logo

బీసీసీఐ పరిశీలకుడిగా చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి నియామకం

తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి అరుదైన గౌరవం వరించింది. ఇండియా, ఆస్ట్రేలియా వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ బీసీసీఐ పరిశీలకుడిగా నియమితులయ్యారు.

Published : 22 Mar 2023 03:52 IST

తిరుపతి(క్రీడలు), న్యూస్‌టుడే: తిరుపతి గ్రామీణ మండలం తుమ్మలగుంటకు చెందిన చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డికి అరుదైన గౌరవం వరించింది. ఇండియా, ఆస్ట్రేలియా వన్డే క్రికెట్‌ మ్యాచ్‌ బీసీసీఐ పరిశీలకుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రకటించింది. బుధవారం చెన్నై వేదికగా జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో హర్షిత్‌రెడ్డి బీసీసీఐ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా బాలబాలికల క్రికెట్‌ అసోసియేషన్‌ కార్యదర్శిగా చెవిరెడ్డి హర్షిత్‌ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇంతటి గౌరవప్రదమైన నియామకాన్ని అందించిన ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) ఉపాధ్యక్షుడు రోహిత్‌ రెడ్డ, కార్యదర్శి గోపినాథ్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని