపరి ప్రక్రియ ముందుకు సాగడం లేదు.. -
‘హమీ’తుమీ తేల్చవేం జగన్
[ 28-04-2024]
మాట ఇచ్చి మడమ తిప్పను- ఇది నిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పే మాటలు. ఆయన అవసరాలు తీరేందుకు, అధికారంలోకి రావడానికి ఎన్ని అబద్ధాలైనా చెబుతారు. -
సీఎం వస్తున్నారని హడావుడి పనులు
[ 28-04-2024]
త్రిభువని కూడలి వద్ద సీఎం సభ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం జనార్దన్రెడ్డి విగ్రహం ముందు భాగంలో కాలువపై బండ పగిలిపోయింది.
తాజా వార్తలు (Latest News)
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!