logo

తిరుమల సమీపంలో ఎర్రచందనం స్వాధీనం

తిరుమల సమీపంలోని పాపనాశనం అటవీ ప్రాంతంలో ఏపీ టాస్క్‌ఫోర్స్‌ బలగాలు దాడులు నిర్వహించి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నాయి.

Published : 27 Mar 2023 02:04 IST

జీవకోన(తిరుపతి), న్యూస్‌టుడే:  తిరుమల సమీపంలోని పాపనాశనం అటవీ ప్రాంతంలో ఏపీ టాస్క్‌ఫోర్స్‌ బలగాలు దాడులు నిర్వహించి ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నాయి. టాస్క్‌ఫోర్స్‌ పోలీస్‌స్టేషన్‌ సీఐ బాలకృష్ణ కథనం మేరకు.. ‘టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ చక్రవర్తి ఆదేశాల ప్రకారం డీఎస్పీ మురళీధర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఐ సురేష్‌కుమార్‌రెడ్డి, ఆర్‌ఎస్సై వినోద్‌కుమార్‌కు చెందిన బలగాలు శనివారం రాత్రి తిరుమల రేంజ్‌లోని పాపనాశనం డ్యామ్‌ పరిధిలో కూంబింగ్‌ నిర్వహించారు. తుంబురుతీర్థం సమీపంలో నిషేధిత అటవీ ప్రాంతంలో కొందరు స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకుని వెళ్తూ కనిపించారు. వెంటనే అప్రమత్తమైన బలగాలు పట్టుకోవడానికి ప్రయత్నించగా స్మగ్లర్లు పారిపోయారు. సంఘటనా స్థలంలో 16 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు’ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని